HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cm Revanth Focuses On Empowering One Crore Women

Minister Seethakka : 22 ఇందిరా మహిళా శక్తి భవనాల లిస్టు రిలీజ్‌

Minister Seethakka : నవంబర్ 19న వరంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం 22 ఇందిరా మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. తాజాగా ఈ భవనాల జాబితాను మంత్రి సీతక్క విడుదల చేశారు. భవనాల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు.

  • Author : Kavya Krishna Date : 17-11-2024 - 4:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Arogya Lakshmi Scheme
Arogya Lakshmi Scheme

Minister Seethakka : కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సంవత్సరం పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాలు జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంలో, నవంబర్ 19న వరంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం 22 ఇందిరా మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. తాజాగా ఈ భవనాల జాబితాను మంత్రి సీతక్క విడుదల చేశారు. భవనాల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. ఒక్కో భవన నిర్మాణానికి రూ.5 కోట్ల వ్యయంతో మొత్తం రూ.110 కోట్లు ఖర్చు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయడానికి జిల్లాకేంద్రాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ భవనాలను పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తారు. ఆయా జిల్లాల్లో మహిళా స్వయం సహాయక సంఘాలు ఈ భవనాల నుంచి తమ కార్యకలాపాలను నిర్వహిస్తాయి. ఇందిరా మహిళా శక్తి భవనాల్లో మహిళలకు శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి, వారు ఆసక్తి ఉన్న రంగాల్లో శిక్షణతో పాటు, ఉత్పత్తుల మార్కెటింగ్, కామన్ వర్క్‌షెడ్‌, ఉత్పత్తుల ప్రదర్శనలు, జీవనోపాధి కల్పన వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు.

Bandi Sanjay: తెలంగాణలో ఆర్కే బ్రదర్స్ పాలన.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్య‌లు

ఇదిలా ఉంటే.. తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య లక్ష్యమని రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, సీతక్క అన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా హనుమకొండలో విజయోత్సవ సభ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సభకు సోమవారం సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారని, సభావేదికకు ఇందిరా మహిళా శక్తి ప్రాంగణం అనే పేరు పెట్టినట్లు పేర్కొన్నారు. హనుమకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న సభ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలలో ఆరింటిలో ఐదు గ్యారంటీలను అమలు చేశామని కొండా సురేఖ వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ తర్వాత వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారని, అక్కడ విమానాశ్రయం ఏర్పాటుకు కృషి జరుగుతోందని తెలిపారు.

కులగణన చేపట్టడం శతాబ్దాల తర్వాత జరుగుతున్న అపూర్వ ఘట్టమని, ఇది తెలంగాణ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. రైతుల సంక్షేమం విషయంలో తమ ప్రభుత్వం వెనుకడుగు వేయదని స్పష్టం చేశారు. రాష్ట్రం దివాళా తీయించిన పరిస్థితుల్లో కూడా సీఎం రేవంత్ ధైర్యంగా ముందుకు సాగుతున్నారని కొనియాడారు. మహిళల కోసం ప్రగతి నివేదన సభగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సీతక్క తెలిపారు. 22 జిల్లాల్లో ఇందిరా మహిళా భవనాల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. గత భారాస ప్రభుత్వం పదేళ్లలో 21 లక్షల మందికే రుణమాఫీ చేసినప్పటికీ, తమ ప్రభుత్వం ఒకే ఏడాదిలో 23 లక్షల మందికి రుణమాఫీ చేసినట్లు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాసంక్షేమంపై దృష్టి పెట్టినా, భారాస, భాజపా పార్టీలు రాజకీయ స్వార్థమే ప్రాధాన్యం ఇస్తున్నాయని ఆక్షేపించారు.

Group-3 Exam: గ్రూప్-3 ఎగ్జామ్‌.. చంటి బిడ్డ‌తో ఒక‌రు, చేతులు లేక‌పోయినా మ‌రొక‌రు!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • caste census
  • Congress Government
  • Indira Mahila Bhavans
  • Konda Surekha
  • revanth reddy
  • Seethakka
  • telangana politics
  • warangal public meeting
  • welfare schemes
  • women empowerment

Related News

Minister Konda Surekha and Seethakka meets KCR

మహిళా మంత్రులకు కేసీఆర్‌ ఆత్మీయ పలకరింపు..పసుపు, కుంకుమ, చీర, తాంబూలాలతో సత్కారం

మంత్రులు నివాసానికి చేరుకోగానే కేసీఆర్ వారిని చిరునవ్వుతో పలకరిస్తూ “బాగున్నారా అమ్మా” అంటూ ఆప్యాయంగా మాట్లాడారు. మంత్రుల రాక సందర్భంగా కేసీఆర్ సంప్రదాయ పద్ధతిలో వారికి గౌరవం ఇచ్చారు. పసుపు, కుంకుమ, చీరలు, తాంబూలాలతో వారిని మర్యాదపూర్వకంగా సత్కరించారు.

  • Erravalli Farmhouse Seethakka, Konda Surekha,

    కేసీఆర్‌ను కలవనున్న మంత్రి సీతక్క,కొండా సురేఖ.. ఎందుకంటే?

Latest News

  • ఈ నెల 28 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

  • వెనక్కు తగ్గిన ఏపీఎస్ ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు, సమ్మె విరమణ తో ఊపిరి పీల్చుకున్న ప్రజలు

  • కూలే క్యాన్సర్ అంటే ఏమిటి? ప్ర‌ధాన ల‌క్ష‌ణాలివే!

  • ఏపీలో ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా టికెట్ రేట్ల పెంపు

  • బంగ్లాదేశ్ క్రికెటర్లకు భారీ దెబ్బ.. భారతీయ కంపెనీ కీలక నిర్ణయం!

Trending News

    • సంక్రాంతి పండుగ‌ను 4 రోజులు ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా?!

    • బడ్జెట్ 2026.. సామాన్యులకు కలిగే ప్ర‌యోజ‌నాలీవే!

    • బ్రిటన్‌లో ‘X’ నిలుపుదల ముప్పు.. వివాదానికి కారణం ఏంటి?

    • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

    • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd