HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cm Revanth Did Not Help Them Harish Raos Emotional Comments

Harish Rao: సీఎం రేవంత్‌ వారికి సాయం చేయ‌లేదు.. హ‌రీష్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదని హరీష్ రావు అన్నారు. పండుగ పూట చెత్త ఎత్తడానికి, ట్రాక్టర్లలో డీజిల్ పోయడానికి కూడా నిధులు లేవని విమర్శించారు.

  • Author : Gopi Date : 21-09-2025 - 3:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Harish Rao
Harish Rao

Harish Rao: సికింద్రాబాద్, రాంగోపాల్ పేటలోని కస్తూర్బానగర్‌లో తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao).. తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. “వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది” అని హరీష్ రావు ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి కూడా నాలాలు శుభ్రం చేయించకపోవడం వల్లే వరదలు వచ్చాయని, గతంలో కేసీఆర్ నాయకత్వంలో నగరంలో నాలాలు శుభ్రం చేయించేవారని గుర్తు చేశారు.

వరదల కారణంగా ఇళ్లలోని నిత్యావసర వస్తువులు కొట్టుకుపోయాయని, ప్రజలు తినడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వరద బాధితులకు ఒక్క రూపాయి కూడా సహాయం చేయలేదని విమర్శించారు. హైదరాబాద్‌లో వరదల్లో కొట్టుకుపోయి 7, 8 మంది చనిపోవడానికి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణమని హరీష్ రావు ఆరోపించారు.

తలసాని శ్రీనివాస్ యాదవ్ కృషి

ప్రభుత్వం ప్రజలకు సహాయం చేయడంలో విఫలమైనా తలసాని శ్రీనివాస్ యాదవ్ తన వంతుగా 1500 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించి ఆదుకుంటున్నారని హరీష్ రావు ప్రశంసించారు. “రోడ్లు గుంతలమయమయ్యాయి. గుంతలు పూడ్చే తెలివి లేదు కానీ, ‘ఫోర్త్ సిటీ’ గురించి మాట్లాడుతున్నారు” అని రేవంత్ రెడ్డిని హరీష్ రావు ఎద్దేవా చేశారు. పోర్ట్ సిటీ కాంట్రాక్టర్ల కోసం ప్రభుత్వం ఆరాటపడుతోందని ఆరోపించారు.

Also Read: PM Modi: ఈరోజు ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడ‌నున్న ప్ర‌ధాని మోదీ..!

పార్టీ ఫిరాయింపులపై వ్యాఖ్యలు

పార్టీ మారిన ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతూ.. “రేవంత్ రెడ్డి పూర్తిగా బజారులో నిలబడి ఉన్నారు. కండువా కప్పినంత మాత్రాన పార్టీ మారినట్టు కాదంట. ఇంతకంటే బరితెగింపు మాటలు ఉంటాయా?” అని ప్రశ్నించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు తామే మారినట్లు ట్విట్టర్‌లో పెట్టుకున్నారని, పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ 10 మందిని పార్టీలో చేర్చుకున్నట్లు ప్రకటించారని గుర్తు చేశారు. ఏఐసీసీ కార్యాలయంలో రాహుల్ గాంధీకి కనిపించి, కాంగ్రెస్‌లో చేరి కండువా కప్పుకున్నా పార్టీ మారినట్టు కాదని సిగ్గు లేకుండా చెబుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, సరైన సమయంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

బతుకమ్మ పండుగ గురించి

రాష్ట్ర ప్రజలందరికీ, అక్కాచెల్లెమ్మలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ పండుగ సందర్భంగా వీధి దీపాలైనా వెలిగేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. కేసీఆర్ హయాంలో బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకునేందుకు చెరువులు బాగు చేసి, బతుకమ్మ మెట్లు, ఘాట్లు కట్టించారని గుర్తు చేశారు. ఈరోజు బతుకమ్మకు రేవంత్ రెడ్డి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు.

స్థానిక సంస్థల ఎన్నికలు, నిధులు

స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదని హరీష్ రావు అన్నారు. పండుగ పూట చెత్త ఎత్తడానికి, ట్రాక్టర్లలో డీజిల్ పోయడానికి కూడా నిధులు లేవని విమర్శించారు. “మాటలకు ఎక్కువ, చేతులకు తక్కువ ఇది రేవంత్ పాలన” అని విమర్శించారు. ఈ పండుగ పూటైనా గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసి బతుకమ్మ పండుగను జరుపుకునేలా చూడాలని డిమాండ్ చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • CM Revanth Reddy
  • congress
  • harish rao
  • hyderabad
  • telugu news

Related News

Janasena Pawan Kalyan

JANASENA : ప‌వ‌న్ పై జ‌డ్చ‌ర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఫైర్‌.. ప్యాకేజీ ఇస్తే..?

జ‌న‌సేన అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై జ‌డ్య‌ర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఫైర్ అయ్యారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్కువ ప్యాకేజీ ఇస్తే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ఆయనకే మద్దతు ఇస్తారన్నారు. జైలులో చంద్రబాబు నాయుడును కలవడమే పవన్‌కు ఉన్న ఏకైక ప్లస్ పాయింట్ అని అనిరుధ్ రెడ్డి అన్నారు.పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని తాను ఆశిస్తున్నట్లు అనిరుధ్ రెడ్డి

  • DK SHIVA KUMAR

    CM DK SHIVAKUMAR : కర్ణాటక ముఖ్యమంత్రిగా నేడు డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం

  • During Telangana Formation Day celebrations, CM Revanth Reddy delivers good news to the unemployed.

    Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో.. నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్

  • Death

    Minior Girl : హైదరాబాద్‌లో మైనర్ బాలిక ఆత్మహత్య

  • Balka Suman

    BRS : బాల్కా సుమన్‌కు ఊరట.. సింగరేణి కేసులో కీలక అభియోగాలను కొట్టివేసిన కోర్టు

Latest News

  • Importance of Marriage: పెళ్లికి ఆ మూడు రుణాలతో సంబంధం తెలుసా?

  • PM Modi: జవహర్‌లాల్ నెహ్రూ రికార్డు బ్రేక్ చేయబోతున్న ప్రధాని మోడీ.

  • DK Shivakumar: కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప‍్రమాణం

  • CM Chandrababu: తెలంగాణలో పవన్ సభపై స్పందించిన చంద్రబాబు

  • Khushboo: సీఎం విజయ్‌ని కలిసి కూతురి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చిన ఖుష్బూ దంపతులు

Trending News

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd