CM KCR: కులమతాల పేరుతో కొందరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు: కేసీఆర్
కొందరు కావాలనే మతం, కులం పేరుతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని...వారితో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పరోక్షంగా బీజేపీని విమర్శించారు.
- By Hashtag U Published Date - 07:52 AM, Wed - 27 April 22
కొందరు కావాలనే మతం, కులం పేరుతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని…వారితో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పరోక్షంగా బీజేపీని విమర్శించారు. మతతత్వం అనేది క్యాన్సర్ జబ్బులాంటిది. ఒకసారి వస్తే…చాలా ప్రమాదకరం. మన దగ్గర దాన్ని తెచ్చుకోవద్దని సీఎం కేసీఆర్ హితవుపలికారు. హైదరాబాద్ లో మంగళవారం మూడు టిమ్స్ ఆసుపత్రుల శంకుస్థాపన నేపథ్యంలో అల్వాల్ లో జరిగిన సభలో సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని మతాలు, కులాలను ఆదరించే దేశం మనది..కొందరు మాత్రం కులం, మతం పేరుతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. అన్నికులాలు, మతాలను ఆదరించే పరిస్థితిని చెడగొడితే ఎటూకాకుండా పోతామన్నారు.
తెలంగాణలో వైద్య విధానాన్ని పటిష్టపరిచే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని, పేదరికం కారణంగా ప్రజలు వైద్యానికి దూరం కావద్దని అన్నారు. హైదరాబాద్ హెచ్ఎండీఏ పరిధిలో 1.64కోట్ల జనాభా ఉందని గాంధీ, ఉస్మానియా కాకుండా మరో నాలుగు భారీ మల్టీ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కొత్త నిర్మించబోయే మూడు టిమ్స్ ఆసుపత్రుల్లో పేదలకు ఫ్రీగా కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతుందన్నారు. 16 స్పెషాలిటీ,15 సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని సీఎం అన్నారు.
కులమతాల పేరుతో రాజకీయాలు చేసే వారిని ప్రజలు గమనించాలని తెలిపారు. మనదేశానికి చెందిన సుమారు 13కోట్ల మంది విదేశాల్లో ఉన్నారని…అక్కడి ప్రభుత్వాలు వాళ్లని వెనక్కి పంపిస్తే..వారికి ఉద్యోగాలు ఎవరు ఇవ్వాలని ప్రశ్నించారు. ఈ 7ఏండ్లలో హైదరాబాద్ లో 2.30లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని…10నుంచి 15లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయని గుర్తు చేశారు.
Related News
KCR : కేసీఆర్ కాలం చెల్లిన నాయకుడయ్యాడా?
మొన్నటి వరకు తెలంగాణ రాజకీయాలకు కేసీఆర్ కేంద్రంగా ఉండేవారు.