Telangana: కేసీఆర్ హైదరాబాద్ ని లూటీ చేసిండు, కవిత అరెస్ట్ కాలేదు
తెలంగాణ ఎన్నికలకు ముందు రాజకీయ సమీకరణాలు ఒక్కొక్కటిగా మారిపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ గూటికి చేరిన రాజగోపాల్ రెడ్డి మళ్ళీ సొంత గూటికే చేరిపోయారు. ఈ మేరకు ఆయన బీజేపీని వీడుతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ విధానాలపై విమర్శలు గుప్పించారు.
- By Praveen Aluthuru Published Date - 11:49 PM, Wed - 25 October 23
Telangana: తెలంగాణ ఎన్నికలకు ముందు రాజకీయ సమీకరణాలు ఒక్కొక్కటిగా మారిపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ గూటికి చేరిన రాజగోపాల్ రెడ్డి మళ్ళీ సొంత గూటికే చేరిపోయారు. ఈ మేరకు ఆయన బీజేపీని వీడుతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ విధానాలపై విమర్శలు గుప్పించారు.
కేసీఆర్ కుటుంబం లక్షల కోట్లు దోచుకున్నదని, హైదరాబాద్ చుట్టూ బినామీలతో 10 వేల ఎకరాలు దోచుకున్నారని కోమట్ రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఆరోపించారు. లక్షల కోట్ల ప్రాజెక్టులు, మైనింగ్, గ్రానైట్ మాఫియా, ఇసుక మాఫియా ఇలా లక్షల కోట్లు దండుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు.
పదేళ్లుగా అవినీతిపై చర్యలు తీసుకోకపోవడం వల్లే బీజేపీ, బీఆర్ ఎస్ ఒక్కటేనని తేలిపోయిందన్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయినా, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కుమార్తె కవిత, అవినీతిపై బిజెపి చర్యలు తీసుకుంటుందనే ఆశతో బిజెపిలో చేరానని, అయినప్పటికీ అరెస్టు చేయలేదని ఆయన అన్నారు. , కేసీఆర్ కుటుంబ అవినీతిపై గత 10 ఏళ్ల నుంచి బీజేపీ చర్యలు తీసుకోలేదని, దీంతో బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని తేలిపోయింది. ప్రజలు కూడా అలాగే అనుకుంటున్నారు. అందుకే మళ్లీ కాంగ్రెస్లో చేరినట్లు క్లారిటీ ఇచ్చారు.
Also Read:Ghar Wapsi: కాంగ్రెస్ లోకి రాజగోపాల్ రెడ్డి.. నష్టం బీజేపీకా.. బీఆర్ఎస్ కా?
Related News
Rain Alert : మే 20 వరకు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు
గత 10 రోజులుగా రాష్ట్ర వ్యాప్తమగు చిరు జల్లులు పలకరిస్తూ చల్లపరుస్తూ వస్తున్నాయి. ఇక నిన్న గురువారం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షం పడింది