KTR : కేటీఆర్ కు బిగ్ షాక్..కార్యకర్తల్లో టెన్షన్
KTR : ఫార్ములా ఈ-కార్ రేస్ నిర్వహణకు సంబంధించిన నిధుల దుర్వినియోగంపై కొద్దీ నెలలుగా కొనసాగుతున్న వివాదం ఇప్పుడు కీలక దశకు చేరుకుంది
- By Sudheer Published Date - 12:41 PM, Thu - 20 November 25
ఫార్ములా ఈ-కార్ రేస్ నిర్వహణకు సంబంధించిన నిధుల దుర్వినియోగంపై కొద్దీ నెలలుగా కొనసాగుతున్న వివాదం ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. మాజీ మంత్రి కేటీఆర్పై ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అధికారిక అనుమతి ఇవ్వడం తెలంగాణ రాజకీయ వాతావరణాన్ని ఒకేసారి కుదిపేసింది. ప్రభుత్వ నిధుల వినియోగంలో భారీ అక్రమతలు జరిగాయని విచారణ సంస్థలు నివేదికలు సమర్పించగా, మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి గవర్నర్ ఆమోదం అవసరం అయ్యింది. ఈ అనుమతి రావడంతో కేసు ఇప్పుడు మరింత సీరియస్ దశలోకి ప్రవేశించింది.
Jobs : రైల్వేలో 5,810 ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగింపు
గవర్నర్ అనుమతి అనంతరం ఇప్పుడు నేరుగా చర్యలు చేపట్టేందుకు ఏసీబీకి మార్గం సుగమమైంది. కేటీఆర్ను A-1గా, అప్పటి ఉన్నతాధికారి అరవింద్ కుమార్ను A-2గా సూచిస్తూ ఫైల్స్ ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయని సమాచారం. ఫార్ములా ఈ ఈవెంట్కు భారీగా కేటాయించిన పబ్లిక్ ఫండ్స్ వినియోగంలో పారదర్శకత లేకపోవడం, టెండర్ విధానాల్లో లోపాలు, అవసరం లేని ఖర్చులు పెంచడం వంటి అంశాలు ఈ కేసు క్లైమాక్స్గా నిలిచాయి. విచారణ అధికారులకు ఇప్పుడు పూర్తి అధికారాలు లభించినందున, త్వరలోనే అధికారిక అభియోగాలు నమోదయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
మునుపటి పాలనలో ప్రముఖ నాయకుడిగా, కీలక మంత్రి పదవులు నిర్వహించిన కేటీఆర్కు ఈ కేసు రాజకీయంగా గంభీరమైన పరిణామంగా భావిస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రతిష్ట కోల్పోతున్న నేపథ్యంలో ఈ వ్యవహారం పార్టీకి మరింత నష్టం కలిగించవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం గవర్నర్కు లేఖ రాసి విచారణకు అనుమతి కోరిన సమయం నుంచే ఈ దిశలో పరిణామాలు వేగంగా జరుగుతాయని సంకేతాలు వచ్చాయి. ఇప్పుడు అధికారిక అనుమతి లభించడంతో కేసు దిశ, కేటీఆర్ రాజకీయ భవిష్యత్తుపై ఇది కీలక మలుపుగా నిలవవచ్చని భావిస్తున్నారు. రాబోయే రోజులు తెలంగాణ రాజకీయ సమీకరణాలను మళ్లీ నిర్వచించే అవకాశముంది.