Hyderabad: హైదరాబాద్ లో అంతర్జాతీయ ఆయుర్వేద సదస్సు
పాలీ సైంటిఫిక్ ఆయుర్వేదంపై హైదరాబాద్ నగరంలో మొదటిసారి అంతర్జాతీయ సదస్సు జరగనుంది.
- By Gopichand Published Date - 05:55 PM, Thu - 24 November 22
పాలీ సైంటిఫిక్ ఆయుర్వేదంపై హైదరాబాద్ నగరంలో మొదటిసారి అంతర్జాతీయ సదస్సు జరగనుంది. వచ్చే ఏడాది జనవరి 21-22న ఐఐటీ క్యాంపస్లో ఈ సదస్సును ఎస్జీపీ నిర్వహించనుంది. ఈ సదస్సులో విస్తృత స్ధాయి శాస్త్రీయ పరిశోధనలు, స్టాటిస్టికల్ డాటా పాయింట్లు, ఆయుర్వేద మౌలిక సూత్రాలు వంటివి చర్చించనున్నారు. 8 దేశాల నుంచి దాదాపు 400 మంది పరిశోధకులు, డాక్టర్లు, ఆయర్వేద ప్రాక్టీషనర్లు ఈ సదస్సులో పాల్గొననున్నారు.
అమెరికా, యూకే, రష్యా, కెనడా, భారత్తో పాటు మరో 8 దేశాలకు చెందిన పరిశోధకులు, వైద్యులు, ఆయుర్వేద నిపుణులు, శాస్త్రవేత్తలు, ప్రభుత్వ అధికారులు, కార్పొరేట్ ప్రతినిధులు సహా 12 దేశాల నుంచి 400 మంది ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని డాక్టర్ రవిశంకర్ పోలిశెట్టి తెలిపారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఇంటిగ్రేటివ్, రీజెనరేటివ్, హోలిస్టిక్ హెల్త్కేర్ ప్రొవైడర్ అయిన SGP (సాయి గంగా పనాకియా) వ్యవస్థాపకులు గురువారం ఓ సమావేశంలో తెలిపారు.
ఆయుర్వేదం, హల్లోపతి సమాజంలోని వైద్య నిపుణులు, ప్రభుత్వ, ప్రైవేట్, పౌర సమాజ సంస్థలు ఈ కార్యక్రమంలో శతాబ్దాల నాటి ఆయుర్వేద సూత్రాల గ్రంధం ఆధారంగా తాజా శాస్త్ర పరిశోధన ఫలితాలను చర్చించడం జరుగుతుందని ఆయన తెలిపారు. పరీక్ష కేసులు, గణాంక డేటా పాయింట్లు, పరిశోధన నివేదికలు కూడా సదస్సులో సమర్పించబడతాయని డాక్టర్ రవిశంకర్ తెలిపారు. ఈ సమావేశానికి భారత ప్రభుత్వం ఆయుష్ శాఖ, UK ఆల్ పార్టీ పార్లమెంటరీ గ్రూప్ ఆన్ ఇండియన్ సైన్సెస్, రష్యన్ అకాడమీ ఆఫ్ నేచురల్ సైన్సెస్ వంటి అంతర్జాతీయ సంస్థలు మద్దతు ఇస్తున్నాయి. ఈ సదస్సును ప్రారంభించేందుకు.. మద్దతు ఇచ్చేందుకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు కూడా సమ్మతించారు.
Tags
Related News
Bengaluru Win: సన్రైజర్స్ జోరుకు బ్రేక్ వేసిన ఆర్సీబీ.. ఎట్టకేలకు రెండో విజయం నమోదు చేసుకున్న బెంగళూరు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 206 పరుగుల భారీ స్కోరు సాధించింది.