Temperatures Alert: భాగ్యనగరంలో పెరిగిన ఉష్ణోగ్రతలు.. వాతావరణ శాఖ అలెర్ట్
మొన్న కురిసిన వడగండ్ల వానను హైదరాబాద్ వాసులు బాగా ఎంజాయ్ చేశారు. తాజాగా ఎండాకాలం భాగ్యనగరంలో ప్రతాపం చూపుతోంది. చల్లటి వాతావరణం మండుటెండగా మారుతోంది.
- By Maheswara Rao Nadella Published Date - 02:46 PM, Tue - 28 March 23
Temperatures Alert :మొన్న కురిసిన వడగండ్ల వానను హైదరాబాద్ వాసులు బాగా ఎంజాయ్ చేశారు. తాజాగా ఎండాకాలం భాగ్యనగరంలో ప్రతాపం చూపుతోంది. చల్లటి వాతావరణం మండుటెండగా మారుతోంది. రాబోయే రోజుల్లో ఎండ మరింత దంచి కొడుతుందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.. ఈ వారం ముగిసేవరకు హైదరాబాద్ లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు దాటే అవకాశం ఉందని తెలిపింది. ఒకటి, రెండు రోజుల్లో వాతావరణ శాఖ దీని గురించి ఎల్లో అలర్ట్ జారీ చేసే అవకాశం ఉంది. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల, కొమరం భీమ్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఎండలు జనాలకు చెమట్లు పట్టిస్తాయని తెలిపింది. ఉష్ణోగ్రతలు (Temperatures) పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలను పాటించాలని వాతావరణ శాఖ హెచ్చరిక.
Also Read: Loneliness & Silence: ఒంటరితనమే లోకం.. నిశ్శబ్దమే బంధువుగా వృద్ధుల టౌన్
Tags
Related News
Health Report: భయపెడుతన్న అలర్జీలు.. అలర్ట్ గా ఉండకపోతే అంతే సంగతులు
Health Report: విపరీతమైన వేడి, వాతావరణంలో మార్పుల కారణంగా, చాలా మంది ప్రజలు ఏదో ఒక రకమైన అలర్జీకి గురవుతారు. భారతదేశంలో 30 శాతం మంది ప్రజలు అలెర్జీ సమస్యలతో బాధపడుతున్నారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అంటే ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరు ఏదో ఒక రకమైన అలర్జీతో బాధపడుతున్నారు. దాదాపు 26% మంది అలెర్జీలు కలిగి ఉన్నారు. నివేదిక ప్రకారం, వాతావరణం మారినప్పుడు అలెర్జీలు తరచుగా సంభవిస్త