Hyderabad:జూబ్లీహిల్స్ అత్యాచార కేసులో ఆరుగురు అరెస్ట్..సంచలన విషయాలు వెల్లడించిన సీపీ..!!
హైదరాబాద్ జూబ్లీహిల్స్ అత్యాచారం కేసుకు సంబంధించి పూర్తి విషయాలు వెల్లడించారు సీపీ ఆనంద్. ఈ కేసులో మొత్తం ఆరుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు.
- By hashtagu Published Date - 09:51 PM, Tue - 7 June 22
హైదరాబాద్ జూబ్లీహిల్స్ అత్యాచారం కేసుకు సంబంధించి పూర్తి విషయాలు వెల్లడించారు సీపీ ఆనంద్. ఈ కేసులో మొత్తం ఆరుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ ఆరుగురిలో ఐదుగురు మైనర్లు, ఒకర మేజర్ ఉన్నట్లు చెప్పారు. కేసులో 5గురు మైనర్లు ఉన్నారు కాబట్టి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారి పేర్లను వెల్లడించడం లేదని తెలిపారు. వారందరిపై పోక్సోచట్టం కింద కేసు నమోదు చేశామన్నారు సీపీ. అయితే ఆరోవ్యక్తి బాధితురాలిపై అత్యాచారం చేయలేదన్నారు.
రేప్ చేసిన నిందితులకు 20ఏళ్ల జైలు శిక్ష లేదంటే…జీవిత ఖైదు విధించే అవకాశం ఉన్నట్లు చెప్పారు. కేసుకు సంబంధించి తమ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని తెలిపారు సీపీ. రేప్ కేసులో బాధితురాలు నిందితులను గుర్తించలేకపోతుందని చెప్పారు. సరైన ఆధారాలు లేకపోవడం వల్లే నిందితులను అదుపులోకి తీసుకోవడం ఆలస్యమైందని చెప్పారు. కోర్టు తాము పూర్తి ఆధారాలు సమర్పించాల్సి ఉందని తెలిపారు. సీసీ ఫుటేజీల ద్వారా నిందితులను గుర్తించినట్లు సీపీ వెల్లడించారు.
కాగా మే 28న ఈ ఘటన జరిగిందని…మే 31 వరకు బాధితురాలు తమ తల్లిదండ్రులకు చెప్పలేదని తెలిపారు. మే 31న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు సీపీ తెలిపారు. మే 28 మధ్యాహ్నం 1.10గంటలకు బాధితురాలు…ఆమె స్నేహితుడు 1.50 గంటల వరకు పబ్ లోనే ఉన్నారని…తర్వాత ఆమె స్నేహితుడు పబ్ నుంచి బయటకు వెళ్లాడని..మరో స్నేహితురాలు బాధితురాలిని కలిసినట్లు వివరించారు సీపీ. అదే సమయంలో మైనర్ నిందితుడితో పాటు సాదుద్దీన్ బాధితురాలి వద్దకు వెళ్లారని..వాళ్లు పబ్ లోనే అసభ్యంగా ప్రవర్తించారని పేర్కొన్నారు. వీళ్లు పబ్ నుంచి సాయంత్రం ఐదున్నరకు బయటకు వచ్చారని తెలిపారు.
బాధితురాలి ఫ్రెండ్ పబ్ లో నుంచి వెళ్లి క్యాబ్ బుక్ చేసుకుందని చెప్పారు. పబ్ నుంచి బయటకు వచ్చిన బాధితురాలిని కారులో ఎక్కించుకున్న నిందితులు కాన్సు బేకరికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అక్కడి అమ్మాయిని బలవంతం చేశారని…రాత్రి 7గంటలకు బాధితురాలని పబ్ దగ్గర దింపారని సీపీ చెప్పారు. నిందితులపై 376(d)పోక్స్ 5g(6), 366, 366(a) ఐటీ యాక్ట్ 67 కింద కేసులు నమోదు చేసినట్లు సీపీ ఆనంద్ తెలిపారు.
Related News
Amit Shah ‘Deepfake’ Video Case: ముగ్గురి కాంగ్రెస్ నేతల అరెస్ట్
కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంఛార్జ్ సతీష్తోపాటు నవీన్, తస్లీమాను అరెస్ట్ చేసారు. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ పోలీసులు సీఎం రేవంత్రెడ్డి సహా కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.