Also Read :Robert Vadra : పాలిటిక్స్లోకి రాబర్ట్ వాద్రా.. గ్రౌండ్ రెడీ ?
ఏఐ ఫొటోలు, వీడియోలు.. సీఎం రేవంత్ సీరియస్
హెచ్సీయూ, కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం, చెట్ల నరికివేతకు సంబంధించి కొందరు ఏఐతో ఫొటోలు, వీడియోలను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ అంశాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్గా తీసుకున్నారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగానే ఇదంతా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. నిజానిజాలను తెలుసుకోకుండా ఎంతోమంది ప్రముఖులు ఏఐ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి, ఇష్టానుసారంగా కామెంట్లు పెట్టారని గతంలో సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. అలాంటి వారిపై విచారణ జరిపి కేసులు నమోదు చేయాలని ఆయన ఆదేశించారు.
Also Read :Justice BR Gavai: తదుపరి సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్.. నేపథ్యమిదీ
ఇప్పటికే పలువురికి నోటీసులు
ఈ అంశంలో ఇప్పటికే పలువురికి నోటీసులు ఇచ్చిన పోలీసులు, కొంతమంది బీఆర్ఎస్ నేతలపై కేసులు పెట్టారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఐఏఎస్ స్మితా సభర్వాల్ ఫేక్ ఫొటోలను రీపోస్ట్ చేశారంటూ తాజాగా పోలీసులు నోటీసులు ఇచ్చారు. మొత్తం మీద ఏఐ టెక్నాలజీ సామాన్యుల నుంచి ఐఏఎస్ల వరకు అందరినీ పక్కదోవ పట్టిస్తోంది. అబద్ధాన్ని కూడా నిజం అని నమ్మేలా చేస్తోంది.