HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cooperate In The Completion Of Projects Worth Rs 1 63 Lakh Crores Revanths Key Appeal

1.63 Lakh Crores: రూ.1.63 ల‌క్ష‌ల కోట్ల విలువైన ప్రాజెక్టుల పూర్తికి స‌హ‌క‌రించండి.. రేవంత్ కీల‌క విజ్ఞ‌ప్తి

ఆర్ఆర్ఆర్ నిర్మిస్తామ‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ 2022లోనే ప్ర‌క‌టించిన విష‌యాన్ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

  • By Gopichand Published Date - 11:51 PM, Thu - 12 December 24
  • daily-hunt
Hyderabad
CM Revanth

1.63 Lakh Crores: తెలంగాణ రాష్ట్రంలో వివిధ ర‌కాల అభివృద్ధి ప‌నుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం మ‌ద్ద‌తు ఇచ్చేందుకు కృషి చేయాల‌ని కేంద్ర బొగ్గు, గ‌నుల శాఖ మంత్రి కిష‌న్ రెడ్డికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.. ప్రాంతీయ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్‌), హైద‌రాబాద్ మెట్రో ఫేజ్ 2 తోపాటు హైద‌రాబాద్, వ‌రంగ‌ల్‌ల్లో సీవ‌రేజీ, అండ‌ర్‌గ్రౌండ్ డ్రైనేజీ ప్లాన్‌… సింగ‌రేణి సంస్థ‌కు బొగ్గు గ‌నుల కేటాయింపు స‌హా ప‌లు అంశాల‌పై కేంద్ర మంత్రితో ముఖ్య‌మంత్రి చ‌ర్చించారు. కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డిని ఢిల్లీలోని ఆయ‌న అధికారిక నివాసంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం క‌లిశారు. ఈ సంద‌ర్భంగా మొత్త రూ.1,63,559.31 కోట్ల (1.63 Lakh Crores) విలువైన ప్రాజెక్టుల విష‌యంలో కేంద్రం నుంచి కావ‌ల్సిన చేయూత‌పై కేంద్ర మంత్రితో ముఖ్య‌మంత్రి చ‌ర్చించారు.

ఆర్ఆర్ఆర్ నిర్మిస్తామ‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ 2022లోనే ప్ర‌క‌టించిన విష‌యాన్ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆర్ఆర్ఆర్ ఉత్త‌ర భాగం భూ సేక‌ర‌ణ‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం ప్రారంభించింద‌ని.. త్రైపాక్షిక ఒప్పందం పూర్త‌యినా ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్‌హెచ్ఏఐ అనుమ‌తి ఇవ్వ‌లేద‌ని తెలిపారు. ఆర్ఆర్ఆర్ ద‌క్షిణ భాగానికి ఇంకా అనుమ‌తి ఇవ్వ‌ని విష‌యాన్ని కేంద్ర మంత్రికి సీఎం గుర్తు చేశారు. ఆర్ఆర్ఆర్‌తో పాటు రేడియ‌ల్ రోడ్లు పూర్త‌యితే ఫార్మా ప‌రిశ్ర‌మ‌ల‌తో పాటు ఇండ‌స్ట్రియ‌ల్ హ‌బ్ లు, లాజిస్టిక్ పార్క్స్‌, రిక్రియేష‌న్ పార్కులు వంటివి అభివృద్ధి అవుతాయ‌ని సీఎం అన్నారు.

ఆర్ఆర్ఆర్ రెండు వైపులా పూర్తికి ఈ ర‌హ‌దారికి సంబంధించి వివిధ కేంద్ర ప్ర‌భుత్వ శాఖ‌ల్లో పెండింగ్‌లో ఉన్న అనుమ‌తుల‌న్నీ ఇప్పించేందుకు కృషి చేయాల‌ని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ఈ మొత్తం ప్రాజెక్టు అంచ‌నా వ్య‌యం రూ.34,367.62 కోట్లు అని కేంద్ర మంత్రికి సీఎం తెలిపారు. ఓఆర్ఆర్- ఆర్ఆర్ఆర్‌ల అనుసంధానానికి రేడియ‌ల్ రోడ్లు నిర్మించాల‌ని సంక‌ల్పించామ‌ని కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 10 గ్రీన్‌ఫీల్డ్ రోడ్ల‌తో పాటు ఓఆర్ఆర్ అనుసంధానించే మెట్రో కారిడార్ రేడియ‌ల్ రోడ్ల‌కు రూ.45 వేల కోట్లు వ్య‌య‌మ‌వుతాయ‌ని కేంద్ర మంత్రికి సీఎం వివ‌రించారు.

– మెట్రో ఫేజ్ 2లో భాగంగా నాగోల్ నుంచి రాజీవ్ గాంధీ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం, రాయ‌దుర్గం నుంచి కోకాపేట్ నియోపొలిస్‌, ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయ‌ణ‌గుట్ట‌, మియాపూర్‌-ప‌టాన్ చెరు, ఎల్‌బీ న‌గ‌ర్‌-హ‌య‌త్ న‌గ‌ర్ మ‌ధ్య మొత్తం 76.4 కి.మీల నిర్మించ‌నున్న మెట్రో రైలు నిర్మాణానికి రూ.24,269 కోట్ల వ్య‌య‌మ‌వుతుంద‌ని అంచ‌నా వేసిన‌ట్లు కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి వివ‌రించారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు సంయుక్తంగా 50: 50 వాటాతో మెట్రో ఫేజ్‌ను 2 చేప్ట‌టేందుకు స‌హ‌క‌రించాల‌ని కేంద్ర మంత్రిని సీఎం కోరారు.

– మూసీరివ‌ర్ ఫ్రంట్ డెవ‌ల‌ప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా చేప‌ట్ట‌నున్న గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టుకు ర‌క్ష‌ణ శాఖ ప‌రిధిలోని 222.27 ఎక‌రాల భూమి రాష్ట్ర ప్ర‌భుత్వానికి బ‌ద‌లాయించాల‌ని ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను ఇప్ప‌టికే కోరిన విష‌యాన్ని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఆ భూముల బ‌ద‌లాయింపుతో పాటు గాంధీ స‌రోవ‌ర్ నిర్మాణం, మూసీ సీవ‌రేజీ ప్రాజెక్టులు, 11 హెరిటేజ్ వంతెన‌ల నిర్మాణంతో పాటు ఇత‌ర ప‌నుల‌కు రూ.14,100 కోట్లు వ్య‌య‌మ‌వుతాయ‌ని అంచ‌నా వేశామ‌ని, నిధుల మంజూరుతో పాటు అనుమ‌తులకు స‌హ‌క‌రించాల‌ని కేంద్ర మంత్రిని సీఎం కోరారు.

Also Read: Hyderabad-Srisailam: హైద‌రాబాద్‌- శ్రీ‌శైలం ఎలివేటెడ్ కారిడార్ మంజూరు చేయండి: సీఎం రేవంత్‌

– మూసీ పున‌రుజ్జీవంలో భాగంగా గోదావ‌రి నీటిని మూసీకి త‌ర‌లించేందుకు, గోదావ‌రి నుంచి న‌గ‌రానికి 15 టీఎంసీలను హైద‌రాబాద్ తాగు నీరు అవ‌స‌రాల‌కు త‌ర‌లించేందుకు రూ.7,440 కోట్ల‌తో ప్ర‌ణాళిక‌లు రూపొందించిన‌ట్లు కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలియ‌జేశారు. ఆ మొత్తం విడుద‌ల‌కు స‌హ‌క‌రించాల‌ని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞ‌ప్తి చేశారు.

– హైద‌రాబాద్ న‌గ‌రంతో పాటు స‌మీప 27 మున్సిపాలిటీల్లో 7,444 కి.మీ.మేర సీవ‌రేజీ నెట్‌వ‌ర్క్ ప‌నులకు రూ.17,212.69 కోట్ల‌తో స‌మ‌గ్ర సీవ‌రేజీ మాస్ట‌ర్ ప్లాన్ రూపొందించామ‌ని, అమృత్ 2 లేదా ప్ర‌త్యేక ప్రాజెక్టు కింద దానిని చేప‌ట్టేందుకు స‌హ‌క‌రించాల‌ని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డిని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కోరారు. అలాగే తెలంగాణ‌లో రెండో పెద్ద న‌గ‌ర‌మైన వ‌రంగ‌ల్ లో అండ‌ర్‌గ్రౌండ్ డ్రైనేజీ ప్లాన్‌ను రూప‌క‌ల్ప‌న చేశామని, రూ.4,170 కోట్ల వ్య‌య‌మ‌య్యే ఈ ప్లాన్‌ను అమృత్ 2 లేదా ప్ర‌త్యేక ప‌థ‌కం కింద చేప‌ట్టాల‌ని సీఎం కోరారు.

– కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల ఉమ్మ‌డి సంస్థ అయిన సింగ‌రేణి ప్ర‌త్య‌క్షంగా 43 వేల మందికి, ప‌రోక్షంగా ల‌క్ష మందికి ఉపాధి క‌ల్పించ‌డంతో పాటు ద‌క్షిణాది రాష్ట్రాల్లోని థ‌ర్మ‌ల్ విద్యుదుత్ప‌త్తి కేంద్రాల‌కు బొగ్గు స‌ర‌ఫ‌రా చేస్తోంద‌ని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి దృష్టికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. దీర్ఘ‌కాలం పాటు సింగ‌రేణి సంస్థ మ‌నుగ‌డ కొన‌సాగించేందుకు గానూ గోదావ‌రి లోయ ప‌రిధిలోని బొగ్గు బ్లాక్‌ల‌ను సింగ‌రేణికి కేటాయించాల‌ని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.

– సెమీకండ‌క్ట‌ర్ల ప్రాజెక్టుల‌కు హైద‌రాబాద్ అనువుగా ఉంద‌ని, నిపుణులైన కార్మికులు, మౌలిక వ‌స‌తుల అభివృద్దిలో రాష్ట్ర ప్ర‌భుత్వం చూపుతున్న శ్ర‌ద్ధ‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని తెలంగాణ‌ను సెమీకండ‌క్ట‌ర్ మిష‌న్ లో చేర్చాల‌ని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ప్రాజెక్టుల‌కు అనుమ‌తులు, నిధుల విడుద‌ల‌తో ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపాల‌ని కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డికి ముఖ్య‌మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు.. ముఖ్య‌మంత్రి వెంట ఎంపీలు సురేశ్ షెట్కార్‌, బ‌లరాం నాయ‌క్‌, ర‌ఘురాంరెడ్డి, చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి, ఎం. అనిల్ కుమార్ యాద‌వ్‌, జి. వంశీకృష్ణ‌, ఢిల్లీలో రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌తినిధి ఏపీ జితేంద‌ర్ రెడ్డి ఉన్నారు.

తెలంగాణకు కేంద్రీయ విద్యాల‌యాలు కేటాయించాల‌ని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ఇటీవ‌ల రాష్ట్రానికి ఏడు న‌వోద‌య విద్యాల‌యాలు కేటాయించినందుకు కేంద్ర మంత్రికి కృత‌జ్ఞ‌తలు తెలిపారు. అదే స‌మ‌యంలో రాష్ట్రానికి ఒక్క కేంద్రీయ విద్యాల‌యం కూడా కేటాయించ‌లేద‌ని, కేంద్రీయ విద్యాల‌యాల‌తో పాటు నవోద‌య పాఠ‌శాల‌లు లేని జిల్లాల‌కు వాటిని కేటాయించాల‌ని సీఎం కోరారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 1.63 Lakh Crores
  • CM Revanth Reddy
  • Delhi news
  • hyderabad
  • New Delhi
  • pm modi
  • projects
  • telangana
  • telugu news

Related News

Jubilee Hills

Jubilee Hills: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థికి సీపీఐ సంపూర్ణ మద్దతు!

రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ అయిన మహేష్ కుమార్ గౌడ్ శుక్రవారం సీపీఐ కార్యాలయం మాగ్దూం భవన్‌లో సీపీఐ ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు.

  • Liquor Shops

    Liquor Shops: మద్యం దుకాణాలకు భారీగా దరఖాస్తులు!

  • Cctv Camera In Bathroom

    CCTV Camera In Bathroom: బాత్రూంలో సీక్రెట్ కెమెరా.. ఓనర్ అరెస్ట్

  • Supreme Court expresses deep anger over dog attacks on Delhi streets

    42% Backward Class Quota : తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ కు భారీ దెబ్బ

  • PM Modi

    PM Modi : రూ. 13వేల కోట్ల పనులకు రేపు ప్రధాని శ్రీకారం

Latest News

  • Telangana Bandh : రేపే బంద్.. డీజీపీ హెచ్చరికలు

  • TTD: తిరుమ‌ల శ్రీవారి భక్తుల‌కు శుభ‌వార్త‌..!

  • Jubilee Hills Bypoll : కాంగ్రెస్ అభ్యర్థికి AIMIM మద్దతు

  • IPS Sanjay : ఐపీఎస్ సంజయ్ రిమాండ్ పొడిగింపు

  • Asia Cup 2025 Trophy: ప్ర‌స్తుతం ఆసియా కప్ ట్రోఫీ ఎక్కడ ఉంది?

Trending News

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    • Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య

    • Ramya Moksha Kancharla : రేయ్ డీమాన్ సుడి రా నీకు.. పచ్చళ్ల పాప రీతూ పాప.. మధ్యలో మాధురి..!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd