Ghanpur : కేసీఆర్ సార్ ఛాన్స్ ఇస్తే..ఎమ్మెల్యే గా పోటీ చేస్తానంటున్న ‘జానకీపురం సర్పంచ్ నవ్య’
బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ సార్, కేటీఆర్ అన్న అవకాశం ఇస్తే.. స్టేషన్ ఘన్పూర్లో ఎమ్మెల్యేగా నామినేషన్ వేసేందుకు సిద్ధంగా ఉన్నా
- By Sudheer Published Date - 09:30 PM, Wed - 30 August 23
జానకీపురం సర్పంచ్ నవ్య..ఈమె ఎంత ఫేమస్సో చెప్పాల్సిన పనిలేదు. స్టేషన్ ఘనపూర్ (Station Ghanpur) BRS ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య(MLA Tatikonda Rajaiah)పై సర్పంచ్ నవ్య (Sarpanch Navya) చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు అప్పట్లో పెను సంచలనం రేపాయి. అధికార పార్టీ ఎమ్మెల్యే అని కూడా చూడకుండా..భయపడకుండా మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేసి ఒక్కసారిగా వైరల్ గామారింది. ఆ తర్వాత కూడా పలు మీడియా చానెల్స్ ముందు కూడా రాజయ్య అలాంటివాడు..ఇలాంటి వాడు అంటూ చాల విషయాలు తెలిపింది. ముఖ్యంగా ఛీ ఛీ వెరీ బ్యాడ్.. పెండ.. అంటూ ఆయన క్యారెక్టర్ గురించి జుగుప్సాకరంగా ఎక్స్ప్రెషన్ పెట్టి చెప్పడం ఆమెను సోషల్ మీడియా లో వైరల్ గా మార్చాయి. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పడం అనుకుంటున్నారా..? అయితే ఈ స్టోరీ మీరు చదవాల్సిందే.
Read Also : Election Commission: స్పీడ్ పెంచిన ఎన్నికల కమిషన్.. త్వరలో తెలంగాణాలో పర్యటన
ప్రస్తుతం తెలంగాణ లో ఎన్నికలు (Telangana Assembly Election 2023) సమీపిస్తున్నాయి. దీంతో అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. అధికార పార్టీ బిఆర్ఎస్ (BRS) మాత్రం అందరికంటే ముందే తమ అభ్యర్థులను ప్రకటించి (BRS Candidates Announced) చేతులు దులుపుకుంది. గతంలో మాదిరిగానే ఈసారి కూడా 95 % వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ఛాన్స్ ఇచ్చారు. అయితే స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య (MLA Tatikonda Rajaiah) కు మాత్రం షాక్ ఇచ్చారు కేసీఆర్. ఆయన ప్లేస్ లో కడియం శ్రీహరికి (Kadiyam Srihari) ఛాన్స్ ఇచ్చారు. తనకు టికెట్ ఇవ్వకపోవడం ఫై రాజయ్య కన్నీరు పెట్టుకున్నారు. కిందపడి భోరున విలపించారు. ఆయనను ఆ పరిస్థితిలో చూసి అభిమానులు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన వెక్కి వెక్కి ఏడవటం చూసిన చాలా మందికి బాధ అనిపించింది కూడా. అయితే.. ఆయనను చూసి బాధపడ్డవారిలో సర్పంచ్ నవ్య కూడా ఉండటం గమనార్హం. రాజయ్యపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి.. చివరకు టికెట్ రాకుండా చేసిన సర్పంచ్ నవ్య.. రాజయ్యకు టికెట్ ఇవ్వకపోవడం తో ఎంతో సంతోషం వ్యక్తం చేస్తుందని అంత అనుకున్నారు. కానీ ఆమె మాత్రం బాధపడి..అందరికి మరో షాక్ ఇచ్చింది.
ప్రస్తుతం రాజయ్య… చివరికి వచ్చేసరికి తనకే టికెట్ వస్తుందని నమ్మకంటీతో ఉన్నారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని.. ఏ క్షణం ఏమైనా జరగొచ్చన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇలా రాజయ్య టికెట్ వస్తుందని ఆశతో ఉంటె..కడియం శ్రీహరి మాత్రం నాకు టికెట్ వచ్చింది..చాలు..ఇక ఎన్నికల ప్రచారమే అని సంతోషంగా ఉన్నారు. ఇలా ఈ ఇద్దరు ఉంటె..వీళ్లిద్దరినీ కాదని ఛాన్స్ ఇస్తే నేను పోటి చేసి ఎమ్మెల్యేగా గెలిచి చూపిస్తానంటూ ముందుకొచ్చింది.. జానకీపురం సర్పంచ్ నవ్య. “బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ సార్, కేటీఆర్ అన్న అవకాశం ఇస్తే.. స్టేషన్ ఘన్పూర్లో ఎమ్మెల్యేగా నామినేషన్ వేసేందుకు సిద్ధంగా ఉన్నా.. మీ ఆశీర్వాదం, సహకారం ఉంటే గెలిచి చూపిస్తా..” అంటూ నవ్య ఓ ఇంటర్వూలో తన అభిప్రాయాన్ని చెప్పడం..ఇప్పుడు వైరల్ గా మారింది.
Read Also : Telangana BJP : సిరిసిల్ల జిల్లాలో బీజేపీకి బలం పెరిగిందా? ఆ రెండు సీట్లకు అభ్యర్థులు దొరికినట్టేనా?
Tags
Related News
Rajaiah : నీకు సిగ్గు, శరం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్ ..కడియం కు రాజయ్య సవాల్
నీకు సిగ్గు, శరం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్ అంటూ కడియం ఫై తీవ్రస్థాయి లో ఆగ్రహం వ్యక్తం చేసారు