Harish Rao: తెలంగాణ అప్పులు, ఆదాయం పై చిదంబరం దుష్ప్రచారం: మంత్రి హరీశ్ రావు
చిదంబరం వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు.
- By Balu J Published Date - 04:23 PM, Thu - 16 November 23
Harish Rao: చిదంబరం వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నేత చిదంబరం తీరు చూస్తుంటే హంతకుడే సంతాపం తెలిపినట్టుగా ఉందని, తెలంగాణ ప్రకటన చేసిన చిదంబరం.. దాన్ని వెనక్కి తీసుకున్న ఫలితంగా కదా ఉద్యమంలో యువకులు బలిదానం చేసిందని ఆయన మండిపడ్డారు.
‘‘పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం గురించి చిదంబరం మాట్లాడటం దొంగే దొంగ అన్నట్టుగా ఉంది. పొట్టి శ్రీరాములు ఆంధ్రా రాష్ట్రం గురించి ఉద్యమించినపుడు కేంద్రంలో అధికారం లో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా ? అప్పటి నెహ్రు గారి ప్రభుత్వం తాత్సారం చేయడం వల్లే కదా పొట్టి శ్రీరాములు చనిపోయింది? చరిత్ర తెలియనిది కేసీఆర్ గారికి కాదు ..చిదంబరమే చరిత్ర తెలియకుండా వక్ర భాష్యాలు చెబుతున్నారు. అప్పట్లో మద్రాసు రాష్ట్రం ఉండేదని, తెలంగాణ రాష్ట్రం లేకుండే అని చిదంబరం మాట్లాడటం హాస్యాస్పదం. హైదరాబాద్ అనేది ఓ రాష్ట్రంగా ఉండేదనే విషయాన్ని ఆయన మరిచిపోతున్నారు’’ అంటూ హరీశ్ రావు పేర్కొన్నారు.
‘‘తెలంగాణ అప్పులు, ఆదాయం పై చిదంబరం దుష్ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ ఆర్థిక క్రమశిక్షణ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల కన్నా ఎంతో బాగుందని గ్రహిస్తే మంచిది. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆర్బీఐ నివేదికలు ఏం చెబుతున్నాయో చిదంబరం తెలుసుకుంటే మంచిది. చిదంబరం ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే నమ్మేందుకు తెలంగాణ ప్రజలు అమాయకులు కారు. కాంగ్రెస్ కు ఒక్క ఛాన్స్ కాదు పదకొండు సార్లు అవకాశమిచ్చారు. చిదంబరం కు దమ్ముంటే తన సొంత రాష్ట్రం తమిళనాడులో కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చే ప్రయత్నం చేయాలి. ఎవరు ఎన్ని ట్రిక్కులు చేసినా, ఎంతమంది వచ్చి దుష్ప్రచారం చేసినా.. యావత్ తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారి వైపే ఉన్నరు. రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని దీవించబోతున్నరు’’ అని హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు.
Related News
Egg Prices: హైదరాబాద్లో ఆకాశాన్ని తాకుతున్న కోడిగుడ్ల ధరలు..!
కోడిగుడ్డును ప్రతిఒక్కరూ చాలా ఇష్టంగా తింటారు. కోడిగుడ్డుతో నిమిషాల్లో అయిపోయే కర్రీ, ఆమ్లేట్ను తినడానికి జనం ఇంట్రెస్ట్ చూపుతుంటారు.