CM Revanth Reddy: కేసీఆర్ సచ్చినా రుణమాఫీ ఆగదు: రేవంత్
ఆగస్టు 15లోగా రూ.2 లక్షల పంట రుణాలను మాఫీ చేయాలనీ, లేదంటే పదవి నుంచి వైదొలగాలని సిద్దిపేట ఎమ్మెల్యే టీ హరీశ్రావు విసిరిన సవాల్ను స్వీకరించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రైతు రుణమాఫిపై బీఆర్ఎస్ కు దిమ్మతిరికే కౌంటర్ ఇచ్చారు.
- By Praveen Aluthuru Published Date - 08:32 PM, Tue - 23 April 24
CM Revanth Reddy: ఆగస్టు 15లోగా రూ.2 లక్షల పంట రుణాలను మాఫీ చేయాలనీ, లేదంటే పదవి నుంచి వైదొలగాలని సిద్దిపేట ఎమ్మెల్యే టీ హరీశ్రావు విసిరిన సవాల్ను స్వీకరించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రైతు రుణమాఫిపై బీఆర్ఎస్ కు దిమ్మతిరికే కౌంటర్ ఇచ్చారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో జరిగిన కొడంగల్ నియోజకవర్గ స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ.. సూర్యుడు ఉదయించే దిశను మార్చుకున్నా..కేసీఆర్ ఫాంహౌస్లో ఆత్మహత్య చేసుకున్నా.. ఆగస్టు 15లోగా రుణాలు మాఫీ చేస్తామన్నారు సీఎం రేవంత్.
రైతులకు రుణాలు చెల్లించాలంటూ బ్యాంకర్లకు నోటీసులు పంపడంపై సీఎం హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలను సహించేది లేదన్నారు. మహబూబ్నగర్ లోక్సభ బీజేపీ అభ్యర్థిగా డీకే అరుణ తనను దూషిస్తున్నారని, మహిళగా గౌరవించలేదని చేసిన ఆరోపణలపై రేవంత్ స్పందిస్తూ.. పాలమూరు ప్రాంతంలో తనకు శత్రువులు లేరని అన్నారు. నేను నిన్ను చూసి అసూయపడేలా నీ దగ్గర ఏమి ఉందని ప్రశ్నించారు. డీకే అరుణ మహబూబ్నగర్ జిల్లా అభివృద్ధికి చేసిందేమీ లేదని, ఆమె లోక్సభ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు ఆమెకు లేదన్నారు రేవంత్రెడ్డి. మక్తల్-నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి నాటి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఆమె నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు అడ్డుకున్నారో చెప్పాలని అరుణను ఆయన ప్రశ్నించారు.
We’re now on WhatsApp. Click to Join
రోడ్ల నిర్మాణం, పాఠశాలలు, కళాశాలల ఏర్పాటు, పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా వచ్చినా.. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు తమ పార్టీ హైకమాండ్ను ఎందుకు ప్రభావితం చేయలేకపోయారని రేవంత్ అరుణను ప్రశ్నించారు. బీజేపీ పిచ్చి తారాస్థాయికి చేరుకుందని, ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నారన్నారు. 3,900 కోట్ల రెవెన్యూ లోటుతో తాను ముఖ్యమంత్రి అయ్యానని, గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు ప్రభుత్వం రూ.26,000 వడ్డీ మాత్రమే చెల్లించిందని చెప్పారు. కేసీఆర్ ఇంట్లో ఉన్నదంతా ఖర్చుపెట్టి అమ్ముకునే తాగుబోతుతో పోల్చారు సీఎం. పాలమూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటానని రేవంత్ హామీ ఇచ్చారు.
100 రోజుల్లో కాంగ్రెస్ అమలు చేస్తున్న ఐదు హామీలపై రేవంత్ క్లారిటీ:
ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు ఇచ్చేందుకు రూ.4,500 కోట్లు ఖర్చు చేస్తున్నాం
రాజీవ్ ఆరోగ్యశ్రీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లు విడుదల చేసింది.
మహిళలకు ఉచిత ఛార్జీల పథకం ప్రారంభించినప్పటి నుండి 40 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు.
మహిళలకు ఉచిత ఛార్జీల పరిహారం కోసం రాష్ట్ర ప్రభుత్వం టిఎస్ఆర్టిసికి రూ.1,369 కోట్లు విడుదల చేసింది. 45 లక్షల ఇళ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. 22,500 కోట్లతో 4,50,000 ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామని సీఎం చెప్పారు.
Also Read: Midgut Volvulus : మెలితిరిగిన పేగులకు శస్త్ర చికిత్స.. పూణే వైద్యుల ప్రతిభ..!
Tags
Related News
Lok Polls : సింగరేణిని ముంచేందుకు రేవంత్ కుట్రలు – కేసీఆర్
మంచిగ ఉన్న సింగరేణిని ఒకప్పుడు ముంచిన కాంగ్రెస్ .. ఇప్పుడు మరోసారి మోడీతో కలిసి రేవంత్ రెడ్డి సింగరేణిని ముంచేందుకు కుట్రలు పన్నుతున్నారని పేర్కొన్నారు