Gaddar Daughter: రాజకీయ ప్రవేశంపై వెన్నెల ఏమన్నారంటే?
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలను ఆకర్షించడంలో తెలంగాణ కాంగ్రెస్ వడివడిగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ టిక్కెట్టును గద్దర్ కుటుంబ సభ్యులకు కేటాయించినాట్లు వార్తలు
- By Praveen Aluthuru Published Date - 05:33 PM, Sat - 30 September 23
Gaddar Daughter: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలను ఆకర్షించడంలో తెలంగాణ కాంగ్రెస్ వడివడిగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ టిక్కెట్టును గద్దర్ కుటుంబ సభ్యులకు కేటాయించినాట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం గద్దర్ కుమార్తె వెన్నెలకు ఆ టికెట్ కేటాయించాలని యోచిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. తాజాగా గద్దర్ కుమార్తె వెన్నెల మీడియాతో మాట్లాడింది. కాంగ్రెస్ టికెట్ ఇస్తుందన్న వార్తలను నేనూ వింటున్నానని అయితే ఇప్పటికైతే ఎలాంటి స్పష్టమైన సమాచారం లేదని ఆమె తెలిపింది. అయితే కాంగ్రెస్ మా కుటుంబానికి టికెట్ ఇవ్వాలని భావిస్తే దానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని ఆమె అన్నారు.
గద్దర్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు తమ కుటుంబం తహతహలాడుతుందని, తమకు సీటు ఇస్తే ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనలో ఉన్నామని ఆమె అన్నారు. అవకాశం వస్తే సమాజానికి సేవ చేస్తామని, మా తండ్రి ఆశయాన్ని నెరవేరుస్తామని వెన్నెల అన్నారు. దివంగత గద్దర్ సజీవంగా ఉన్న రోజుల్లో కాంగ్రెస్ తో ఆయనకున్న అనుబంధం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు.గతంలో గద్దర్ కాంగ్రెస్కు మద్దతిచ్చినా ఆయన ఆ పార్టీలో చేరలేదు. నిజానికి 2018లో అసెంబ్లీ ఎన్నికలు మరియు 2019 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలన్న పార్టీ ప్రతిపాదనను ఆయన తిరస్కరించారు.
గద్దర్ కుటుంబానికి టిక్కెట్టు ఇవ్వడం ద్వారా కమ్యూనిస్ట్ అనుకూల మరియు అధికార వ్యతిరేక ఓట్లను ఏకీకృతం చేయడమే కాకుండా దళితుడిగా అతని కుల గుర్తింపును కూడా దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. తన మరణానికి రెండు నెలల ముందు, గద్దర్ ప్రజా పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. కాగా ఇటీవల హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గద్దర్ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు.
Also Read: Busiest Airports: అత్యంత రద్దీగా ఉండే టాప్ 10 విమానాశ్రయాలు
Related News
Rains Alert: చల్లని కబురు.. తెలంగాణలోని 14 జిల్లాల్లో వర్షాలు
తెలంగాణ జిల్లాల్లో ఏప్రిల్ 29న ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.