HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cm Revanth Reddy Meets Union Railway Minister Ashwini Vaishnav

CM Revanth Meets Union Minister: కేంద్ర మంత్రిని క‌లిసిన సీఎం రేవంత్‌.. నూత‌న రైలు మార్గాల కోసం రిక్వెస్ట్‌!

తెలంగాణ‌లో వివిధ ప్రాంతాల అనుసంధాన‌త‌, పారిశ్రామిక‌, వ్య‌వ‌సాయ‌క ఎగుమ‌తులు, దిగుమ‌తుల కోసం వెనుక‌బ‌డిన ప్రాంతాల అభివృద్ధికి నూత‌న రైలు మార్గాలు మంజూరు చేయాల‌ని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.

  • By Gopichand Published Date - 05:05 PM, Thu - 17 July 25
  • daily-hunt
CM Revanth Meets Union Minister
CM Revanth Meets Union Minister

CM Revanth Meets Union Minister: తెలంగాణ‌లో సెమీకండ‌క్ట‌ర్ ప్రాజెక్టుల‌కు త్వ‌ర‌గా ఆమోదం తెల‌పాల‌ని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Meets Union Minister) విజ్ఞ‌ప్తి చేశారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల‌కు అనుకూల‌మైన వాతావ‌ర‌ణం, ప్రపంచ స్థాయి ప‌రిశోధ‌న‌, అభివృద్ధి కేంద్రాల తెలంగాణలో ఉన్నందున ప్ర‌తిపాదిత‌ అడ్వాన్స్‌డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజీ టెక్నాలజీస్ (ASIP) ప్రాజెక్ట్, మైక్రో LED డిస్ప్లే ఫ్యాబ్ ప్రాజెక్ట్ క్రిస్టల్ మ్యాట్రిక్స్ కు ఆమోదం తెల‌పాల‌ని కేంద్ర మంత్రిని సీఎం కోరారు.

కేంద్ర ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌తో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబు, రాష్ట్ర నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి రైల్ భ‌వ‌న్‌లో గురువారం భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా రంగారెడ్డి జిల్లా ముచ్చెర్లలో హైటెక్ ఎలక్ట్రానిక్స్ పార్క్ ఏర్పాటుకు EMC 2.0 పథకం కింద తెలంగాణ విన‌తిని కేంద్ర మంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. రీజిన‌ల్ రింగు రోడ్డు స‌మీపంలో నూత‌న ఎల‌క్ట్రానిక్ మాన్యుఫ్యాక్చ‌రింగ్ పార్క్‌ను ఏర్పాటు చేయాల‌ని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞ‌ప్తి చేశారు. ముఖ్యమంత్రి విజ్ఞ‌ప్తుల‌కు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.

📍 Telangana CM Revanth Reddy in Delhi
Focused on accelerating Telangana’s development!

👉 CM Revanth Reddy held a crucial meeting with Union Minister Ashwini Vaishnaw
🔹 Discussed key Railway Projects
🔹 Boosting IT Infrastructure pic.twitter.com/3v7K2kEOfU

— MOHD ABID ALI (@TPCCali) July 17, 2025

తెలంగాణ‌లో రైల్వే అనుసంధాన‌త పెంపు కోసం నూత‌న ప్రాజెక్టుల‌కు అనుమ‌తులు ఇవ్వాల‌ని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. హైద‌రాబాద్ రీజిన‌ల్ రింగు రోడ్డుకు స‌మాంత‌రంగా రీజిన‌ల్ రింగ్ రైలు ప్రాజెక్టును ప్ర‌తిపాదించామని… ఇందుకు రైల్వే బోర్డు ఇప్ప‌టికే ఫైన‌ల్ లొకేష‌న్ స‌ర్వేకు అనుమ‌తి ఇచ్చింద‌ని సీఎం తెలిపారు. రూ.8 వేల కోట్ల విలువైన ఈ రీజిన‌ల్ రింగ్ రైలు ప్రాజెక్ట్ కు త్వ‌ర‌గా అనుమ‌తులు ఇవ్వాల‌ని కేంద్ర మంత్రిని సీఎం కోరారు.

Also Read: NEFT & IMPS : బ్యాంక్ మనీ ట్రాన్స్‌ఫర్.. IMPS & NEFT ఈ రెండింటికి మధ్య తేడా ఏమిటి?

రీజిన‌ల్ రింగ్ రైలుతో గ్రామీణ‌, ప‌ట్ట‌ణ ప్రాంతాల మ‌ధ్య అనుసంధాన‌త పెర‌గ‌డంతో పాటు హైద‌రాబాద్ న‌గ‌రంలోని ప్ర‌ధాన స్టేష‌న్ల‌లో ట్రాఫిక్ ర‌ద్దీ త‌గ్గుతుంద‌ని కేంద్ర మంత్రికి సీఎం వివ‌రించారు. రీజిన‌ల్ రింగు రైలు ప్రాజెక్టుతో గ్రామీణ పేద‌రికం త‌గ్గ‌డంతో పాటు ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ఉపాధి అవ‌కాశాలు మెరుగ‌వుతాయ‌ని సీఎం తెలిపారు. హైద‌రాబాద్ డ్రైపోర్ట్ నుంచి బంద‌రు ఓడ రేవుకు అనుసంధానంగా రైలుమార్గం మంజూరు చేయాల‌ని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు.

ఔష‌ధాలు, ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాలు, ఫుడ్ ప్రాసెసింగ్ ఉత్ప‌త్తుల ఎగుమ‌తుల‌కు ఈ మార్గం దోహ‌ద‌ప‌డుతుంద‌ని సీఎం కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ రాష్ట్రంలో రైల్వే ఆప‌రేష‌న్స్ ను మ‌రింత స‌మ‌ర్థంగా నిర్వ‌హించేందుకు కాజీపేట రైల్వే డివిజ‌న్ ఏర్పాటు చేయాల‌ని కేంద్ర మంత్రి సీఎం అశ్వినీ వైష్ణ‌వ్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ప్ర‌యాణికుల‌కు భ‌ద్ర‌త‌, వేగ‌వంత‌మైన సేవ‌లు అందించేందుకు కాజీపేట రైల్వే డివిజ‌న్ ఏర్పాటు చేయాల్సి ఉంద‌న్నారు.

తెలంగాణ‌లో వివిధ ప్రాంతాల అనుసంధాన‌త‌, పారిశ్రామిక‌, వ్య‌వ‌సాయ‌క ఎగుమ‌తులు, దిగుమ‌తుల కోసం వెనుక‌బ‌డిన ప్రాంతాల అభివృద్ధికి నూత‌న రైలు మార్గాలు మంజూరు చేయాల‌ని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ఇందులో భాగంగా వికారాబాద్‌-కృష్ణా (122 కి.మీ.- అంచ‌నా వ్య‌యం రూ.2,677 కోట్లు, క‌ల్వ‌కుర్తి-మాచ‌ర్ల (100 కి.మీ.-అంచ‌నా వ్య‌యం రూ.2 వేల కోట్లు, డోర్న‌క‌ల్‌-గ‌ద్వాల (296 కి.మీ.-అంచ‌నా వ్య‌యం రూ.6,512 కోట్లు), డోర్న‌క‌ల్‌-మిర్యాల‌గూడ (97 కి.మీ.-అంచ‌నా వ్య‌యం 2,184 కోట్లు) మార్గాల‌ను వంద శాతం రైల్వే శాఖ వ్య‌యంతో మంజూరు చేయాల‌ని కేంద్ర మంత్రిని సీఎం కోరారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Meets Union Minister
  • CM Revanth Reddy
  • delhi tour
  • Railway lines
  • Union Minister Ashwini Vaishnav

Related News

Group-1 Candidates

Group-1 Candidates: గ్రూప్-1 అభ్యర్థులకు శుభవార్త.. ఈనెల 27న నియామక పత్రాలు అంద‌జేత‌!

ఈ సందర్భంగా సీఎస్ రామకృష్ణారావు మాట్లాడుతూ.. నియామక పత్రాలు పొందే అభ్యర్థులు రాబోయే 30 సంవత్సరాల పాటు ప్రభుత్వ సేవలో ఉంటారని, కాబట్టి వారికి ఉత్సాహపూరితమైన వాతావరణంలో నియామక పత్రాలు అందజేయాలని సూచించారు.

  • Dussehra Holidays

    Dussehra Holidays: అంగన్‌వాడీ కేంద్రాలకు తొలిసారి దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం!

  • Bathukamma Kunta

    Bathukamma Kunta: ఎల్లుండి బతుక‌మ్మ కుంటను ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్ రెడ్డి!

  • CM Revanth Reddy

    CM Revanth Reddy: మేడారం ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: సీఎం రేవంత్ రెడ్డి

  • CM Revanth Medaram Visit

    CM Revanth Medaram Visit: ఈనెల 23న మేడారంలో ప‌ర్య‌టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!

Latest News

  • Paytm : మీరు పేటిఎం వాడుతున్నారా..? అయితే బంగారు కాయిన్‌ గెల్చుకునే ఛాన్స్ !!

  • BSNL : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్

  • Vote For Note Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ

  • Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

  • KCR : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ మీటింగ్

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd