HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Brs Chief Kcrs Press Meet

ఇక ఆగేది లేదు.. ఇకపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తూనే ఉంటాం: కేసీఆర్‌

రాష్ట్రంలో ఏం జరుగుతోంది? ఈ ప్రభుత్వం అసలు ఏం చేస్తోంది? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. భూములు అమ్మడం తప్ప ప్రజలకు ఉపయోగపడే పని ఏదీ చేయడం లేదని కాంగ్రెస్ సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Author : Latha Suma Date : 22-12-2025 - 6:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
BRS chief KCR's press meet
BRS chief KCR's press meet

. ప్రెస్ మీట్‌తో రాజకీయ సమరం

. మౌనం వీడిన బీఆర్ఎస్ అధినేత

. భూములు అమ్మడం తప్ప ఈ ప్రభుత్వం చేస్తున్నదేమీ లేదు

KCR Press Meet : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుదీర్ఘ విరామం తర్వాత నిర్వహించిన ప్రెస్ మీట్ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది. రెండేళ్లుగా ఓపిక పట్టామని, ఇక ఆగేది లేదని స్పష్టం చేసిన ఆయన, ఇకపై ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో ఏం జరుగుతోంది? ఈ ప్రభుత్వం అసలు ఏం చేస్తోంది? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. భూములు అమ్మడం తప్ప ప్రజలకు ఉపయోగపడే పని ఏదీ చేయడం లేదని కాంగ్రెస్ సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక,పై ఉపేక్షకు చోటు లేదని, రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటానికి సిద్ధమని ప్రకటించారు. తెలంగాణను రక్షించుకోవాలన్నది తమ సంకల్పమని, ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని స్పష్టం చేశారు.

తెలంగాణ ప్రాజెక్టులు ముందుకు సాగకపోవడం వెనుక కుట్రలు ఉన్నాయా? అని కేసీఆర్ సందేహం వ్యక్తం చేశారు. గోదావరి నీళ్ల దోపిడీపై ప్రభుత్వం మౌనం పాటిస్తోందని మండిపడ్డారు. పట్టిసీమ ద్వారా ఆంధ్రప్రదేశ్ 80 టీఎంసీల గోదావరి నీటిని వినియోగించుకుంటోందని, బచావత్ ట్రైబ్యునల్ ప్రకారం ఆ నీటిని ఎగువ రాష్ట్రాలకు ఇస్తామని ఏపీ చెప్పిందని గుర్తు చేశారు. కర్ణాటక, మహారాష్ట్ర చెరో 20 టీఎంసీలు వాడుకుంటున్నా, ట్రైబ్యునల్ కేటాయింపులను పట్టించుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వేళ 40 టీఎంసీలు సరిపోతాయని కేంద్రానికి లేఖ రాయడం ఏ విధమైన దూరదృష్టి? అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. నీటి వాటాల కోసం పోరాడకుండా చేతులెత్తేయడం రాష్ట్రానికి తీరని నష్టం చేస్తుందని హెచ్చరించారు.

నాడు కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు పాలమూరుకు ద్రోహం చేశాయని కేసీఆర్ ఆరోపించారు. ఎంత బలహీనమైన ప్రభుత్వం అయినా పాత ప్రాజెక్టులను కొనసాగించాల్సిందేనని స్పష్టం చేశారు. ఇక మౌనంగా ఉండబోమని, బహిరంగ సభలు నిర్వహించి నీళ్ల కోసం పోరాటం చేస్తామని ప్రకటించారు. సమైక్య రాష్ట్రంలో జరిగిన మోసాల నుంచి బయటపడాలంటే పోరాడి మన నీటి వాటా సాధించుకోవాల్సిందేనని పిలుపునిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మహబూబ్‌నగర్ జిల్లాను దత్తత తీసుకున్నా, అభివృద్ధి పేరుతో పునాదిరాళ్లకే పరిమితమయ్యారని విమర్శించారు. ఆ పునాదిరాళ్లన్నీ కలిపితే ఒక ప్రాజెక్టు పూర్తయ్యేదని వ్యాఖ్యానించారు. అప్పట్లో పొలాల్లోకి ఒక్క చుక్క నీరు కూడా రాకపోవడంతో పాలమూరు నుంచి ముంబైకి వలసలు పెరిగాయని తెలిపారు. తన నిరంతర పోరాటంతోనే జూరాల ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని, ఆ తర్వాత ఆర్డీఎస్ కాలువ పేల్చివేత వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటే తెలంగాణకు శాపంలా మారిందని, ముఖ్యంగా మహబూబ్‌నగర్ జిల్లా తీవ్రంగా నష్టపోయిందని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొదటి నుంచీ తెలంగాణకు ప్రతికూలంగా వ్యవహరిస్తోందని కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs party
  • Congress Government
  • Godavari water
  • kcr
  • KCR Comments
  • KCR press meet
  • Mahabubnagar District
  • panchayat elections
  • Pattiseema Project
  • revanth reddy
  • Telangana Irrigation
  • Telangana Projects

Related News

Harish Rao is in touch with the BJP: Revanth Reddy

Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు త్వరలోనే భారతీయ జనతా పార్టీ (BJP) లో చేరబోతున్నారంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అత్యంత సంచలన ఆరోపణలు చేశారు. హరీష్ రావు ఇప్పటికే కమలం పార్టీ అగ్రనేతలతో రహస్యంగా మంతనాలు జరుపుతున్నారని ఆయన వెల్లడించారు. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా సవాల్ విసురుతూ.. “నువ్వు బీజేపీ నేతలతో మాట్లాడలేదని పవిత్ర భద

  • CM Revanth Reddy issues a strong warning to KTR.

    Cm Revanth: కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

  • Kalvakuntla Kavitha lashes out at KTR.

    kavitha kalvakuntla: కేటీఆర్ పై కల్వకుంట్ల కవిత ఫైర్

  • Even though KTR got entangled in his own challenge, Revanth Reddy gained the upper hand over BRS!

    Cm Revanth Reddy: తన సవాలులో తానే చిక్కుకున్న KTR.. BRS పై పైచేయి సాధించిన రేవంత్ రెడ్డి!

  • Delhi High Court deals a blow to Kavitha.

    kalvakuntla kavitha: కవితకు ఢిల్లీ హైకోర్టు షాక్

Latest News

  • Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన ఫ్యాన్స్

  • Weather Update: తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల కొలిమి

  • Banakacherla Project: బనకచర్ల పిటిషన్‌పై తెలంగాణ అభ్యర్థనకు నిరాకరించిన సుప్రీంకోర్టు

  • CSK: 18 సంవత్సరాల ప్రస్థానానికి ముగింపు.. చెన్నై సూపర్ కింగ్స్ కు ఫ్లెమింగ్ గుడ్​బై..

  • New Voter Registration: కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారా..? ఈసీ కొత్త రూల్స్..

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd