HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ganja Racket Supply From Andhra Odisha Border Sileru To Warangal District

Ganja Racket : ఆంధ్రా – ఒడిశా బార్డర్‌ నుంచి తెలంగాణకు గంజాయి.. గుట్టుగా సప్లై

ఈ తనిఖీల క్రమంలో చాలాసార్లు గంజాయి ముఠాలను పోలీసులు(Ganja Racket) పట్టుకున్న దాఖలాలు ఉన్నాయి.

  • Author : Pasha Date : 05-05-2025 - 11:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ganja Racket Andhra Odisha Border Sileru To Warangal District Telangana Andhra Pradesh

Ganja Racket : తెలుగు రాష్ట్రాల్లో గంజాయి దందా చాపకింద నీరులా సీక్రెట్‌గా కొనసాగుతోంది. ఆంధ్రా – ఒడిశా బార్డర్ ఏరియాల నుంచి తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్ నగరాలకు గంజాయి చేరుతోంది. ఇందుకోసం ప్రధానంగా రైలు మార్గాన్ని స్మగ్లర్లు వాడుతున్నట్లు తెలుస్తోంది.  ఆంధ్రా – ఒడిశా బార్డర్‌ ఏరియాలోని సీలేరు నుంచి తొలుత వరంగల్‌కు, ఆ తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్‌కు గంజాయిని చేరవేస్తున్నట్లు చెబుతున్నారు. ఇందుకోసం స్మగ్లర్లు రైలు రూట్లను, విభిన్న రోడ్డు మార్గాలను వాడుకుంటున్నారు.

Also Read :Kashmir Jails : జైళ్లపై ఉగ్రదాడికి కుట్ర.. ఉగ్రవాదులను విడిపించేందుకు స్కెచ్ ?

రైల్వే రూట్‌లో స్మగ్లింగ్..  

సీలేరు నుంచి భద్రాచలం వరకు రైలు మార్గంలో 110 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ మార్గం మధ్యలో ఉన్న ప్రాంతమంతా ఏపీ పోలీసుల పరిధిలోకి వస్తుంది. భద్రాచలం నుంచి వరంగల్ రైల్వే స్టేషన్ వరకు 139 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ మార్గం మధ్యలో ఉన్న ప్రాంతమంతా తెలంగాణ పోలీసుల పరిధిలోకి వస్తుంది. ఈ రెండు రూట్లలోనూ సాధారణ పోలీసులతో పాటు రైల్వే పోలీసులు నిరంతరం తనిఖీలు చేస్తూనే ఉంటారు. ఈ తనిఖీల క్రమంలో చాలాసార్లు గంజాయి ముఠాలను పోలీసులు(Ganja Racket) పట్టుకున్న దాఖలాలు ఉన్నాయి. ఒక్క వరంగల్ జిల్లాలోనే పోలీసులు 28 నెలల్లో రూ.11.58 కోట్లు విలువచేసే 45.98 క్వింటాళ్ల గంజాయి, హాష్‌ ఆయిల్, చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.

వరంగల్ రైల్వేస్టేషన్‌కు చేరకముందే.. 

ఇంతలా తనిఖీలు జరుగుతున్నా పోలీసుల కళ్లు కప్పి.. వివిధ రైళ్లలో గంజాయిని వరంగల్, హైదరాబాద్ నగరాలకు స్మగ్లర్లు చేరవేస్తున్నారు. ఏపీ నుంచి తెలంగాణకు వచ్చే రైళ్లు  వరంగల్ రైల్వే స్టేషన్‌లో ఆగుతాయి.ఈ స్టేషను రాకముందే ఖమ్మం రోడ్ బ్రిడ్జ్ వద్ద ట్రైన్ స్లో అవుతుంది. స్మగ్లర్లు అక్కడే దిగి, సరుకును చేర్చాల్సిన చోటుకు చేరవేస్తున్నారు. ఇక ప్యాసింజర్ రైళ్లలో ఏపీ వైపు నుంచి వరంగల్‌కు వచ్చే స్మగ్లర్లు.. వరంగల్ కంటే ముందున్న చిన్న స్టేషన్‌లోనే దిగిపోతున్నారు. అక్కడి నుంచి ఆటోలు, బైక్‌లలో గంజాయిని అడ్డాల వద్దకు తరలిస్తున్నారు.

Also Read :Sita Navami 2025: ఈరోజే సీతా నవమి.. పూజ ఎలా చేయాలి ? దీన్ని ఎందుకు జరుపుకుంటారు ?

రోడ్డు మార్గంలో స్మగ్లింగ్.. 

గంజాయి స్మగ్లర్లు తొలుత తమ సరుకును ఏపీలోని సీలేరు నుంచి భద్రాచలం వద్దకు చేరుస్తున్నారు. అక్కడి నుంచి మణుగూరు మీదుగా ములుగు జిల్లా ఏటూరునాగారం వద్దకు తీసుకెళ్తున్నారు. అక్కడి నుంచి ములుగు, వరంగల్, భూపాలపల్లి ఏరియాలకు తరలిస్తున్నారు. దీంతోపాటు భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్ల ఏరియాలకు సరుకును తీసుకెళ్తున్నారు.  అక్కడి నుంచి ములుగు జిల్లా వెంకటాపురం, ఏటూరునాగారం మీదుగా వరంగల్‌ వైపునకు గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నారు. ఇంకోవైపు భద్రాచలం, ఇల్లెందు మీదుగా బయ్యారం, మహబూబాబాద్‌ ఏరియాలకు సరుకును తరలిస్తున్నారు. భద్రాచలం, ఇల్లెందు నుంచి ఖమ్మం జిల్లా మీదుగా మరిపెడ, తొర్రూరుకు సరుకును చేరవేస్తున్నారు. అక్కడి నుంచి వరంగల్‌కు తీసుకెళ్తున్నారు. ఇక మరో రూట్ విషయానికొస్తే.. మహబూబాబాద్‌ జిల్లా గంగారం, కొత్తగూడ నుంచి వరంగల్‌ జిల్లా నర్సంపేటకు సరుకును చేరవేసి, అక్కడి నుంచి రాత్రిపూట వరంగల్‌కు తరలిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra Odisha Border
  • andhra pradesh
  • crime
  • Ganja Racket
  • Sileru
  • telangana
  • warangal
  • Warangal District

Related News

INS Mahendragiri joins the Indian Navy.

INS Mahendragiri: భారత నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశాఖపట్నం డాక్‌యార్డ్‌లో యుద్ధనౌకను ప్రారంభించారు. ప్రాజెక్ట్ 17A నీలగిరి-క్లాస్ ప్రోగ్రామ్ కింద ఆరవ నౌక అయిన, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరిని ప్రారంభించడంతో భారత నౌకాదళం శనివారం తన నౌకాదళాన్ని బలోపేతం చేసుకుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశాఖపట్నం డాక్‌యార్డ్‌లో ఈ యుద్ధనౌకను ప్రారంభించారు

  • State-of-the-art showroom 'Elite Eco Energy' inaugurated in Bhimavaram.

    Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

    ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Latest News

  • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

  • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

  • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

  • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

  • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd