HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Harish Rao Again Approaches The High Court On The Kaleshwaram Commission Report

BRS : కాళేశ్వరం కమిషన్‌ నివేదికపై మరోసారి హైకోర్టుకు హరీశ్‌రావు

కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగినాయో లేదో తేల్చాల్సింది రాజకీయ పార్టీలు కాదు. న్యాయస్థానాలు, ప్రజలే నిజాన్ని బయటపెట్టాలి అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం నిజాన్ని దాచాలని చూస్తోందని ఆరోపించారు. పీపీఏ (పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌) ఇవ్వడానికి కూడా ప్రభుత్వం భయపడుతోంది.

  • By Latha Suma Published Date - 12:59 PM, Sat - 30 August 25
  • daily-hunt
Harish Rao again approaches the High Court on the Kaleshwaram Commission report
Harish Rao again approaches the High Court on the Kaleshwaram Commission report

BRS : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) ప్రముఖ నేత, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు మరోసారి హైకోర్టు తలుపుతట్టారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సమర్పించిన కాళేశ్వరం కమిషన్ నివేదికపై హరీశ్‌రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఆ నివేదికను తాత్కాలికంగా సస్పెండ్ చేయాలని కోరుతూ హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. ఈ నివేదికను రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా తాత్కాలికంగా నిలిపివేయాలని పిటిషన్‌లో ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఈ పిటిషన్ హైకోర్టు రిజిస్ట్రీ వద్ద పరిశీలనలో ఉంది. నివేదిక చట్టబద్ధతపై ప్రశ్నలు లేవనెత్తుతూ, దీనిపై విచారణ చేపట్టాలని కోరారు. ఇది తొలిసారి కాదు గతంలోనూ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంటల చంద్రశేఖరరావు (కేసీఆర్)తో పాటు హరీశ్‌రావు కూడా కాళేశ్వరం నివేదికపై పిటిషన్లు దాఖలు చేశారు. అప్పట్లో ఆ పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టి, సంబంధిత పార్టీలకు నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను వాయిదా వేసింది.

Read Also: Modi China Tour : శాశ్వత మిత్రులు-శత్రువులంటూ ఏమీ ఉండదు..దేశ ప్రయోజనాలే శాశ్వతం: రాజ్‌నాథ్ సింగ్

ఇప్పుడు కొత్తగా దాఖలైన మధ్యంతర పిటిషన్‌తో ఈ అంశం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. అక్టోబర్‌లో ఈ కేసులపై తదుపరి విచారణ జరగనుంది. ఈ సందర్భంగా హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ..కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగినాయో లేదో తేల్చాల్సింది రాజకీయ పార్టీలు కాదు. న్యాయస్థానాలు, ప్రజలే నిజాన్ని బయటపెట్టాలి అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం నిజాన్ని దాచాలని చూస్తోందని ఆరోపించారు. పీపీఏ (పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌) ఇవ్వడానికి కూడా ప్రభుత్వం భయపడుతోంది. అసలు వాస్తవాలను ప్రజల ముందు ఉంచడానికి సిద్ధంగా లేదు. అసెంబ్లీలో నివేదిక ప్రవేశపెట్టడమే కాకుండా, ప్రతిపక్ష పార్టీకి సమాధానాలు చెప్పే ధైర్యం అధికార పార్టీలో లేదు. ఇది పూర్తిగా రాజకీయ వ్యూహంగా మారింది అని విమర్శలు గుప్పించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా గుర్తింపు పొందినప్పటికీ, ఇటీవల దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కమిషన్ నివేదికలో ప్రాజెక్టు నిర్వహణలో అవకతవకలు, డిజైన్ లోపాలు, భారీ ఖర్చు పెరుగుదల వంటి అంశాలపై వివరణ ఇచ్చారు. అయితే, ఈ నివేదిక రాజకీయ ప్రేరణతో తయారు చేయబడిందని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో హరీశ్‌రావు తాజా పిటిషన్ రాజకీయంగా కూడా కీలకంగా మారింది. అసెంబ్లీలో నివేదికను ప్రవేశపెట్టే ముందు హైకోర్టు తాత్కాలిక ఆదేశాలు జారీ చేస్తుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రజలకు వాస్తవాలను వెల్లడించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని హరీశ్‌రావు స్పష్టం చేశారు. న్యాయం జరగాలంటే రాజకీయ ప్రతీకారం తగదు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజల ప్రయోజనాల కోసమే చేపట్టినదని, దానిని అనవసరంగా విమర్శించడం తగదని ఆయన వ్యాఖ్యానించారు.

Read Also: Bangalore : తొక్కిసలాట ఘటన… ఒక్కో కుటుంబానికి ఆర్సీబీ రూ. 25 లక్షల పరిహారం


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • harish rao
  • Interim Petition
  • Kaleshwaram commission report
  • Report temporarily suspended
  • telangana govt
  • Telangana High Court

Related News

Harish Rao

Harish Rao: భర్తను తలచుకొని ఏడుస్తే.. చిల్లర రాజకీయాలా? – హరీశ్‌రావు ఫైర్

ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ, మాగంటి గోపీనాథ్‌ను జూబ్లీహిల్స్‌ ప్రజలు ఆశీర్వదించి ఐదేళ్లకు ఎమ్మెల్యేగా గెలిపించారని గుర్తు చేశారు.

  • Telangana Assembly approves 42 percent reservation amendment bills for BCs

    BC Reservation : రిజర్వేషన్లు 50% దాటకుండా ఎన్నికలు నిర్వహించుకోవచ్చు – హైకోర్టు

  • 42% Quota For Bcs

    42% Reservation: బీసీల స్వప్నం మళ్లీ మాటగా మారిందా?

  • Brs Chalo Bus Bhavan

    BRS Chalo Bus Bhavan : ‘చలో బస్ భవన్’ నిరసనలో ఉద్రిక్తత

Latest News

  • ‎Pregnancy Diet: తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే.. ప్రెగ్నెన్సీ టైంలో వీటిని తప్పకుండా తినాల్సిందే!

  • ‎Diwali: దీపావళి రోజు ఏ దీపాలను వెలిగించాలి.. నూనె, నెయ్యి.. దేనిని ఉపయోగించాలో తెలుసా?

  • ‎Karthika Masam: కార్తీక మాసంలో ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదో మీకు తెలుసా?

  • Maoist Ashanna : మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ.. లొంగిపోనున్న ఆశన్న టీమ్!

  • Bihar Elections : 25 ఏళ్ల సింగర్ కు బీజేపీ ఎమ్మెల్యే టికెట్

Trending News

    • Sai Dharam Tej : మేన‌ల్లుడు సాయి దుర్గా తేజ్ బర్త్‌డే.. మామ ప‌వ‌న్ క‌ల్యాణ్ విషెస్

    • Nobel Peace Prize 2025 : డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్ ?

    • Employees : ఉద్యోగులకు కేంద్రం శుభవార్త..!

    • Bigg Boss : నాకు ఇష్టం వచ్చినట్టు ఉంటా.. ఇష్టం వచ్చినట్టు తింటా – దివ్వెల మాధురి..!

    • Tata Motors : ఒక్కరోజే 40 శాతం తగ్గిన టాటా మోటార్స్ షేర్ ధర!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd