HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Come See Karnatakas Welfare D K Shivakumar Tells Kcr Ktr

Vijayabheri Yatra: కేసీఆర్..కేటీఆర్ కర్ణాటకకు రండీ .. డీకే శివకుమార్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలును చూసేందుకు రాష్ట్ర మంత్రులతో కలిసి కర్ణాటక రావాల్సిందిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్ లను డీకే శివకుమార్ ఆహ్వానించారు. ఈ రోజు తాండూరులో జరిగిన కాంగ్రెస్ 'విజయభేరి యాత్ర'లో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Author : Vamsi Chowdary Korata Date : 28-10-2023 - 9:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vijayabheri Yatra
Vijayabheri Yatra

Vijayabheri Yatra: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలును చూసేందుకు రాష్ట్ర మంత్రులతో కలిసి కర్ణాటక రావాల్సిందిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్ లను డీకే శివకుమార్ ఆహ్వానించారు. ఈ రోజు తాండూరులో జరిగిన కాంగ్రెస్ ‘విజయభేరి యాత్ర’లో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

కర్ణాటకలో విద్యుత్ సరఫరాపై ఇటీవల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై డీకే మాట్లాడుతూ.. “గృహ జ్యోతితో కర్ణాటకలోని అన్ని గృహాలకు 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా సరఫరా చేస్తున్నాం. కర్ణాటకలో మా హామీలను నిలబెట్టుకున్నాం. అయితే గత దశాబ్ద కాలంగా కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చారా? అంటూ ప్రశ్నించారు.

డీకే శివకుమార్ తన 2014 నుండి 2018 వరకు ఇంధన శాఖ మంత్రిగా తన పదవీకాలాన్ని ప్రస్తావిస్తూ కర్ణాటకలో విద్యుత్ ఉత్పత్తిని 10,000 మెగావాట్ల నుండి 23,000 మెగావాట్లకు పెంచాము. గడచిన నాలుగేళ్లలో బీజేపీ ప్రభుత్వం కరెంటు ఇవ్వడంలో విఫలమైందని, అయితే కరువు సమయంలో ప్రతి రైతుకు 5 గంటల కరెంటు ఇస్తామని, రాష్ట్రవ్యాప్తంగా 7 గంటల విద్యుత్ అందించేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో కర్ణాటకకు ఇచ్చిన హామీల కంటే తెలంగాణకు కాంగ్రెస్ వాగ్దానం చేసిన ఆరు హామీలు బెటరంటూ పేర్కొన్నారు. కర్ణాటకలో 1.5 కోట్ల మంది మహిళలు గృహలక్ష్మి పథకం కింద రూ.2,000 పొందుతున్నారు. ప్రతి ఇంటికి 10 కిలోల బియ్యం ఉచితంగా మరియు రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులోకి తీసుకొచ్చాము. తెలంగాణాలో కూడా ఇవే పధకాలు అమలవుతాయి. సీనియర్ సిటిజన్లకు 4,000 రూపాయలు అందజేస్తాము. ప్రతి రైతుకు రూ.15వేలు, వ్యవసాయ కూలీలందరికీ రైతు భరోసా కింద 12వేలు అందజేస్తామని, విద్యార్థులందరికీ ఉన్నత విద్య కోసం ఐదు లక్షల రూపాయలు అందజేస్తామని చెప్పారు.

2014లో కొత్త తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా సోనియా గాంధీ తన హామీని నెరవేర్చారు. ఇప్పుడు ఆమెకు కృతజ్ఞతలు తెలియజేయాల్సిన సమయం వచ్చింది అని ఆయన అన్నారు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సమాజంలోని అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతాయి అని చెప్పారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్‌ హామీలను నెరవేర్చింది. అయితే పదేళ్ల క్రితం ఇచ్చిన హామీలను నెరవేర్చారా అని కేసీఆర్‌ను ప్రశ్నించారు.రాష్ట్రంలో ఎన్నికల తర్వాత కేసీఆర్ మరియు ఆయన కుటుంబం తమ ఫామ్‌హౌస్‌లో విశ్రాంతి తీసుకోవచ్చని, తెలంగాణలో కాంగ్రెస్ పాలన సాగిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

Also Read: Telangana: కన్నీళ్లతో కాంగ్రెస్‌కు గొట్టిముక్కుల వెంగళరావు రాజీనామా


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • D.K. Shivakumar
  • Guarantees
  • karnataka
  • kcr
  • ktr
  • revanth reddy
  • telangana
  • Vijayabheri Yatra

Related News

MIssing Case

Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

ఫిన్లాండ్‌లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి 45 రోజులుగా అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. కుమారుడి ఆచూకీ కోసం తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులు చివరకు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హయత్‌నగర్‌కు చెందిన గుజ్జ మణిదీప్ రెడ్డి, ఫిన్లాండ్‌లోని లాహ్తిలో ఉన్న LUT యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్నాడు. మే 5న తన కుటుంబ సభ్యులతో చివరిసారిగా మాట్లాడిన తర

  • Tamil Nadu Assembly passes unanimous resolution against Karnataka government's proposal.

    Cm Vijay: కర్ణాటక ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం

  • Engineering counselling in Telangana begins today.

    TS EAPCET 2026: తెలంగాణలో నేటి నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్

  • Alert for gas consumers: June 30 is the final deadline. These requirements must be met—otherwise, the connection will be disconnected.

    LPG Gas Subsidy: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. జూన్ 30 వరకే డెడ్ లైన్.. ఇవి తప్పక పాటించాల్సిందే.. లేదంటే కనెక్షన్ కట్

  • Pawan Kalyan's tour in Telangana... Janasena chief to fulfill a young child's last wish.

    Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

Latest News

  • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

  • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

  • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

  • Pregnancy: పీరియడ్స్ టైం లో శృంగారంలో పాల్గొంటే ప్రెగ్నెన్సీ వచ్చినట్లేనా..?

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd