HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Food Poisoning In Maganur Government School Once Again

Food Poisoning : మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో మరోసారి ఫుడ్‌పాయిజన్‌..

Food Poisoning : రాష్ట్రంలో వరుసగా ఫుడ్‌పాయిజన్‌ ఘటనలు వెలుగులోకి వస్తూ ప్రభుత్వ నిర్లక్ష్యం , అధికారుల పనితీరు బయటపెడుతున్నాయి

  • By Sudheer Published Date - 08:53 PM, Tue - 26 November 24
  • daily-hunt
Food Poison In Narayanapet
Food Poison In Narayanapet

తెలంగాణ లోని ప్రభుత్వ హాస్టల్స్ లలో వరుసగా ఫుడ్‌పాయిజన్‌ (Food Poisoning) ఘటనలు విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. నిన్నటి నిన్న శైలజ అనే స్టూడెంట్ ఫుడ్‌పాయిజన్‌ వల్ల మృతి చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా చర్చ నడుస్తుండగానే..రాష్ట్రంలో వరుసగా ఫుడ్‌పాయిజన్‌ ఘటనలు వెలుగులోకి వస్తూ ప్రభుత్వ నిర్లక్ష్యం , అధికారుల పనితీరు బయటపెడుతున్నాయి. నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో (Maganur Govt School) మరోసారి ఫుడ్‌పాయిజన్‌ జరిగింది.

మంగళవారం నాడు మధ్యాహ్న భోజనం తిని 20 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం 3.30 గంటల తర్వాత పలువురు విద్యార్థులు తీవ్రమైన కడుపు నొప్పితో విలవిలలాడిపోయారు. వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. ఇది గమనించిన పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు.పరిస్థితి విషమంగా ఉన్న పలువురిని మక్తల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మాగనూరులో ఫుడ్‌ పాయిజన్‌ జరగడం ఈ వారంలో ఇది మూడోసారి. ఇలా వరుసగా ఫుడ్‌పాయిజన్‌ ఘటనలు జరుగుతున్న ప్రభుత్వం మాత్రం చర్యలు తీసుకోకపోవడం పై ప్రతిపక్ష పార్టీ బిఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.

మాగనూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మరోసారి ఫుడ్‌పాయిజన్‌ జరగడంపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నాయకులు హరీశ్‌రావు (Harish Rao) తీవ్రంగా మండిపడ్డారు. ఫుడ్‌పాయిజన్‌ జరిగి 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై పది రోజులు కూడా గడవకముందే మళ్లీ ఫుడ్‌పాయిజన్‌ జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే జైలుకు పంపిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి మాటలు నీటి మూటలే అయ్యాయని అన్నారు. మాటలే తప్ప చేతలు లేని కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్య తీరు వల్ల ఇంకెంత మంది విద్యార్థులు ఆస్పత్రి పాలవ్వాలని.. ఇంకెందరు ప్రాణాలు కోల్పోవాలని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఉరఫ్ విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం, అసమర్ధత కారణంగా తన సొంత జిల్లాలోని మక్తల్‌ మండలం మాగనూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మళ్లీ ఫుడ్‌ పాయిజన్‌ జరిగిందని దాసోజు శ్రవణ్‌ అన్నారు.

ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 48 మంది ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థుల మరణించారని దాసోజు శ్రవణ్‌ తెలిపారు. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారని అన్నారు. ఈ పాపం ఎవరిదీ అని ప్రశ్నించారు. ప్రత్యేక విద్యా శాఖ మంత్రి, పూర్తి బాధ్యతలతో ప్రత్యేక ప్రిన్సిపల్ సెక్రటరీని నియమించకుండా రేవంత్ రెడ్డి నిరంకుశ పరిపాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్నారని.. ప్రిన్సిపల్ సెక్రటరీ హైదరాబాద్‌లో బిజీగా ఉన్నారని.. ఈ ఘటనలపై కనీస రివ్యూ కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

మక్తల్ – మాగనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మళ్లీ ఫుడ్ పాయిజన్ https://t.co/uS3KEI2Wvw pic.twitter.com/6AQJh9frD5

— Telugu Scribe (@TeluguScribe) November 26, 2024

Read Also : Pushpa Last Shoot : పుష్ప ముగిసింది…పుష్పరాజ్ ట్వీట్


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • food poisoning
  • Maganur government school
  • telangana

Related News

Ts Checkpost

Telangana Check Post : తెలంగాణలో చెక్ పోస్టుల రద్దు

Telangana Check Post : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖ చెక్‌పోస్టులపై సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ట్రాన్స్‌పోర్ట్ చెక్‌పోస్టులను తక్షణమే మూసివేయాలని రవాణా శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.

  • Maganti Sunitha Nomination

    Maganti Sunitha Nomination : మాగంటి సునీత నామినేషన్ రద్దు చేయండి – ప్రద్యుమ్న

  • Kcr Metting

    Jubilee Hills Bypoll : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ సమీక్ష

  • CM Revanth Reddy

    Government is a Key Decision : ఆ నిబంధన ను ఎత్తివేస్తూ సీఎం రేవంత్ సంతకం

  • Brs Jublihils

    Jubilee Hills Bypoll : స్టార్ క్యాంపెయినర్లను బరిలోకి దింపిన బిఆర్ఎస్

Latest News

  • ATM Rules: ఏటీఎం కార్డు వాడుతున్నారా? అయితే ఇక‌పై రూ. 23 క‌ట్టాల్సిందే!

  • Gold : RBI వద్ద ఎంత బంగారం ఉందో తెలుసా?

  • Plane Crash : టేకాఫ్ కాగానే కూలిపోయిన విమానం

  • Rohit Sharma: ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై చ‌రిత్ర సృష్టించిన రోహిత్ శ‌ర్మ‌!

  • Gold Rate in India : మళ్లీ తగ్గిన బంగారం ధరలు..ఈరోజు ఎంతంటే !!

Trending News

    • Special Trains: పండుగల వేళ స్పెషల్ ట్రైన్స్.. హర్షం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు!

    • Ishan Kishan: ఐపీఎల్ 2026.. ఈ ఆట‌గాడి కోసం మూడు ఫ్రాంచైజీల పోటీ!

    • Sanju Samson: ఆర్సీబీలోకి సంజు శాంస‌న్‌.. ఇదిగో ఫొటో!

    • PM Kisan Yojana: రైతుల‌కు శుభ‌వార్త‌.. న‌వంబ‌ర్ మొద‌టివారంలో ఖాతాల్లోకి డ‌బ్బులు?!

    • Virat Kohli- Rohit Sharma: నెట్స్‌లో చెమ‌టోడ్చిన రోహిత్‌, కోహ్లీ.. గంట‌పాటు ప్రాక్టీస్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd