HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Even If Kcr Dies By Suicide Crop Loans Will Clear At August 15

CM Revanth Reddy: కేసీఆర్ సచ్చినా రుణమాఫీ ఆగదు: రేవంత్

ఆగస్టు 15లోగా రూ.2 లక్షల పంట రుణాలను మాఫీ చేయాలనీ, లేదంటే పదవి నుంచి వైదొలగాలని సిద్దిపేట ఎమ్మెల్యే టీ హరీశ్‌రావు విసిరిన సవాల్‌ను స్వీకరించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతు రుణమాఫిపై బీఆర్ఎస్ కు దిమ్మతిరికే కౌంటర్ ఇచ్చారు.

  • Author : Vamsi Chowdary Korata Date : 23-04-2024 - 8:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Revanth Reddy
CM Revanth Reddy

CM Revanth Reddy: ఆగస్టు 15లోగా రూ.2 లక్షల పంట రుణాలను మాఫీ చేయాలనీ, లేదంటే పదవి నుంచి వైదొలగాలని సిద్దిపేట ఎమ్మెల్యే టీ హరీశ్‌రావు విసిరిన సవాల్‌ను స్వీకరించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతు రుణమాఫిపై బీఆర్ఎస్ కు దిమ్మతిరికే కౌంటర్ ఇచ్చారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో జరిగిన కొడంగల్ నియోజకవర్గ స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ.. సూర్యుడు ఉదయించే దిశను మార్చుకున్నా..కేసీఆర్ ఫాంహౌస్‌లో ఆత్మహత్య చేసుకున్నా.. ఆగస్టు 15లోగా రుణాలు మాఫీ చేస్తామన్నారు సీఎం రేవంత్.

రైతులకు రుణాలు చెల్లించాలంటూ బ్యాంకర్లకు నోటీసులు పంపడంపై సీఎం హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలను సహించేది లేదన్నారు. మహబూబ్‌నగర్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థిగా డీకే అరుణ తనను దూషిస్తున్నారని, మహిళగా గౌరవించలేదని చేసిన ఆరోపణలపై రేవంత్ స్పందిస్తూ.. పాలమూరు ప్రాంతంలో తనకు శత్రువులు లేరని అన్నారు. నేను నిన్ను చూసి అసూయపడేలా నీ దగ్గర ఏమి ఉందని ప్రశ్నించారు. డీకే అరుణ మహబూబ్‌నగర్‌ జిల్లా అభివృద్ధికి చేసిందేమీ లేదని, ఆమె లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు ఆమెకు లేదన్నారు రేవంత్‌రెడ్డి. మక్తల్‌-నారాయణపేట-కొడంగల్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకానికి నాటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఆమె నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు అడ్డుకున్నారో చెప్పాలని అరుణను ఆయన ప్రశ్నించారు.

We’re now on WhatsApp. Click to Join

రోడ్ల నిర్మాణం, పాఠశాలలు, కళాశాలల ఏర్పాటు, పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా వచ్చినా.. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు తమ పార్టీ హైకమాండ్‌ను ఎందుకు ప్రభావితం చేయలేకపోయారని రేవంత్‌ అరుణను ప్రశ్నించారు. బీజేపీ పిచ్చి తారాస్థాయికి చేరుకుందని, ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నారన్నారు. 3,900 కోట్ల రెవెన్యూ లోటుతో తాను ముఖ్యమంత్రి అయ్యానని, గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు ప్రభుత్వం రూ.26,000 వడ్డీ మాత్రమే చెల్లించిందని చెప్పారు. కేసీఆర్ ఇంట్లో ఉన్నదంతా ఖర్చుపెట్టి అమ్ముకునే తాగుబోతుతో పోల్చారు సీఎం. పాలమూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటానని రేవంత్ హామీ ఇచ్చారు.

100 రోజుల్లో కాంగ్రెస్ అమలు చేస్తున్న ఐదు హామీలపై రేవంత్ క్లారిటీ:
ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు ఇచ్చేందుకు రూ.4,500 కోట్లు ఖర్చు చేస్తున్నాం
రాజీవ్ ఆరోగ్యశ్రీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లు విడుదల చేసింది.
మహిళలకు ఉచిత ఛార్జీల పథకం ప్రారంభించినప్పటి నుండి 40 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు.
మహిళలకు ఉచిత ఛార్జీల పరిహారం కోసం రాష్ట్ర ప్రభుత్వం టిఎస్‌ఆర్‌టిసికి రూ.1,369 కోట్లు విడుదల చేసింది. 45 లక్షల ఇళ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాం. 22,500 కోట్లతో 4,50,000 ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామని సీఎం చెప్పారు.

Also Read: Midgut Volvulus : మెలితిరిగిన పేగులకు శస్త్ర చికిత్స.. పూణే వైద్యుల ప్రతిభ..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • august 15
  • CM Revanth Reddy
  • crop loans
  • DK Aruna
  • harish rao
  • kcr
  • Lok Sabha polls 2024
  • palamuru
  • suicide
  • telangana

Related News

Massive arrangements for the Farmers' Blessing Meeting

Rythu Ashirvada Sabha: రైతు ఆశీర్వాద సభకు భారీ ఏర్పాట్లు

జిల్లా పరిధిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ‘రైతు ఆశీర్వాద సభ’కు జిల్లా యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేసింది. సభకు హాజరయ్యే రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేదిక నిర్మాణం, తాగునీరు, నీడ వంటి మౌలిక వసతులను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. భారీ ఎత్తున జనం తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో, సభా ప్రాంగణం వద్ద మరియు పరిసర ప్రాంతాలలో ఎలాం

  • Kalvakuntla Kavitha lashes out at KTR.

    kavitha kalvakuntla: కేటీఆర్ పై కల్వకుంట్ల కవిత ఫైర్

  • Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

    ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Latest News

  • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

  • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

  • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

  • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd