HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Telangana
  • >Center Shows Discrimination Against Telangana Cm Revanth

Padma Awards : తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తుంది – సీఎం రేవంత్

Padma Awards : ఆంధ్రప్రదేశ్‌కు ఐదు అవార్డులు ఇస్తూ, తెలంగాణకు న్యాయం చేయలేదని కేంద్రంపై నిప్పులు చెరిగారు

  • By Sudheer Published Date - 03:13 PM, Sun - 26 January 25
  • daily-hunt
Center Shows Discrimination
Center Shows Discrimination

తెలంగాణ(Telangana)కు పద్మ అవార్డుల విషయంలో కేంద్రం తీవ్ర వివక్ష చూపిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Padma Awards) ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన చుక్కా రామయ్య, అందెశ్రీ, గోరటి వెంకన్న, గద్దర్, జయధీర్ తిరుమలరావు వంటి ప్రముఖులకు అవార్డులు ఇవ్వకపోవడం అన్యాయమని అన్నారు. రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న రేవంత్.. ఈ వివక్షపై ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ఐదు అవార్డులు ఇస్తూ, తెలంగాణకు న్యాయం చేయలేదని కేంద్రంపై నిప్పులు చెరిగారు. వర్సిటీల వైస్ చాన్సెలర్ నియామకాలను యూజీసీ ఆధ్వర్యంలో చేపట్టే ప్రయత్నం రాష్ట్రాల ప్రతిపత్తిపై దాడి కిందకే వస్తుందని రేవంత్ వ్యాఖ్యానించారు. యూజీసీ కొత్త నిబంధనలు రాజ్యాంగంపై దాడి చేస్తున్నాయని, వీటిని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాల హక్కులను కాపాడటానికి ఇతర రాష్ట్రాల సీఎంలతో కలిసి కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడతామన్నారు.

Jagan- Bharati: జ‌గ‌న్‌- భార‌తి మ‌ధ్య విభేదాలు.. బీజేపీ ఎమ్మెల్యే సంచ‌ల‌నం!

తెలంగాణకు కేవలం ఇద్దరికే అవార్డులు ఇవ్వడం వెనుక రాజకీయ కుట్ర ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర సిఫారసు చేసిన పేర్లను పరిగణలోకి తీసుకోకపోవడం రాష్ట్ర ప్రజలను కించపరచినట్టే అని రేవంత్ పేర్కొన్నారు. తెలంగాణకు ప్రాముఖ్యత ఇవ్వలేదని తక్షణ చర్యలు తీసుకునేలా కేంద్రాన్ని కదిలించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. పద్మ అవార్డ్స్ విషయంలో కేంద్రం చూపిన వివక్ష పట్ల తెలంగాణ ప్రజల్లో కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి తగిన గౌరవం ఇవ్వకుండా వివక్ష చూపించడం అన్యాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పద్మ అవార్డుల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని, రాష్ట్రాల ప్రతిపత్తికి విలువ ఇవ్వాలని వారు కోరుతున్నారు.

పద్మ అవార్డ్స్ విషయానికి వస్తే ..

2025 సంవత్సరానికి గానూ మొత్తం 139 మందిని కేంద్రం పద్మ పురస్కారాలకు ఎంపిక చేసింది. వీరిలో ఏడుగురు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు. తెలంగాణ నుంచి డాక్టర్ దువ్వూరు నాగేశ్వర్ రెడ్డికి (పద్మ విభూషణ్) మరియు మందకృష్ణ మాదిగ (పద్మశ్రీ) లకు అవార్డులు లభించాయి. ఆంధ్రప్రదేశ్‌ నుంచి నందమూరి బాలకృష్ణ (పద్మభూషణ్), KL కృష్ణ, మాడుగుల నాగఫణి శర్మ, వద్దిరాజు రాఘవేంద్రాచార్య, మిర్యాల అప్పారావ్‌లకు పద్మశ్రీ అవార్డులు లభించాయి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm revanth
  • CM Revanth Reddy
  • Padma Awards 2025

Related News

Cm Revanth Reddy

CM Revanth Reddy : నిమజ్జనంలో సడన్ ఎంట్రీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: గణేష్ నిమజ్జన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్‌కు ఆకస్మికంగా వచ్చారు.

  • Cm Revanth Kamareddy

    CM Revanth Kamareddy Tour : నిజమైన నాయకత్వానికి నిదర్శనం సీఎం రేవంత్ ..ఎందుకో తెలుసా..?

  • CM Revanth Reddy offers special prayers to Khairatabad Bada Ganesh

    Hyderabad : ఖైరతాబాద్ బడా గణేశ్‌కి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు

  • New direction for Telangana education system: CM Revanth Reddy

    Telangana : తెలంగాణ విద్యావ్యవస్థకు కొత్త దిశ : సీఎం రేవంత్‌రెడ్డి

  • Telangana Govt

    Telangana Govt: తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. 5వేల మంది ఎంపిక‌!

Latest News

  • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

  • BCCI: డ్రీమ్ 11తో ముగిసిన ఒప్పందం.. బీసీసీఐ రియాక్ష‌న్ ఇదే!

  • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

  • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

  • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd