KCR Politics: కేజ్రీవాల్ తో కేసీఆర్ భేటీ లే.. మరి పీకే ప్లాన్ అలా ఎందుకు మారింది?
తెలంగాణ సీఎం కేసీఆర్ నేషనల్ పాలిటిక్స్ ఎపిసోడ్ మాంచి దూకుడుమీదే ఉంది. ఆ ఆవేశం ఆయనలో కనిపిస్తున్నా... అవతలి పరిస్థితులు మరీ అంత అనుకూలంగా ఉన్నట్టు అనిపించడం లేదు. దీనికి కారణాలు వేరువేరుగా ఉన్నాయి.
- By Hashtag U Published Date - 09:35 AM, Thu - 3 March 22
తెలంగాణ సీఎం కేసీఆర్ నేషనల్ పాలిటిక్స్ ఎపిసోడ్ మాంచి దూకుడుమీదే ఉంది. ఆ ఆవేశం ఆయనలో కనిపిస్తున్నా… అవతలి పరిస్థితులు మరీ అంత అనుకూలంగా ఉన్నట్టు అనిపించడం లేదు. దీనికి కారణాలు వేరువేరుగా ఉన్నాయి. పీకే టీమ్ తో ఒప్పందం చేసుకున్న తరువాత వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలవడంలో బిజీగా ఉన్న కేసీఆర్.. ఢిల్లీకి కూడా వెళ్లారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను కలవడానికే అని ప్రచారం జరిగింది. కానీ అసలు ఎపిసోడ్ వేరుగా ఉంది.
కేసీఆర్ ఢిల్లీకి వెళ్లింది నిజంగానే కేజ్రీవాల్ ను కలవడానికా అంటే కాదు. అయినా సరే టీఆర్ఎస్ నేతల ప్రచారం మాత్రం అలాగే ఉంది. నిజానికి కేజ్రీవాల్ అసలు ఢిల్లీలోనే లేరు. అలాంటప్పుడు కేసీఆర్ అక్కడికి వెళ్లి ఏం చేద్దామనుకున్నారు అన్న ప్రశ్నకు జవాబుగా.. ఆయన తనతోపాటు తన సతీమణి వైద్య పరీక్షల కోసమే అక్కడికి వెళ్లారంటున్నాయి టీఆర్ఎస్ వర్గాలు. మరి కేజ్రీవాల్ తో భేటీ అన్న ప్రచారం ఎందుకు తెరపైకి వచ్చింది?
కాంగ్రెస్, బీజేపీల అండ లేకుండా ఢిల్లీలో చక్రం తిప్పాలంటే దానికి ప్రాంతీయ పార్టీల మద్దతు అవసరం. దానికోసం కేసీఆర్ చాలా వేగంగానే పావులు కదుపుతున్నారు. కానీ ఉత్తరాది ఎన్నికల్లో బిజీగా ఉన్న కేజ్రీవాల్ ఇప్పుడు కేసీఆర్ ను కలుసుకునే వీలు లేదు. పైగా ఆయన బెంగళూరులోని జిందాల్ ప్రకృతి చికిత్సాలయంలో ట్రీట్ మెంట్ తీసుకోవడానికి వెళ్లారని.. మరో వారం తరువాత వస్తారని తెలిసింది. మరి అలాంటప్పుడు ఢిల్లీలో కేసీఆర్ ఏం చేస్తున్నట్టు?
ఢిల్లీకి వెళ్లడం.. వెళ్లిన పని అవ్వక తిరిగి హైదరాబాద్ కు రావడం కేసీఆర్ కు అనుభవమే. కానీ గత అనుభవాల్లో భాగంగా ప్రస్తుత పర్యటనను చూడలేం. ఎందుకంటే బీజేపీతో రాజకీయ యుద్ధం చేస్తున్నారు. అందుకే రాజ్యాంగం మార్చాలని, రాష్ట్రాల అధికారాలను కేంద్రం లాగేసుకుంటోందని.. వాటిని అరికట్టాలని పోరాడుతున్నారు. దీనికోసమే జాతీయ రాజకీయాల్లో పట్టుకోసం ప్రయత్నిస్తున్నట్టుగా బిజీబిజీగా కనిపిస్తున్నారు.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ కు మంచి ఫలితాలు వస్తే కేజ్రీవాల్ బలం పెరుగుతుంది. అందుకే ఆయనతో ముందుగానే భేటీ అయితే.. మద్దతు సంపాదించడం తేలికవుతుంది. పైగా రైతుల మద్దతు కూడా తమ
పోరాటానికి ముఖ్యమని కేసీఆర్ కు తెలుసు. దీనికోసమే రైతు నాయకుడు టికాయత్ తో కూడా భేటీకి ప్లాన్ చేశారు. మరి కేసీఆర్ ప్లాన్ వర్కవుటవుతుందా? లేక షరా మామూలే అన్నట్టుగా మారుతుందా అన్నది చూడాలి. కాకపోతే కేసీఆర్ ఏం చేసినా దీర్ఘకాలిక వ్యూహంతోనే చేస్తారన్న సంగతిని మర్చిపోకూడదు. ఈ టోటల్ ఎపిసోడ్ లో పీకే ప్లాన్ ఎంతమేర ఉందో చూడాలి.
Related News
CM Revanth : కుటుంబ సమేతంగా ఓటు వేసిన సీఎం రేవంత్, కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు
తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ఘట్టం కొనసాగుతోంది. ఇవాళ ఎండల తీవ్రత కూడా తక్కువగానే ఉండటంతో ప్రజలు పెద్ద సంఖ్యలో ఓట్లు వేయడానికి పోలింగ్ కేంద్రాల ఎదుట బారులు తీరారు.