HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Central Minister Kishan Reddy Comments On Congress

BJP : రాష్ట్రాన్ని లూటీ చేసే పనిలో కాంగ్రెస్‌ : కిషన్ రెడ్డి

BJP : ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో రైతులకు అన్యాయం చేస్తోంది. ప్రజలకు న్యాయం జరిగేది బీజేపీతోనే. నూటికి తొంబై శాతం మంది ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు.

  • By Latha Suma Published Date - 05:56 PM, Thu - 7 November 24
  • daily-hunt
Central Minister Kishan Reddy comments on congress
Central Minister Kishan Reddy comments on congress

Central Minister Kishan Reddy : సెంట్రల్ మినిస్టర్, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ఈరోజు పార్టీ స్టేట్ ఆఫీస్ సంస్థాగత ఎన్నికల ప్రక్రియపై వర్క్ షాప్ నిర్వహిం చారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ..11 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ఇదే మాదిరిగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు దివాలు తీశాయని అన్నారు. బీజేపీ సంస్థాగత ఎన్నికల వ్యవస్థ ఊపిరి అని చెప్పారు. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలన్నారు. సంస్థాగతంగా బీజేపీ బలోపేతం చేసుకోవాలన్నారు.

కాంగ్రెస్ అప్పుల మీద అప్పులు తెస్తుంది. రాష్ట్రాన్ని లూటీ చేసే పనిలో ప్రభుత్వం ఉంది. దీనిపై మహిళ, యువత, రైతుల సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలి అని తెలిపారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో రైతులకు అన్యాయం చేస్తోంది. ప్రజలకు న్యాయం జరిగేది బీజేపీతోనే. నూటికి తొంబై శాతం మంది ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే గత పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో 7 లక్షల కోట్ల అప్పులు చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తోంది, అంతకన్నా రెట్టింపు అప్పులు చేసేందుకు ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ గ్యారెంటీ ల గారడి ప్రజలు అర్ధం చేసుకు న్నారు’ అని కిషన్ రెడ్డి అన్నారు.

కాంగ్రెస్‌ ఏడాది పాలన పూర్తి కావొస్తున్నప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదని విమర్శించారు. ఓ వైపు సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకుంటూ మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలపై పోరాడాలన్నారు. దేశంలో జమ్ముకశ్మీర్ నుంచి తమిళనాడు వరకు దాదాపు అన్ని పార్టీల్లోనూ కుటుంబ పాలన సాగుతోందన్నారు. కానీ బీజేపీలో మాత్రం కార్యకర్తల నుంచి ఉన్నతస్థాయి వరకు పదవులు దక్కుతాయన్నారు. కేసీఆర్ హయాంలో రూ.7 లక్షల కోట్లు అప్పులు అయితే… కాంగ్రెస్ పాలనలోనూ అదే కొనసాగుతోందని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని ప్రజలు లోక్ సభ ఎన్నికల్లో తీర్పును ఇచ్చారని వెల్లడించారు.

Read Also: KTR: జైలుకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను.. కేటీఆర్ వ్యాఖ్య‌లు దేనికి సంకేతం?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • central minister kishan reddy
  • congress
  • Election Process Meeting
  • telangana

Related News

Teachers

Telangana : ప్రభుత్వ టీచర్లకు వాత పెట్టేందుకు సిద్దమైన విద్యాశాఖ

Telangana : తెలంగాణ రాష్ట్రంలో సెలవు పెట్టకుండా విధులకు గైర్హాజరవుతున్న ఉపాధ్యాయులపై రాష్ట్ర విద్యాశాఖ కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. ఉపాధ్యాయుల హాజరును మెరుగుపరచడం, విద్యార్థులకు నాణ్యమైన బోధన అందేలా చూడటమే ఈ చర్యల ముఖ్య ఉద్దేశం

  • Telangana Rising Global Summit

    Telangana Rising Global Summit: తెలంగాణ గ్లోబ‌ల్ స‌మ్మిట్‌కు పీఎం మోదీ, రాహుల్ గాంధీ?!

  • Praja Palana Utsavalu

    Telangana Praja Palana Utsavalu : నేటి నుండి తెలంగాణ వ్యాప్తంగా ‘ప్రజా పాలన ఉత్సవాలు’

  • Grama Panchayat Elections C

    Grama Panchayat Elections : గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ త్రిముఖ వ్యూహం

  • Nuclear Power Plant Telanga

    Nuclear Power Plant : అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు తెలంగాణ సర్కార్ సన్నాహాలు!

Latest News

  • IBOMMA Case : iBOMMA రవికి 14 రోజుల రిమాండ్

  • AP CM Chandrababu Naidu : చంద్రబాబుపై అవినీతి కేసులు కొట్టేసిన హైకోర్టు..!

  • Company Lockout : ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ – కేంద్రం

  • Share Market : 100 కొంటే 400 షేర్లు ఫ్రీ ..లక్షకు రూ.3 లక్షలు గోల్డెన్ ఛాన్స్!

  • Chennai Metro Train Stuck : ఆగిన మెట్రో.. టన్నెల్ నుంచి ప్రయాణికులు బయటకు

Trending News

    • Hardik Pandya: టీమిండియాకు గుడ్ న్యూస్‌.. ఫిట్‌గా స్టార్ ప్లేయ‌ర్‌!

    • Raj Nidimoru : సమంత రెండో భర్త రాజ్ నిడిమోరు బ్యాక్‌గ్రౌండ్ తెలుసా!

    • Rent Agreement Rules 2025 : అద్దెకు ఉండేవారిపై కొత్త రూల్స్.. రూ.1 లక్ష ఫైన్..7 ఏళ్ల జైలు?

    • Elon Musk: ఎలాన్ మ‌స్క్ కొడుకుకి భారతీయ శాస్త్రవేత్త పేరు!

    • Samantha Raj Nidimoru : వివాహ బంధంతో ఒక్కటైన సమంత – రాజ్!…ఫోటోలు వైరల్..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd