తెలంగాణ బీజేపీ అధ్యక్షురాలిగా డీకే అరుణ? కేంద్ర మంత్రిగా బండి ప్రమోట్?
ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక ఘట్టాలు చోటుచేసుకుంటున్నాయి. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న కాంగ్రెస్, బీజేపీ తమ తమ రాజకీయ వ్యూహాలతో ముందుకెళుతున్నాయి.
- By Praveen Aluthuru Published Date - 03:33 PM, Sat - 10 June 23
* తెలంగాణ బీజేపీలో ముసలం
* పార్టీ అధ్యక్షుడిగా బండి చాప్టర్ ముగిసినట్లేనా?
* కేంద్రంలోని బీజేపీ పెద్దలతో లాబీయింగ్ వర్కౌట్ అయినట్టేనా?
* తెలంగాణ బీజేపీ అధ్యక్షురాలిగా వలస మహిళ నేత?
DK Aruna: ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక ఘట్టాలు చోటుచేసుకుంటున్నాయి. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న కాంగ్రెస్, బీజేపీ తమ తమ రాజకీయ వ్యూహాలతో ముందుకెళుతున్నాయి. ఇక పదవిని కాపాడుకునే పనిలో అధికార పార్టీ బీఆర్ఎస్ అందివచ్చిన అవకాశాన్ని వదులుకోవట్లేదు. రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేసేందుకు పదవి ఆశ చూపి నేతలను తమ గూటికి చేర్చుకునే పనిలో ఉంది. ప్రస్తుతం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొనే అవకాశం కనిపిస్తుంది.
గత కొంతకాలంగా తెలంగాణ బీజేపీలో వర్గ పోరు స్పష్టంగా కనిపిస్తున్నది. బీఆర్ఎస్ మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఈటెల రాజేందర్ బీజేపీలో జాయిన్ అయిన తరువాత పార్టీలో అంతర్గత పోరు మొదలైనట్టుగా తెలుస్తుంది. మరోవైపు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కాకా పుట్టించాయి. పేపర్ లీకేజి కేసులో బండికి మద్దతు పలకకపోవడం కాకుండా పరోక్షంగా స్పందించి పార్టీలో చీలిక రాబోతున్నట్టు సంకేతాలు పంపారు. ఇక వచ్చే ఎన్నికల్లో బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆధ్యర్వంలో పార్టీ ఎన్నికలకు వెళితే ఘోర పరాజయం తప్పదని ఇప్పటికే తెలంగాణ బీజేపీలోని ఒక వర్గం కేంద్రానికి నివేదించినట్టు తెలుస్తుంది.
కర్ణాటక ఎన్నికల్లో ఓటమి చవిచూసిన బీజేపీ తమ పార్టీని పటిష్టం చేసే పనిలో పడినట్టు తెలుస్తుంది. ఎక్కడెక్కడ పార్టీ వీక్ గా ఉందో అక్కడ ప్రక్షాళన మొదలుపెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్టు సమాచారం అందుతుంది. కర్ణాటక ఫలితాలతో కేంద్రం మండిపడుతుంది. ఇలానే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో అధికారం చేతులు మారడం ఖాయంగా భావిస్తున్నది ఢిల్లీ హైకమాండ్. ఈ నేపథ్యంలో ఏ మాత్రం రాజీ పడకుండా ఓటు బ్యాంకు కాపాడుకునేందుకు ఎలాంటి కఠిన నిర్ణయాలు అయినా తీసుకునేలా ప్రణాళికలు రచిస్తున్నది. ఇక తెలంగాణాలో త్వరలోనే ఆసక్తికర మార్పులు జరగనున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ని తొలగించి ఆ పదవిని ఓ మహిళ నేతకు కట్టబెట్టబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం.
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిలో కీలక మార్పు చోటుచేసుకోనున్నట్టు తెలుస్తుంది. అందుతున్న సమాచారం మేరకు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిని డీకే అరుణకు (DK Aruna) అప్పగించబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం. అలాగే ప్రచార కమిటీ చైర్మన్గా ఈటల రాజేందర్ (Etela Rajender) ను నియమించనున్నారట. ఇక ప్రస్తుతం బీజేపీ చీఫ్ బండి సంజయ్ (Bandi Sanjay) ను కేంద్ర మంత్రిగా ప్రమోట్ చేయనున్నారని తెలుస్తుంది. ఇప్పటికే కేంద్ర హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్టు, రెండు మూడు రోజుల్లో ఈ విషయాన్నీ వెల్లడించనున్నట్టు లీకులు అందుతున్నాయి. ఇదిలా ఉండగా బండి సంజయ్ కేంద్ర నిర్ణయంపై ఆసక్తి చూపడం లేదని తెలుస్తుంది. ఈ మేరకు ఆయన పార్టీ ఇంచార్జ్ సునీల్ బన్సల్ కు తన నిరసన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది.
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిని కాపాడుకునేందుకు బండి సంజయ్ కొత్త ఎత్తుగడ వేస్తున్నారు. కేంద్ర మంత్రి ప్రతిపాదనకు బండి సంజయ్ ఏ మాత్రం ఒప్పుకునే పరిస్థితి కనిపించడం లేదు. తనకు కేంద్ర మంత్రి పదవి వద్దు అని ఇప్పటికే బండి అధిష్టానానికి తేల్చి చెప్పినట్టు సమాచారం. అవకాశం ఇస్తే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతా..లేకపోతే ఏ పదవులు వద్దు అని స్పష్టం చేశారట. మరి కేంద్రం తీసుకున్న నిర్ణయం ఫైనల్ అయితే సంజయ్ ని ఒప్పిస్తారా? లేక తప్పిస్తారా? అనేది చూడాలి.
Read More: Telangana Politics: తెలంగాణాలో రాజకీయ రగడ మొదలుకానుందా…?
Related News
Narendra Modi : ఈ నకిలీ శివసేన.. కాంగ్రెస్లో విలీనం కావడం ఖాయం
మహారాష్ట్రలోని దిండోరిలో కాంగ్రెస్, శరద్ పవార్ ఎన్సీపీ, ఉద్ధవ్ ఠాక్రే శివసేనపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు.