HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Brs Chief Kcrs Press Meet

ఇక ఆగేది లేదు.. ఇకపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తూనే ఉంటాం: కేసీఆర్‌

రాష్ట్రంలో ఏం జరుగుతోంది? ఈ ప్రభుత్వం అసలు ఏం చేస్తోంది? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. భూములు అమ్మడం తప్ప ప్రజలకు ఉపయోగపడే పని ఏదీ చేయడం లేదని కాంగ్రెస్ సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Author : Latha Suma Date : 22-12-2025 - 6:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
BRS chief KCR's press meet
BRS chief KCR's press meet

. ప్రెస్ మీట్‌తో రాజకీయ సమరం

. మౌనం వీడిన బీఆర్ఎస్ అధినేత

. భూములు అమ్మడం తప్ప ఈ ప్రభుత్వం చేస్తున్నదేమీ లేదు

KCR Press Meet : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుదీర్ఘ విరామం తర్వాత నిర్వహించిన ప్రెస్ మీట్ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది. రెండేళ్లుగా ఓపిక పట్టామని, ఇక ఆగేది లేదని స్పష్టం చేసిన ఆయన, ఇకపై ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో ఏం జరుగుతోంది? ఈ ప్రభుత్వం అసలు ఏం చేస్తోంది? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. భూములు అమ్మడం తప్ప ప్రజలకు ఉపయోగపడే పని ఏదీ చేయడం లేదని కాంగ్రెస్ సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక,పై ఉపేక్షకు చోటు లేదని, రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటానికి సిద్ధమని ప్రకటించారు. తెలంగాణను రక్షించుకోవాలన్నది తమ సంకల్పమని, ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని స్పష్టం చేశారు.

తెలంగాణ ప్రాజెక్టులు ముందుకు సాగకపోవడం వెనుక కుట్రలు ఉన్నాయా? అని కేసీఆర్ సందేహం వ్యక్తం చేశారు. గోదావరి నీళ్ల దోపిడీపై ప్రభుత్వం మౌనం పాటిస్తోందని మండిపడ్డారు. పట్టిసీమ ద్వారా ఆంధ్రప్రదేశ్ 80 టీఎంసీల గోదావరి నీటిని వినియోగించుకుంటోందని, బచావత్ ట్రైబ్యునల్ ప్రకారం ఆ నీటిని ఎగువ రాష్ట్రాలకు ఇస్తామని ఏపీ చెప్పిందని గుర్తు చేశారు. కర్ణాటక, మహారాష్ట్ర చెరో 20 టీఎంసీలు వాడుకుంటున్నా, ట్రైబ్యునల్ కేటాయింపులను పట్టించుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వేళ 40 టీఎంసీలు సరిపోతాయని కేంద్రానికి లేఖ రాయడం ఏ విధమైన దూరదృష్టి? అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. నీటి వాటాల కోసం పోరాడకుండా చేతులెత్తేయడం రాష్ట్రానికి తీరని నష్టం చేస్తుందని హెచ్చరించారు.

నాడు కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు పాలమూరుకు ద్రోహం చేశాయని కేసీఆర్ ఆరోపించారు. ఎంత బలహీనమైన ప్రభుత్వం అయినా పాత ప్రాజెక్టులను కొనసాగించాల్సిందేనని స్పష్టం చేశారు. ఇక మౌనంగా ఉండబోమని, బహిరంగ సభలు నిర్వహించి నీళ్ల కోసం పోరాటం చేస్తామని ప్రకటించారు. సమైక్య రాష్ట్రంలో జరిగిన మోసాల నుంచి బయటపడాలంటే పోరాడి మన నీటి వాటా సాధించుకోవాల్సిందేనని పిలుపునిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మహబూబ్‌నగర్ జిల్లాను దత్తత తీసుకున్నా, అభివృద్ధి పేరుతో పునాదిరాళ్లకే పరిమితమయ్యారని విమర్శించారు. ఆ పునాదిరాళ్లన్నీ కలిపితే ఒక ప్రాజెక్టు పూర్తయ్యేదని వ్యాఖ్యానించారు. అప్పట్లో పొలాల్లోకి ఒక్క చుక్క నీరు కూడా రాకపోవడంతో పాలమూరు నుంచి ముంబైకి వలసలు పెరిగాయని తెలిపారు. తన నిరంతర పోరాటంతోనే జూరాల ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని, ఆ తర్వాత ఆర్డీఎస్ కాలువ పేల్చివేత వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటే తెలంగాణకు శాపంలా మారిందని, ముఖ్యంగా మహబూబ్‌నగర్ జిల్లా తీవ్రంగా నష్టపోయిందని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొదటి నుంచీ తెలంగాణకు ప్రతికూలంగా వ్యవహరిస్తోందని కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs party
  • Congress Government
  • Godavari water
  • kcr
  • KCR Comments
  • KCR press meet
  • Mahabubnagar District
  • panchayat elections
  • Pattiseema Project
  • revanth reddy
  • Telangana Irrigation
  • Telangana Projects

Related News

Do not stop traffic for the CM or VIP convoy

Revanth Reddy: CM, VIP కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్యపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. తన కాన్వాయ్ కోసం రోడ్లపై గంటల తరబడి ట్రాఫిక్‌ను ఆపొద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే డీజీపీకి కీలక ఆదేశాలు జారీ చేశారు. తన ఢిల్లీ టూర్ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టు మార్గంలో ఏర్పడిన భారీ ట్రాఫిక్ జామ్ గురించి సీఎం రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే స్పెషల్‌గా ట్రాఫిక్ బ్యూరోను ఏర్పాటు చేయన

    Latest News

    • Vaastu Tips: పిచ్చుకలు ఇంట్లో గూడు కట్టాయా? అయితే వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకోండి..!!

    • YSRCP: దస్తగిరి హత్య కేసులో వైసీపీ నేతకు బిగుస్తున్న ఉచ్చు…..!!

    • Ghar Soap Ad Controversy: అలీ ఘర్ సబ్బు యాడ్‌ వివాదం

    • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

    • Nara Lokesh: ‘మేడ్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్’.. మంత్రి నారా లోకేష్ ట్వీట్

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd