Telangana: డా:బీఆర్ అంబేద్కర్ ని ఓడించింది కాంగ్రెస్సే
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ నియోజకవర్గాల వారీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఆయన బహిరంగ సభలలో పాల్గొంటూ ఎన్నికల ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ రోజు చెన్నూరు పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ బహిరంగ సభలో ప్రసంగించారు.
- By Praveen Aluthuru Published Date - 04:45 PM, Tue - 7 November 23
Telangana: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ నియోజకవర్గాల వారీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఆయన బహిరంగ సభలలో పాల్గొంటూ ఎన్నికల ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ రోజు చెన్నూరు పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ బహిరంగ సభలో ప్రసంగించారు.
సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. దళితుల సంక్షేమానికి బీఆర్ఎస్ అండగా నిలుస్తోందని, 1950లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను ఓడించింది కాంగ్రెస్ పార్టీయేనని సీఎం కేసీఆర్ ఆరోపించారు. హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయం సమీపంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పింది, ఎస్సీల అభ్యున్నతి కోసం దళిత బంధు వంటి పథకాలను ప్రవేశపెట్టింది తమ ప్రభుత్వమని కేసీఆర్ అన్నారు. పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేయాలని కోరుతూ, రాబోయే ఐదేళ్ల భవితవ్యాన్ని ఓటే నిర్ణయిస్తుందని, రాజకీయ పార్టీలకు ఓటు వేసే ముందు గత ప్రభుత్వాల తీరు తెలుసుకోవాలని కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇతర పార్టీలు దళితులను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకున్నాయి. దళితుల కోసం అంబేద్కర్ ఎన్నో పోరాటాలు చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో ఆయన ఓడించింది కాంగ్రెస్ పార్టీయేనని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో అంబేద్కర్ను ఓడించిన చరిత్ర మీకు తెలియాలి. కాంగ్రెస్ పార్టీ అతనిని ఓడించింది మరియు అతని సిద్ధాంతాన్ని అమలు చేయలేదు, అని కేసీఆర్ చెప్పారు. ఇదే క్రమంలో సీఎం కేసీఆర్ బీజేపీ పార్టీని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం విమానాశ్రయాలు, ఓడరేవులు, రైల్వేలు, బొగ్గు గనులను కూడా అమ్ముకుంటోందని బీజేపీపై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందని, గెలిస్తే అభివృద్ధి చెందుతుందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.
Also Read: BRS Strategy: బీఆర్ఎస్ కొత్త వ్యూహం.. సోషల్ మీడియా కీలకం
Related News
Phone Tapping Case; ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు.. సంచలన విషయాలు వెలుగులోకి
ట్యాపింగ్ లో కేసులో తొలిసారి మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేరును ప్రస్తావించారు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు.కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులు, పార్టీలో ఆయన సన్నిహితుల వ్యవహారాలను చక్కబెట్టేందుకే తామంతా కలిసి పని చేశామని రాధాకిషన్ రావు వాంగ్మూలంలో చెప్పినట్టు సమాచారం