HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Kcr Only Worked To Make His Son Telangana Cm Amit Shah

Telangana: కేసీఆర్ లక్ష్యం కేటీఆర్ ని సీఎం చేయడమే: షా

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదేళ్ల పాలనలో పేదల కోసం ఏనాడూ పని చేయలేదని, తన కుమారుడు కేటీఆర్ ను సిఎంగా ఎలా చేయాలన్న దానిపైనే దృష్టి కేంద్రీకరించారని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు.

  • Author : Vamsi Chowdary Korata Date : 10-10-2023 - 6:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana (16)
Telangana (16)

Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదేళ్ల పాలనలో పేదల కోసం ఏనాడూ పని చేయలేదని, తన కుమారుడు కేటీఆర్ ను సిఎంగా ఎలా చేయాలన్న దానిపైనే దృష్టి కేంద్రీకరించారని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. ఈ రోజు తెలంగాణ పర్యటనలో భాగంగా అమిత్ షా మహబూబ్ నగర్ బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా షా తెలంగాణ సీఎం కేసీఆర్, కేటీఆర్, ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

రాష్ట్రంలోని బిఆర్‌ఎస్ ప్రభుత్వం గిరిజనులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు వంటి ఎన్నికల హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు.కొడుకును సీఎం చేయడమే కేసీఆర్ లక్ష్యం. కానీ ఆదిలాబాద్‌లోని ప్రతి గిరిజనుడికి విద్య, ఉద్యోగాలు, రైతులకు నీరు అందేలా చూడడమే బీజేపీ లక్ష్యం’ అని అమిత్ షా చెప్పారు. తెలంగాణ ప్రజలు రెండు రకాలుగా ఆలోచించాలి. ఒకటి కొడుకు, కూతురి గురించి ఆలోచించే కేసీఆర్ ప్రభుత్వం, మరోవైపు దళితులు, పేదలు, ఆదివాసీల గురించి ఆలోచించే ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం. ఈ రెండు ప్రభుత్వాలలో మీకు ఏ ప్రభుత్వం కావాలో ఆలోచించండి అంటూ అమిత్ షా అన్నారు.

తెలంగాణకు డబుల్ ఇంజన్ ప్రభుత్వం కావాలి. అంటే కేంద్రంతో పాటు రాష్ట్రంలోనూ మోడీ ప్రభుత్వం ఉండాలి. నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రైతుల ఆత్మహత్యలు, మహిళలు, పిల్లలపై జరుగుతున్న నేరాల్లో తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచిందని షా ఆరోపించారు. ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీకి కేసీఆర్‌ కారు స్టీరింగ్‌ ఉందని, అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల చిహ్నాన్ని కూడా ఆయన పునరావృతం చేశారన్నారు.

మజ్లిస్ ఆదేశాల మేరకే కేసీఆర్ ప్రభుత్వం నడుస్తోందని ఆరోపించారు. మజ్లిస్‌ సూచనల మేరకు తెలంగాణ రాష్ట్రం నడపాలని కోరుకుంటున్న కేసీఆర్‌ ప్రభుత్వాన్ని గద్దె దించి, బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని షా ప్రజలను కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని విస్మరించింది. ఆ మందిరాన్ని నిర్మించడానికి ప్రధాని మోదీ చొరవ తీసుకున్నారని, 2024 జనవరి నాటికి గొప్ప ఆలయం సిద్ధమవుతుందని అమిత్ షా తెలిపారు.

Also Read: E-commerce: ప్రారంభమైన పండుగ సేల్స్.. మూడు రోజుల్లోనే 4 లక్షలకు పైగా ఐఫోన్లు అమ్మకాలు..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AIMIM
  • amit shah
  • bjp
  • brs
  • congress
  • kcr
  • ktr
  • mahabubnagar
  • telangana

Related News

Revanth Speech

CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

తెలంగాణలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అంశం మరోసారి రాజకీయ చర్చకు కేంద్రబిందువైంది. ఉచిత విద్యుత్, వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్ల వ్యవహారంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి.  ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా కొనసాగుతుందనితేల్చి చెప్పారు.ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభు

  • Komatireddy

    Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

  • Jaggareddy

    TPCC : హైదరాబాద్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసిన జగన్నారెడ్డి

  • Accident

    Road Accident : ఖ‌మ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కానిస్టేబుల్ మృతి

  • Indiramma Houses

    CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

Latest News

  • Bengaluru : మటన్ పేరుతో బీఫ్ విక్రయం?.. బెంగళూరులో ఇద్దరు రెస్టారెంట్ యజమానుల అరెస్ట్

  • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

  • TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

  • Health : హైబీపీ – సైలెంట్ కిల్లర్‌ను నిర్లక్ష్యం చేయకండి – డా. చింతా ప్ర‌భాక‌ర్ రెడ్డి

  • New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd