HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Fish Prasadam On June 9 At Hyderabad This Is The Health Benefits

Fish Prasadam: ఆస్తమా, ఉబ్బసం రోగులకు గొప్ప వరం.. చేపమందు ప్రసాదం!

బత్తిన సోదరులిచ్చే చేప ప్రసాదానికి ఎంతో ప్రత్యేకత ఉంది. తరతరాలుగా పంపిణీ చేస్తున్న చేపమందు ప్రసాదానికి ఎంతో చరిత్ర ఉంది. 

  • By Balu J Published Date - 12:18 PM, Thu - 8 June 23
  • daily-hunt
Fish Prasadam
Fish Prasadam

శాస్త్ర సాంకేతిక రంగం కొత్త పుంతలు తొక్కుతున్నా.. వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నా.. చేపమందు ప్రసాదానికి ఏమాత్రం డిమాండ్ తగ్గడం లేదు. వందలు.. వేలు కాదు.. లక్షలాది మంది ఈ ప్రసాదం తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారంటే.. చేపమందు శక్తి ఏమిటో ఇట్టే అర్ధమవుతోంది. మృగశిర కారైలో అయితే రైతులు ఎలాగో తొలకరి వర్షాల కోసం ఎదురుచూస్తారో, లక్షలాది ఆస్తమా రోగులు చేప ప్రసాదం కోసం ఎదురుచూస్తుంటారు. మృగశిర కారై వస్తే వస్తుందంటే చాలు దేశ నలుములాల నుంచి ఆస్తమా రోగులు హైదరాబాద్ కు వస్తుంటారు. బత్తిన సోదరులిచ్చే చేప ప్రసాదానికి ఎంతో ప్రత్యేకత ఉంది. తరతరాలుగా పంపిణీ చేస్తున్న చేపమందు ప్రసాదానికి ఎంతో చరిత్ర ఉంది.

నిజాం కాలం నుంచే..

ఏటా లక్షల సంఖ్యలో ఆస్తమా రోగులు హైదరాబాద్ వచ్చి చేప ప్రసాదం తీసుకుంటారు. ఈ పరంపర ఇప్పటిది కాదు. 1847 నుంచీ కొనసాగుతోంది. నిజాముల కాలంలోనే చేప ప్రసాదం పంపిణీ పాతబస్తీలో మొదలైంది. ఇప్పుడు ప్రసాదం అందిస్తోన్న బత్తిన సోదరుల తాతగారైన బత్తిన వీరన్న తొలిసారి ప్రసాదం పంచటం మొదలుపెట్టారు. తరువాత బత్తిని వంశంలో వరుసగా మూడు తరాలు ఈ ప్రసాదం పంపిణీ ఉచితంగా చేస్తూనే వున్నారు.

మూడు రకాలుగా పంపిణీ

అపట్లో ఓల్డ్ సిటీలోని దూద్‌బౌలిలో కొద్దిమంది ఆస్తమా రోగులకు ఈ ప్రసాదాన్ని అందించడం ద్వారా ఈ బృహత్తర కార్యక్రమం మొదలైంది. కొరమీను చేపపిల్ల నోటిలో ఆ ప్రసాదాన్ని ఉంచి రోగి చేత ఆ చేప పిల్లను మింగిస్తారు. శాకాహారుల కోసం బెల్లంతో ప్రసాదాన్ని అందిస్తారు. చేప ముందు మూడు రకాలుగా ఇస్తారు రోగులకి. పూర్తి శాఖాహారులైతే బెల్లంతో కలిపి ప్రసాదాన్ని అందిస్తారు. మాంసాహారులైతే కొర్రమీను చేప నోట్లో ప్రసాదాన్ని వుంచి… ఆ చేపని రోగి చేత మింగిస్తారు. ఇక మూడో రకం ప్రసాదం.. ప్రత్యేకంగా పత్యం చేసే వారికి వేస్తారు.

మృగశిర కార్తెలోనే ఎందుకంటే

ఈ చేప ప్రసాదం ప్రత్యేకంగా మృగశిర కార్తె రోజునే ఇవ్వటానికి కారణం… మృగశిర కార్తె నుంచీ వాతావరణంలో మార్పు రావటమే. ఎండ తగ్గి తేమ క్రమంగా పెరుగుతూ వుంటుంది. అందువల్ల ఆస్తమా రోగులు ఇబ్బంది పడే అవకాశం కూడా ఎక్కువగా వుంటుంది. అందుకే, వర్షాలు మొదలయ్యే మృగశిర కార్తె రోజు ఆస్తమాను అరికట్టే చేప ప్రసాదం ఇవ్వటం ఆనవాయితి.

మూడేళ్ల తర్వాత చేపమందు ప్రసాదం

హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో శుక్రవారం ఉదయం నుంచి చేప మందును పంపిణీ చేస్తారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. కరోనా వ్యాప్తి కారణంగా మూడేళ్ల తర్వాత బత్తిని కుటుంబం ఈ సంవత్సరం చేపమందు ప్రసాదం పంపిణీ చేస్తోంది. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌ల పర్యవేక్షణలో బత్తిన హరినాథ్‌గౌడ్‌ నేతృత్వంలో ప్రభుత్వ విభాగాలు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నాయి. రెండు రోజులపాటు 5లక్షల మందికి సరిపోయేలా 5 క్వింటాళ్ల చేప ప్రసాదం తయారు చేస్తున్నారు. మత్స్యశాఖ ఇప్పటికే 2.5 లక్షల కొర్రమీను చేప పిల్లలను సిద్ధం చేసింది. ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో 34 కౌంటర్లు, 32 క్యూలైన్లు, దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి సరిపడా టాయిలెట్స్‌ ఏర్పాటు చేశారు. దివ్యాంగులు, వృద్ధులు, మహిళల కోసం ప్రత్యేక క్యూలైన్లు, కౌంటర్లు ఉన్నాయి.

Also Read: Siddharth: డబ్బు కంటే ఆనందానికి ప్రాధాన్యత ఇవ్వాలనేది నా పాలసీ: బొమ్మరిల్లు సిద్దార్థ్


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bathini brothers
  • Fish Prasadam
  • hyderabad
  • Nampally

Related News

Maganti Sunitha

Maganti Sunitha: మాగంటి సునీత‌కు కేటీఆర్ మద్దతు వెనక రియల్ లైఫ్ డ్రామా?

గోపీనాథ్ మరణానంతరం కేటీఆర్ అద్భుతమైన రాజకీయ స్క్రిప్ట్ రాశారనే ప్రచారం జరిగింది. పి.జె.ఆర్. కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వకుండా 'సానుభూతి కార్డ్' పైనే ఉపఎన్నికల భవిష్యత్తును నిర్ణయించారు.

  • Hyd Real Estate

    Hyderabad : హైదరాబాద్ కు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చింది కాంగ్రెస్సే – సీఎం రేవంత్

  • Inspections Brs

    Inspections : BRS నేతల ఇళ్లలో తనిఖీలు.. ఉద్రిక్తత

  • Rangareddy

    Rangareddy: దేశంలోనే అత్యంత ధనిక జిల్లాగా రంగారెడ్డి

  • Sama Rammohan Reddy

    Sama Rammohan Reddy: కేటీఆర్‌కు సామ రామ్మోహన్ రెడ్డి సంచలన సవాల్!

Latest News

  • Congress : బీసీల కోసం కాంగ్రెస్ మరో ప్రయత్నం

  • Hyundai Venue : మార్కెట్లోకి హ్యుందాయ్ వెన్యూకి పోటీగా 5 కొత్త SUVలు

  • Maganti Gopinath Assets : మాగంటి గోపీనాథ్ ఆస్తుల పై ఆ ఇద్దరి కన్ను – బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

  • Ration Cards Alert: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్

  • Drinking Water: ‎నీరు తాగిన వెంటనే మూత్ర విసర్జనకు వెళ్తున్నారా.. అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్టే!

Trending News

    • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

    • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

    • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

    • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

    • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd