Rainfall in Hyderabad: చార్మినార్లో అత్యధికంగా 79 మిమీ వర్షపాతం నమోదు
సోమవారం కురిసిన వర్షాలకు హైదరాబాద్ అతలాకుతలం అయింది. తేలికపాటి వర్షానికే నగరం స్థంబించిపోతుంది. అలాంటిది గత రాత్రి కుండపోత వర్షం కారణంగా రహదారులన్నీ జలమయమయ్యాయి.
- By Praveen Aluthuru Published Date - 11:59 AM, Tue - 25 July 23
Rainfall in Hyderabad: సోమవారం కురిసిన వర్షాలకు హైదరాబాద్ అతలాకుతలం అయింది. తేలికపాటి వర్షానికే నగరం స్థంబించిపోతుంది. అలాంటిది గత రాత్రి కుండపోత వర్షం కారణంగా రహదారులన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్ సమస్యలు తెలెత్తాయి. లోతట్టు ప్రాంతాలు ప్రమాద అంచుకు చేరాయి. కొన్ని ప్రాంతాల్లో నీటిమట్టం పెరగడంతో నగరవాసలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎదురుగా ఉన్న రోడ్డుతోపాటు నగరంలోని పలు ప్రాంతాలు జలమయమైన సందర్భాలు ఉన్నాయి.
The tech parts of the #Hyderabad city is beating Bangalore not just in IT but slow movement of vehicular traffic. Just an hour long rain caused hours long traffic congestions… pic.twitter.com/gAh7sXZP7b
— B Kartheek (@KartheekTnie) July 24, 2023
తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (టిఎస్డిపిఎస్) గణాంకాల ప్రకారం హైదరాబాద్లో గత 24 గంటల్లో చార్మినార్లో అత్యధికంగా 79 మిమీ వర్షపాతం నమోదైంది.
చార్మినార్ 79 మి.మీ వర్షపాతం నమోదైంది.
అంబర్పేట్ 71.5 వర్షపాతం నమోదైంది.
గోల్కొండ 71 వర్షపాతం నమోదైంది.
బహదూర్పురా 69.3 వర్షపాతం నమోదైంది.
సైదాబాద్ 69.3 వర్షపాతం నమోదైంది.
బండ్లగూడ 67 వర్షపాతం నమోదైంది.
ఆసిఫ్నగర్ 65.3 వర్షపాతం నమోదైంది.
సికింద్రాబాద్ 65 మి.మీ
షేక్పేట 64.8 మి.మీ
నాంపల్లి 64.3 మి.మీ
ఖైరతాబాద్ 63.8 మి.మీ
హిమాయత్నగర్ 62.3మి.మీ
మారేడ్పల్లి 55.8 మి.మీ
ముషీరాబాద్ 54.3 మి.మీ
అమీర్పేట 52.5 మి.మీ
ఇదిలా ఉండగా రానున్న రెండు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు ఐఎండీ పేర్కొంది. దీంతో తెలంగాణ రాష్ట్రానికి రెడ్ అలర్ట్ ప్రకటించింది.
Also Read: BRS Politics: కోమటిరెడ్డికి బిగ్ షాక్.. కారెక్కిన యాదాద్రి ముఖ్యనేత
Related News
Hyderabad: హైదరాబాద్ లో పోలీసుల తనిఖీలు.. భారీగా గంజాయి, డబ్బులు స్వాధీనం
Hyderabad: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో పాటు గంజాయి అక్రమ రవాణా ను నియంత్రించేందుకు మల్టీ జోన్ 1 పరిధిలో 16 జిల్లాల్లో పోలీసులు, ప్రధాన రోడ్డు మార్గాల్లో వాహన తనిఖీలతో పాటు రైళ్ళల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. అక్రమ గంజాయి కట్టడి చేయాలనే లక్ష్యంగా మల్టీ జోన్ 1 ఐ. జీ ఎ. వి. రంగనాథ్ ఆదేశాల మేరకు మల్టీ జోన్ 1 పరిధిలోని 16జిల్లాల్లో పోలీస్ అధికారులు, ఆకస్మిక వాహన తనిఖీలు చేపట్టా