Nizamabad: నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన.. చిన్నారిపై అత్యాచారం.!!
నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లిలో దారుణం జరిగింది.
- By Gopichand Published Date - 12:42 PM, Sun - 30 October 22
నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లిలో దారుణం జరిగింది. ఆరేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి అత్యాచారం చేయగా ఆ చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. డిచ్ పల్లికి చెందిన గోవింద రావు అనే వ్యక్తి ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆ మహిళ సంతానమైన ఆరేళ్ల చిన్నారిపై గోవింద రావు ఈ నెల 20న అత్యాచారం చేశాడు. దీనితో చిన్నారి పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు.
నిలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి ఈ నెల 23న మృతి చెందింది. అయితే సాధారణ మృతిగా నమ్మించే ప్రయత్నం చేయగా పోస్టుమార్టం నివేదికతో అత్యాచారం విషయం బయటపడింది. ఈ మేరకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని అత్యాచారం, హత్యతో పాటు పొక్సో సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
Related News
Movie Theaters: ఈనెల 17 నుంచి తెలంగాణలో సినిమా థియేటర్లు బంద్..!
తెలంగాణ రాష్ట్రంలోని సినీ ప్రియులకు షాక్ తగలనుంది.