LS Elections : BRS లోక్సభ ఎన్నికలపై ఆసక్తి చూపడం లేదా?
- By Kavya Krishna Published Date - 05:12 PM, Sat - 2 March 24

దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల రంగం సిద్దమవుతోంది. అయితే.. లోక్ సభ ఎన్నికలకు కేవలం నెల రోజులు మాత్రమే సమయం ఉండటంతో.. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి. అయితే తెలంగాణలో ఈ ఎన్నికలపై బీఆర్ఎస్ అతి తక్కువ ఆసక్తి చూపుతోంది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి తొమ్మిది మంది సిట్టింగ్ ఎంపీల్లో ముగ్గురు కాంగ్రెస్, బీజేపీలోకి జంప్ అయ్యారు. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత జనవరిలో కాంగ్రెస్లోకి మారారు. తాజాగా నాగర్కర్నూల్ సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరారు. మరోవైపు మెదక్ సిట్టింగ్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. కాబట్టి ఆయన లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ప్రస్తుతానికి, తొమ్మిది మంది సిట్టింగ్ ఎంపీలలో నలుగురు రాబోయే ఎన్నికల్లో BRS తరపున ప్రాతినిధ్యం వహించడానికి అందుబాటులో లేరు. సిట్టింగ్ ఎంపీల ఈ జంపింగ్లపై ఇప్పటి వరకు కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ స్పందించలేదు. వారు ఎన్నికలకు ఒక్క అభ్యర్థిని కూడా వెల్లడించలేదు.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, కాంగ్రెస్, బీజేపీలు అన్ని లోక్సభ నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపడంతో పాటు మెజారిటీ సాధించాలని ఉవ్విళ్లూరుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు ముగిసినప్పటి నుంచి కేసీఆర్ రాజకీయంగా మౌనంగా ఉన్నారు. గత నెలలో నల్గొండలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటారని క్యాడర్లో ఆశలు చిగురించాయి. అయితే ఆ సమావేశం తర్వాత ఆయన అదృశ్యమయ్యారు. త్వరలో బీజేపీతో పొత్తు పెట్టుకునే ఆలోచనలో బీఆర్ఎస్ ఉన్నట్లు గత కొన్ని వారాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. BRS ఇంకా అభ్యర్థులను ప్రకటించకపోవడానికి కారణం ఇదేనా? రాష్ట్రంలో కాంగ్రెస్ను గద్దె దించేందుకు బీజేపీతో పొత్తు కుదుర్చుకుంటారా.. ఎన్నికలకు ముందునా.. తర్వాతా.. కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి, BRS ఎజెండాపై స్పష్టత ఇచ్చే వరకు ఈ ప్రశ్నలకు సమాధానం లేదు.
Read Also : Nagababu : నాగబాబు అనకాపల్లి పార్లమెంటుకు పోటీ చేస్తారా..?