HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Fish Prasadam On June 9 At Hyderabad This Is The Health Benefits

Fish Prasadam: ఆస్తమా, ఉబ్బసం రోగులకు గొప్ప వరం.. చేపమందు ప్రసాదం!

బత్తిన సోదరులిచ్చే చేప ప్రసాదానికి ఎంతో ప్రత్యేకత ఉంది. తరతరాలుగా పంపిణీ చేస్తున్న చేపమందు ప్రసాదానికి ఎంతో చరిత్ర ఉంది. 

  • Author : Balu J Date : 08-06-2023 - 12:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Fish Prasadam
Fish Prasadam

శాస్త్ర సాంకేతిక రంగం కొత్త పుంతలు తొక్కుతున్నా.. వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నా.. చేపమందు ప్రసాదానికి ఏమాత్రం డిమాండ్ తగ్గడం లేదు. వందలు.. వేలు కాదు.. లక్షలాది మంది ఈ ప్రసాదం తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారంటే.. చేపమందు శక్తి ఏమిటో ఇట్టే అర్ధమవుతోంది. మృగశిర కారైలో అయితే రైతులు ఎలాగో తొలకరి వర్షాల కోసం ఎదురుచూస్తారో, లక్షలాది ఆస్తమా రోగులు చేప ప్రసాదం కోసం ఎదురుచూస్తుంటారు. మృగశిర కారై వస్తే వస్తుందంటే చాలు దేశ నలుములాల నుంచి ఆస్తమా రోగులు హైదరాబాద్ కు వస్తుంటారు. బత్తిన సోదరులిచ్చే చేప ప్రసాదానికి ఎంతో ప్రత్యేకత ఉంది. తరతరాలుగా పంపిణీ చేస్తున్న చేపమందు ప్రసాదానికి ఎంతో చరిత్ర ఉంది.

నిజాం కాలం నుంచే..

ఏటా లక్షల సంఖ్యలో ఆస్తమా రోగులు హైదరాబాద్ వచ్చి చేప ప్రసాదం తీసుకుంటారు. ఈ పరంపర ఇప్పటిది కాదు. 1847 నుంచీ కొనసాగుతోంది. నిజాముల కాలంలోనే చేప ప్రసాదం పంపిణీ పాతబస్తీలో మొదలైంది. ఇప్పుడు ప్రసాదం అందిస్తోన్న బత్తిన సోదరుల తాతగారైన బత్తిన వీరన్న తొలిసారి ప్రసాదం పంచటం మొదలుపెట్టారు. తరువాత బత్తిని వంశంలో వరుసగా మూడు తరాలు ఈ ప్రసాదం పంపిణీ ఉచితంగా చేస్తూనే వున్నారు.

మూడు రకాలుగా పంపిణీ

అపట్లో ఓల్డ్ సిటీలోని దూద్‌బౌలిలో కొద్దిమంది ఆస్తమా రోగులకు ఈ ప్రసాదాన్ని అందించడం ద్వారా ఈ బృహత్తర కార్యక్రమం మొదలైంది. కొరమీను చేపపిల్ల నోటిలో ఆ ప్రసాదాన్ని ఉంచి రోగి చేత ఆ చేప పిల్లను మింగిస్తారు. శాకాహారుల కోసం బెల్లంతో ప్రసాదాన్ని అందిస్తారు. చేప ముందు మూడు రకాలుగా ఇస్తారు రోగులకి. పూర్తి శాఖాహారులైతే బెల్లంతో కలిపి ప్రసాదాన్ని అందిస్తారు. మాంసాహారులైతే కొర్రమీను చేప నోట్లో ప్రసాదాన్ని వుంచి… ఆ చేపని రోగి చేత మింగిస్తారు. ఇక మూడో రకం ప్రసాదం.. ప్రత్యేకంగా పత్యం చేసే వారికి వేస్తారు.

మృగశిర కార్తెలోనే ఎందుకంటే

ఈ చేప ప్రసాదం ప్రత్యేకంగా మృగశిర కార్తె రోజునే ఇవ్వటానికి కారణం… మృగశిర కార్తె నుంచీ వాతావరణంలో మార్పు రావటమే. ఎండ తగ్గి తేమ క్రమంగా పెరుగుతూ వుంటుంది. అందువల్ల ఆస్తమా రోగులు ఇబ్బంది పడే అవకాశం కూడా ఎక్కువగా వుంటుంది. అందుకే, వర్షాలు మొదలయ్యే మృగశిర కార్తె రోజు ఆస్తమాను అరికట్టే చేప ప్రసాదం ఇవ్వటం ఆనవాయితి.

మూడేళ్ల తర్వాత చేపమందు ప్రసాదం

హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో శుక్రవారం ఉదయం నుంచి చేప మందును పంపిణీ చేస్తారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. కరోనా వ్యాప్తి కారణంగా మూడేళ్ల తర్వాత బత్తిని కుటుంబం ఈ సంవత్సరం చేపమందు ప్రసాదం పంపిణీ చేస్తోంది. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌ల పర్యవేక్షణలో బత్తిన హరినాథ్‌గౌడ్‌ నేతృత్వంలో ప్రభుత్వ విభాగాలు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నాయి. రెండు రోజులపాటు 5లక్షల మందికి సరిపోయేలా 5 క్వింటాళ్ల చేప ప్రసాదం తయారు చేస్తున్నారు. మత్స్యశాఖ ఇప్పటికే 2.5 లక్షల కొర్రమీను చేప పిల్లలను సిద్ధం చేసింది. ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో 34 కౌంటర్లు, 32 క్యూలైన్లు, దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి సరిపడా టాయిలెట్స్‌ ఏర్పాటు చేశారు. దివ్యాంగులు, వృద్ధులు, మహిళల కోసం ప్రత్యేక క్యూలైన్లు, కౌంటర్లు ఉన్నాయి.

Also Read: Siddharth: డబ్బు కంటే ఆనందానికి ప్రాధాన్యత ఇవ్వాలనేది నా పాలసీ: బొమ్మరిల్లు సిద్దార్థ్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bathini brothers
  • Fish Prasadam
  • hyderabad
  • Nampally

Related News

Rtc Workers Protest

RTC Strike : ప్రభుత్వం తో చర్చలకు సిద్ధం – JAC

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కార్మికులు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల శంకర్ గౌడ్ వంటి కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటం జేఏసీ నేతలను కలవరపెడుతోంది. ఇలాంటి విషాదకర ఘటనలు పునరావృతం కాకూడదని జేఏసీ గట్టి నిర్ణయం

  • ఏపీ మాజీ సీఎం క‌న్నుమూత‌

    ఏపీ మాజీ సీఎం క‌న్నుమూత‌

  • employer's daughter into stealing 100 tola gold

    ప్రియుడి కోసం ఎంత పని చేశావు?

  • Hyderabad Minor Girl instagram Trap Case

    డబ్బున్న మైనర్ అమ్మాయిలు వారి టార్గెట్..

  • Hyderabad Woman Disappears After Dispute Over Eating Curd

    పెరుగు తినమని చెప్పినందుకు ఇల్లు వదిలి వెళ్లిపోయిన భార్య

Latest News

  • Elections : తొలి విడతలో 110 సీట్లు గెలుస్తాం – అమిత్ షా ధీమా

  • RTC Driver Suicide : శంకర్ గౌడ్ ది ఆత్మహత్య కాదు.. సర్కార్ చేసిన హత్య – KTR

  • Hero Sunil : సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన హీరో రాజశేఖర్

  • Bangladesh : బంగ్లాదేశ్ తలసరి ఆదాయం ఇండియాను దాటేస్తుంది – IMF

  • WB Elections : ఢిల్లీలో గద్దె దించుతా – మమత ధీమా

Trending News

    • ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం!

    • ఫిఫా వరల్డ్ కప్ 2026.. ఇరాన్ స్థానంలో ఇటలీ?

    • ‘పెద్ది’లో శృతి హాసన్ సందడి

    • ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

    • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd