YS Sharmila: తెలంగాణాలో 119 మంది రైతులకు సీట్లు ఇవ్వాలి: షర్మిల
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై టీఎస్ఆర్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
- By Praveen Aluthuru Published Date - 02:29 PM, Sat - 20 May 23
YS Sharmila: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై టీఎస్ఆర్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రైతుల్ని ముంచింది కాకా ఇప్పుడు మహారాష్ట్ర రైతుల్ని తన బుట్టలో వేసుకోవాలని చూస్తున్నాడని ఎండగట్టారు వైఎస్ షర్మిల. ఈ రోజు శనివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ కెసిఆర్ పై నిప్పులు చెరిగారు.
తెలంగాణ రాజకీయాల్లోకి ప్రవేశించిన వైఎస్ షర్మిల అధికార పార్టీ బీఆర్ఎస్ పై ఎప్పటికప్పుడు విమర్శలు గుప్పిస్తున్నారు. కెసిఆర్ నిర్ణయాలను తప్పు పట్టడమే కాకుండా అధికార యంత్రాంగంపై ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు. ఇటీవల అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికంది వచ్చిన పంట నీటిపాలవ్వడంతో తమ గోడును ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. ఇక నష్టపోయిన రైతుల్ని పరామర్శించేందుకు వెళ్లిన షర్మిల పలు జిల్లాలను సందర్శించారు. ఈ సందర్భంగా సీఎం కెసిఆర్ ని టార్గెట్ చేశారు. ఈ సందర్భంగా కెసిఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం కెసిఆర్ నాయకత్వంలో గత 9 ఏళ్లలో వేలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆమె అన్నారు. తెలంగాణ రైతుల్ని మోసం చేస్తూ సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాడంటూ సంచలన ఆరోపణలు చేసిందామె.
ఈ రోజు శనివారం వైఎస్ షర్మిల సీఎం కెసిఆర్ ని టార్గెట్ చేస్తూ… తెలంగాణ రైతుల్ని మోసం చేయడమే కాకుండా ఇప్పుడు మహారాష్ట్ర రైతుల్ని మోసం చేసేందుకు కుట్ర పన్నుతున్నాడని మండిపడ్డారు. మహారాష్ట్రలో రైతు రాజ్యం రావాలనే కెసిఆర్ తెలంగాణాలో కూడా ఆ ప్రకటన అమలు చేయగలవా అంటూ సూటిగా ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటె తెలంగాణాలో ఓ రైతుని సీఎం చేయాలని, క్యాబినెట్లోకి రైతులు మంత్రులుగా ఉండాలని, అలాగే తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజవర్గంలో రైతులకి సీట్లు ఇచ్చి నిలబెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. సీఎం కెసిఆర్ అధికారం చేపట్టిన నాటి నుండి ఇప్పటివరకు తొమ్మిదివేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆమె గుర్తు చేశారు. తెలంగాణ మోడల్ అంటే ఇదేనా కెసిఆర్ అంటూ వైఎస్ షర్మిల సీఎంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Read More: Karnataka Government : సీఎం, డిప్యూటీ సీఎంలుగా సిద్ధరామయ్య, డీకే ప్రమాణం
Related News
Rains : భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను అలర్ట్ చేసిన సీఎం రేవంత్
తూర్పు విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగిన ఆవర్తనం కారణంగా తెలంగాణ ఐదు రోజుల పాటు కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది