HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Bandi Sanjay Sensational Comments On Police Officers Association

Bandi Sanjay: ‘పోలీస్ అధికారుల సంఘం’పై ‘బండి సంజయ్’ సంచలన వ్యాఖ్యలు… ‘మోదీ’కి ‘కేసీఆర్’ లేఖపైనా ఫైర్..!

  • By hashtagu Published Date - 09:27 AM, Thu - 31 March 22
  • daily-hunt
6655
6655

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ గూండాలు బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నా… పోలీసులు కేసులు నమోదు చేయడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. డీజీపీ కనీసం తన ఫోన్ కూడా ఎత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్ల జిల్లా ఎస్పీ రబ్బర్ స్టాంపులా మారారని ఆరోపించారు. బీజేపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నా ఎందుకు కేసులు నమోదు చేయడం లేదో డీజీపీ సమాధానం చెప్పాలని… లేనిపక్షంలో దద్దమ్మ అని ఒప్పుకోవాలని సూచించారు. గురువారం ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ ఘటనలో అరెస్టై జైలుకు వెళ్లిన 23 మంది బీజేపీ కార్యకర్తలు బుధవారం విడుదలయ్యారు. ఈ సందర్భంగా కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో వారిని బండి సంజయ్ ఘనంగా సన్మానించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

బీజేపీ కార్యకర్తలపై సిరిసిల్ల జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు అక్రమంగా కేసులు పెట్టారు. జైలుకి పంపిస్తే బీజేపీ కార్యకర్తలు భయపడతారని అనుకుంటున్నారు. మళ్లీ చెబుతున్నా…. నాతో సహ ఏ బీజేపీ కార్యకర్త జైలు కి వెళ్లినా గల్లా ఎగురవేస్తాం. ఎందుకంటే మేం ప్రజల కోసం పోరాడుతున్నాం అని అన్నారు బండి సంజయ్. కానీ కేసీఆర్ కూడా త్వరలో జైలుకి వెళ్తారు. అప్పుడు జనం కేసీఆర్ ను ఛీ కొట్టడం ఖాయమని చెప్పారు. సిరిసిల్ల ఎస్పీ ఓ రబ్బర్ స్టాంప్ .., సీఎంవో ఏది చెబితే అది చేస్తాడు. పోలీస్ ఆఫీసర్ ని విమర్శిస్తే కొంతమంది పోలీస్ సంఘాల సభ్యులు మాట్లాడుతున్నారు. సిరిసిల్ల గొడవలో కొంతమంది పోలీస్ లు సీఎం ఆదేశాల ప్రకారం కేసులు కూడా నమోదు చేయడం లేదు. పదేపదే మాట్లాడుతున్న కొందరు పోలీస్ సంఘాల నాయకులు, ఈ విషయంలో ఏం సమాధానం చెబుతారు? ఇలాంటి అరాచకాలపై ఎందుకు మాట్లాడరు ఇదే విధంగా వ్యవహరిస్తే…. రిటైర్ అయ్యాక మిమ్ముల్ని కుక్కలు కూడా పట్టించుకోవు … చివరకు మీ పిల్లలే మిమ్మల్ని ప్రశ్నిస్తారని గుర్తుంచుకోండి.

ఇకనైనా అధికార పార్టీ మోచితి నీళ్లు తాగి పని చేయకండి. చట్టం, న్యాయం ప్రకారం పని చేయండని సూచించారు బండి సంజయ్. తక్షణమే డీజీపీ దీనిపై సమాధానం చెప్పాలి. లేదంటే దద్దమ్మ అని ఒప్పుకో … సీఎంఓ మాత్రమే ముఖ్యమని చెప్పండి. డీజీపీకి నేను ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎత్తట్లేదు … ట్యాపింగ్ జరుగుతోందని భయపడుతున్నారు. ఎల్లారెడ్డి పేట ఘటన లో బీజేపీ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి. బోధన్ లోనూ ఇలాగే అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారు. బైంసాలోనూ దాడులు చేసి జైలుకు పంపారు. కార్యకర్తలను పరామర్శించేందుకు వెళుతున్న బీజేపీ నాయకులను అరెస్ట్ చేస్తున్న పోలీసులు, ఒవైసికి మాత్రం బోదన్ లో ప్రశాంతంగా తిరిగేలా అనుమతిచ్చారు. ఇదెక్కడి న్యాయం ? అని ప్రశ్నించారు బండి సంజయ్. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంఐఎం తొత్తుగా మారారు. బీజేపీని బదనాం చేయడమే లక్ష్యంగా దుష్ప్రచారం చేస్తున్నారు.

ముఖ్యమంత్రే బాయిల్డ్ రైస్ ఇవ్వమని అగ్రిమెంట్ రాసి ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఆయనే బాయిల్డ్ రైస్ తీసుకోవాలని గ్రామాల నుండి తీర్మానాలు చేస్తున్నాడు. రారైస్ కొంటామని మేము చెబుతుంటే… ఇవ్వబోమని చెబుతోంది సీఎం కేసీఆరే. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎత్తివేసి, రైతులను గందరగోళంలోకి నెట్టింది కేసీఆరే. దేశంలో ఎక్కడా లేని సమస్య తెలంగాణలోనే ఎందుకు వస్తుంది? సమస్యని కావాలనే సీఎం కేసీఆర్ సృష్టిస్తున్నారు. విజ్ఞులైన ప్రజలు ఆలోచించాలని కోరుతున్నా అన్నారు బండి సంజయ్. ఉక్రెయిన్ విద్యార్థులను ఆదుకోవాలని కేంద్రం ఎప్పుడో నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ ఇప్పుడు ప్రధానికి లేఖ రాసి క్రెడిట్ కోసం పాకులాడుతున్నారు.యుద్ద సమయంలో అల్లాడిపోయిన ఉక్రెయిన్ విద్యార్థులను కనీసం ఒక్కసారైనా ఫోన్ చేసి పరామర్శించన దుర్మార్గుడు కేసీఆర్. ఉక్రెయిన్ యుద్ధం కంటే ఇక్కడ పెరిగిన విద్యుత్ చార్జీలు, ఆర్టీసీ చార్జీలను, విద్యుత్ కోతలను చూసి భయపడుతున్నారు … పెరిగిన కరెంట్ బిల్లులు చేతికందాక టీఆర్ఎస్ ప్రభుత్వంపై జనం తిరగబడటం ఖాయమని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bandi Sanjay
  • kcr
  • narendra modi
  • Police Officers Association

Related News

Kcr Metting

KCR : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ మీటింగ్

KCR : ఇక ఈ ఉపఎన్నికలో పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం లభించిన మాగంటి సునీత, తనపై నమ్మకం ఉంచినందుకు KCRకు కృతజ్ఞతలు తెలిపారు. తన భర్త మాగంటి గోపాల్‌ గౌడ్ అనుకోని మరణం తర్వాత ఖాళీ అయిన ఈ స్థానంలో, ప్రజల ఆశలను నెరవేర్చేందుకు కృషి చేస్తానని

  • Jublihils Bypolls Brs Candi

    Jubilee Hills Bypoll: బిఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్

Latest News

  • Vijay Car Collection: త‌మిళ న‌టుడు విజ‌య్ వ‌ద్ద ఉన్న కార్లు ఇవే..!

  • Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకుల సెలవుల పూర్తి జాబితా ఇదే!

  • Mental Health: మీ మెదడుకు మీరే పెద్ద శత్రువు.. మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసే 3 అలవాట్లు ఇవే!

  • IND vs PAK Final: ఆసియా కప్ ఫైనల్ పోరులో విజేత ఎవ‌రంటే?

  • BJP Mega Event: హైటెక్స్‌లో 15 వేల మందితో బీజేపీ మెగా ఈవెంట్!

Trending News

    • LPG Connections: ఎల్‌పీజీ పోర్టబిలిటీ.. ఇక గ్యాస్ కంపెనీని కూడా మార్చుకోవచ్చు!

    • Stampede : విజయ్ ని అరెస్ట్ చేస్తారా ?.. CM స్టాలిన్ రియాక్షన్ ఇదే !!

    • TVK Vijay Rally in Stampede : అరగంటలోపే పెను విషాదం

    • TVK Vijay Rally in Karur Tragedy : విజయ్ సభలో తొక్కిసలాట..33 మంది మృతి

    • Online Sales: జీఎస్టీ తగ్గింపుతో పండుగ సందడి.. కొనుగోళ్ల జోరు, ఈ-కామర్స్ రికార్డులు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd