Divyavani : కాంగ్రెస్ విజయంపై స్పందించిన దివ్యవాణి
ఈ విజయంలో భాగమైనందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఎంతో శ్రమించారని కొనియాడారు.
- By Sudheer Published Date - 11:21 AM, Tue - 5 December 23
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 64 స్థానాల్లో విజయం సాధించి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. ఈ క్రమంలో రాజకీయ ప్రముఖులు, చిత్రసీమ ప్రముఖులు కాంగ్రెస్ పార్టీ కి అభినందనలు తెలుపుతూ వస్తున్నారు. తాజాగా ఇటీవల కాంగ్రెస్ లో చేరిన నటి దివ్యవాణి (Divyavani) కాంగ్రెస్ విజయం ఫై స్పందించారు.
ఈ విజయంలో భాగమైనందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఎంతో శ్రమించారని కొనియాడారు. ఇక గెలిచిన ఎమ్మెల్యేలందరికీ ఆమె అభినందనలు తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆమె ఇండియా వచ్చిన వెంటనే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
దివంగత దర్శకుడు బాపు దర్శకత్వంలో వచ్చిన పెళ్లిపుస్తకం సినిమాతో ఆమెకు నటిగా మంచిపేరొచ్చింది. తొలి సినిమా నుంచే దివ్యవాణికి బాపుబొమ్మ అనే పేరుంది. ఆ తర్వాత ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం, ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్, సంసారాల మెకానిక్, పెళ్లికొడుకు వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సుమారు 40 తెలుగు సినిమాల్లో ఈమె నటించింది. వివాహం తరువాత సినిమాలకు కొంత విరామమిచ్చి తరువాత రాధా గోపాళం సినిమాతో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు. కొన్ని టెలివిజన్ సీరియళ్లలో కూడా నటించింది. ఆ తర్వాత రాజకీయాల్లో చేరి యాక్టివ్ అయ్యారు.
2019లో టీడీపీలో చేరిన దివ్య వాణి.. ఏపీ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించారు. టీడీపీ పార్టీ అధికార ప్రతినిధిగా కూడా పని చేశారు. ఆ తర్వాత పార్టీతో విభేదించి 2022లో రాజీనామా చేశారు. అప్పట్నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. రీసెంట్ గా ఏఐసీసీ ఇన్ఛార్జి మాణిక్ రావ్ ఠాక్రే (Manikrao Thakre) సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంది.
Read Also : Tummala Nageshwara Rao : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా తుమ్మల ?
Related News
Chicken Price : కాంగ్రెస్ గెలుపు సందర్బంగా తక్కువ ధరకే చికెన్ అమ్మకం..
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ (Congress) భారీ మెజార్టీ తో విజయ డంఖా మోగించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఖమ్మం (Khammam) జిల్లాలో 9 స్థానాల్లో గెలిచి ఖమ్మం గడ్డ ..కాంగ్రెస్ అడ్డా అనిపించుకుంది. భట్టి విక్రమార్క (మధిర ) , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (పాలేరు) , తుమ్మల (ఖమ్మం ) . మట్టా రాగమయి (సత్తుపల్లి), పాయం వెంకటేశ్వర్లు (పినపాక ), ఇల్లందు (కోరం కనకయ్య), మాలోతు రామ్దాస్ (వైరా ) , కూనంనేని [&hell