HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Harish Rao About Tg Assembly Session

TG Assembly Session : ప్రజల సమస్యలు తెలిపేందుకు కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వడం లేదు – హరీష్ రావు

TG Assembly Session : అసెంబ్లీలో ప్రజల సమస్యలపై చర్చకు సమయం ఇవ్వకుండా కేవలం రెండు రోజులు మాత్రమే సమావేశాలు నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ బీఏసీ సమావేశం నుండి వాకౌట్ చేసింది

  • Author : Sudheer Date : 30-08-2025 - 4:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tg Assembly Session Harish
Tg Assembly Session Harish

అసెంబ్లీలో ప్రజల సమస్యలపై చర్చకు సమయం ఇవ్వకుండా కేవలం రెండు రోజులు మాత్రమే సమావేశాలు (Assembly Session) నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ బీఏసీ సమావేశం నుండి వాకౌట్ చేసింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) మాట్లాడుతూ, యూరియా కొరత, వరద బీభత్సం, విష జ్వరాలు, గురుకుల విద్యార్థుల మరణాలు, రోడ్డు సౌకర్యాలు లేకపోవడం వంటి అనేక ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని తాము 15 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని కోరామని తెలిపారు. కానీ ప్రభుత్వం కేవలం రెండు రోజులు మాత్రమే సమావేశాలు జరపాలని నిర్ణయించిందని, దీనిని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుందని చెప్పారు. ప్రజల కష్టాలను పట్టించుకోకుండా ప్రభుత్వం పారిపోయే ధోరణిని అవలంబిస్తోందని ఆయన ఆరోపించారు.

Tarun Chugh : ‘మోడరన్ జిన్నా’ మమత అంటూ తరుణ్ చుగ్ వ్యాఖ్యలు

అసెంబ్లీలో చర్చించాల్సిన ముఖ్య సమస్యలను హరీష్ రావు వివరించారు. రాష్ట్రంలో వరదల వల్ల జరిగిన ప్రాణ నష్టం, పంట నష్టాలపై చర్చించాలని, అలాగే యూరియా కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులపై చర్చించాలని బీఆర్ఎస్ పార్టీ కోరిందన్నారు. కాంగ్రెస్, బిజెపిల మధ్య జరుగుతున్న దొంగ నాటకాల వల్లే యూరియా కొరత వచ్చిందని, దీనిపై అసెంబ్లీలో చర్చించాలని అన్నారు. దీంతో పాటు, గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్ల మలేరియా, డెంగ్యూ వంటి విష జ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అంటురోగాలపై చర్చించాలని కోరామని తెలిపారు. గురుకులాల్లో 100కు పైగా విద్యార్థులు మరణించడం, ఫీజు రీఎంబర్స్మెంట్ సమస్యలపై కూడా చర్చించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ వైఖరిని హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. వరదలు, యూరియా కొరత వంటి అత్యంత ప్రాధాన్యత కలిగిన సమస్యలపై చర్చించడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదని, బదులుగా కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పేరుతో బురద రాజకీయాలు చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రజల సమస్యల కంటే ప్రభుత్వానికి వేరే ఏ ప్రాధాన్యత ఉంటుందని ఆయన ప్రశ్నించారు. రేపు అసెంబ్లీలో ఏ అంశంపై చర్చించబోతున్నారో రాత్రి 9 గంటల తర్వాత చెబుతామని ప్రభుత్వం చెప్పడం ప్రతిపక్షాల గొంతు నొక్కడమేనని, ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని హరీష్ రావు అన్నారు. కేవలం రాజకీయాల కోసం రెండు రోజులు మాత్రమే అసెంబ్లీ నిర్వహించడం దుర్మార్గమని, స్థానిక సంస్థల ఎన్నికలలో లబ్ధి పొందడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని ఆయన విమర్శించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Congress Govt
  • harish rao
  • TG Assembly Session
  • Urea Shortage

Related News

Phone Tapping Santhosh

ఫోన్ ట్యాపింగ్ కేసు : ఎవరు సాక్షి ? ఎవరు దోషి? సిట్ ఎవర్ని అరెస్ట్ చేయబోతుంది ?

సాక్షులా? నిందితులా? అనే సందేహం ప్రజల్లో బలంగా ఉంది. ప్రస్తుతానికి విచారణకు హాజరవుతున్న రాజకీయ నేతలను సిట్ ప్రాథమికంగా 'సాక్షులు' గానే పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎవరి ఆదేశాల మేరకు జరిగింది? సేకరించిన సమాచారాన్ని ఎక్కడ నిక్షిప్తం చేశారు? అనే విషయాలపై స్పష్టత కోసం వీరిని ప్రశ్నిస్తున్నారు

  • Harish Rao Movie Tickets

    స్కామ్ లేదంటే నైనీ టెండర్లను ఎందుకు రద్దు చేసారంటూ హరీష్ రావు సూటి ప్రశ్న

  • Ktr Sit

    రేవంత్ రెడ్డి అవినీతిపై 100 శాతం ప్రాణం పోయే దాకా పోరాడుతూనే ఉంటాం – కేటీఆర్

  • Kcr Pm

    నెక్స్ట్ నోటీసులు ఇచ్చేది కేసీఆర్ కేనా ?

  • Ktr Phone Tapping Case

    ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ కు సిట్ నోటీసులు

Latest News

  • Medaram Jathara : మేడారం వనదేవతల జాతరకు వేళాయె

  • పార్టీ కంటే ఏదీ ముఖ్యం కాదు.. నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు : చంద్రబాబు వార్నింగ్

  • కాకరకాయ జ్యూస్ ప్రయోజనాలు..ఈ 2 వ్యాధులకు దివ్యౌషధమే..!

  • హైదరాబాద్‌లో గ్లోబల్ కాపబిలిటీ సెంటర్ ప్రారంభం

  • భారత్–ఈయూ వాణిజ్య ఒప్పందంపై అమెరికా అసంతృప్తి

Trending News

    • దంప‌తుల మ‌ధ్య‌ గొడవ పరిష్కరించుకోకుండా పడుకుంటే ఏం జరుగుతుంది?

    • ఆధార్ కొత్త యాప్ లాంచ్‌.. ఎప్పుడంటే?!

    • Rajasekhar Gotila Factory : నిజంగా రాజశేఖర్ కు గోటీల ఫ్యాక్టరీ ఉందా ? ఈ ఫ్యాక్టరీ ని బయటకు తీసిందెవరు ? అసలు ఈ ప్రచారానికి మూలం ఎక్కడ పడింది ?

    • ఆర్జే మహవష్‌తో విడిపోయిన చాహ‌ల్‌.. కార‌ణం ఏంటంటే?

    • India – EU ట్రేడ్ డీల్ ఖరారు.. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ లో పొగిడిన ప్రధాని మోదీ!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd