HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cm Revanth Meets Former Speaker Pocharam Srinivas Reddy

Pocharam Srinivas Reddy: కాంగ్రెస్‌లో చేరిన మాజీ స్పీకర్‌ పోచారం.. కండువా కప్పి ఆహ్వానించిన సీఎం రేవంత్‌!

  • Author : Gopi Date : 21-06-2024 - 12:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pocharam Srinivas Reddy
Pocharam Srinivas Reddy

Pocharam Srinivas Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని (Pocharam Srinivas Reddy) కలిసి కాంగ్రెస్‌లో చేరాల్సిందిగా ఆహ్వానించారు. దీంతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలోకి ఆహ్వానించేందుకు కాంగ్రెస్ ‘ఆకర్ష్’ ఆపరేషన్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. అయితే సీఎం రేవంత్‌ రెడ్డి కోరిక మేరకు మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారికి కండువా కప్పి పార్టీలోకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు.

Also Read: Pocharam Srinivas Reddy : కాంగ్రెస్ లోకి పోచారం..?

పోచారం చేరిక తర్వాత సీఎం రేవంత్‌ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసాం. పెద్దలుగా అండగా నిలబడాలని వారిని కోరాం. తెలంగాణ రైతుల సంక్షేమం కోసం పోచారం కాంగ్రెస్ లో చేరారు. రైతుల సంక్షేమంపై వారి సలహాలు సూచనలు తీసుకుని ముందుకెళ్తాం. రైతు రుణమాఫీ విధివిధానాలపై ఇవాళ మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నాం. భవిష్యత్ లో పోచారం శ్రీనివాస్ రెడ్డికి సముచిత గౌరవం ఇస్తాం అని ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ తెలిపారు. అంతేకాకుండా నిజామాబాద్ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు ఆయన సహకారం తీసుకుంటామన్నారు. ఇది రైతు రాజ్యం.. రైతు సంక్షేమ రాజ్యం.. రైతు సంక్షేమం కోసం అవసరమైన అందరినీ కలుపుకుని పోతామని సీఎం రేవంత్‌ చెప్పారు.

We’re now on WhatsApp. Click to Join.

త్వరలో పలువురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరబోతున్నారనే వదంతుల నేపథ్యంలో పోచారం శ్రీనివాస్‌రెడ్డితో ముఖ్యమంత్రి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. పోచారంతో పాటు మరికొందరు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమితో పాటు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోవడంతో బీఆర్ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డిపై పోచారం శ్రీనివాస్ రెడ్డి 23,464 ఓట్ల తేడాతో గెలుపొందారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి గతంలో 2019 జనవరి నుంచి 2023 వరకు తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా పనిచేశారు. బీఆర్‌ఎస్ హయాంలో 2014 నుంచి 2019 వరకు వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 1984లో కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరి టీడీపీ ప్రభుత్వంలో రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. 27 ఏళ్లు టీడీపీలో ఉన్న ఆయన పార్టీని వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు. అయితే ఈ చేరికలపై అటు బీఆర్ఎస్‌ బాస్‌ కేసీఆర్‌ కానీ.. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ లేదా ఎమ్మెల్యే హరీష్‌ రావు స్పందించకపోవటం గమనార్హం. ఇప్పటికే పార్టీతో ఉండేవాళ్లు ఉంటారు.. పోయే వాళ్లు పోతారని మాజీ సీఎం కేసీఆర్‌ చెప్పిన విషయం తెలిసిందే.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • cm revanth
  • congress
  • operation akarsh
  • Pocharam Srinivas Reddy
  • telangana
  • telangana news
  • ts politics

Related News

Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలకు కొత్త దిశానిర్దేశం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం అన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హెచ్‌ఐసిసిలో “గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్”ను ప్రారంభిస్తూ, “రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలను కూడ

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

  • Draft Of 'core Urban Region

    GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

Latest News

  • Medicines Prices: సామాన్యుడికి భారీ ఉపశమనం.. 39 మందుల ధరలను నిర్ణయించిన ప్రభుత్వం

  • Kadapa: బ్రహ్మణి స్టీల్స్ భూములు పై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం

  • H-1B: హెచ్-1 బీ, గ్రీన్ కార్డ్ అభ్యర్థులకు అలర్ట్.. ఇకపై కొత్త రూల్స్..!

  • CM Chandrababu: బీసీలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..

  • Ram Temple: రామమందిర ట్రస్ట్.. కార్పొరేట్ తరహా ప్రక్షాళనపై దృష్టి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd