HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ayodhya Ram Mandir Inauguration

Ram Mandir: అయోధ్యకు చంద్రబాబు.. మరి కేసీఆర్, జగన్ వెళతారా?

రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఎంతో మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. తెలుగురాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులకు, మాజీ ముఖ్యమంత్రులకు, రాజకీయ ప్రముఖులకు ఆహ్వానాలు పంపించింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్

  • Author : Praveen Aluthuru Date : 21-01-2024 - 11:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ram Mandir
Ram Mandir

Ram Mandir: ఈ నెల 22న కోట్లాది మంది హిందువుల దశాబ్దాల కల నెరవేరబోతోంది. అయోధ్య రామ మందిరంలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ఎంతో మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. తెలుగురాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులకు, మాజీ ముఖ్యమంత్రులకు, రాజకీయ ప్రముఖులకు ఆహ్వానాలు పంపించింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్.

జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12.20 గంటలకు విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగనున్న నేపథ్యంలో గురువారం గర్భగుడికి శిల్పి అరుణ్ యోగ రాజ్ చెక్కిన బాల రాముడి విగ్రహాం చేరుకుంది. ఈ బాల బాల రాముడి శిల్పం ఇప్పటికే సోషల్ మీడియాలో దర్శనం ఇవ్వడంతో దేశం యావత్ రామ నామ నినాదంతో మారుమోగుతుంది. ఈ ప్రాణ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమానికి ఇప్పటికే 8 వేల మంది ప్రముఖులకు ట్రస్ట్ ఇప్పటికే ఆహ్వానాలు పంపించింది.. అయోధ్య రాముడు కు రెండు తెలుగు రాష్ట్రాల నుండి కూడా వివిధ రూపాల్లో సేవలు అందుతున్న నేపథ్యంలో తెలుగురాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులకు, మాజీ ముఖ్యమంత్రులకు, రాజకీయ ప్రముఖులకు ఆహ్వానాలు పంపించింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్…

ఇందులో భాగంగా రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అయోధ్య వెళుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం అయోధ్యకు వెళ్లి రాత్రికి అక్కడే బస చేసి.. సోమవారం రామ్ లాలా విగ్రహ ప్రాణ ప్రతష్టకు హాజరవుతారు. ఇక కాంగ్రెస్ పార్టీ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరుకాలేము అని ప్రకటించడంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం అనుమానమే. మరి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోమన్ రెడ్డికి కూడా ఆహ్వన పత్రికను పంపించారు.. జగన్మోమన్ రెడ్డి హాజరవుతారా లేదా అన్న దానిపై ఈ రోజు క్లారిటీ రానుంది.

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు 22న అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రతినిధులు ఆహ్వానం పంపించారు అయితే కేసీఆర్ తుంటి ఎముక ఆపరేషన్ చేయించుకుని ఇప్పుడే కర్ర సాయంతో నడవడం మొదలుపెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అయోధ్య ప్రాణ ప్రతిష్టకు ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉండడంతో అయోధ్య కు కేసీఆర్ హజరుకారని, ఆయన లైఫ్ ద్వారా కార్యక్రమాన్ని తిలకించే అవకాశం ఉండొచ్చని తెలుస్తుంది.

Also Read: Ram Mandir: అయోధ్య గురించి త‌ప్పుడు స‌మాచారం ఇవ్వొద్ద‌ని మీడియా సంస్థ‌ల‌కు కేంద్రం వార్నింగ్‌..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ayodhya
  • chandrababu
  • cm jagan
  • January 22
  • kcr
  • Pawan Kalyan
  • PRAN PRATISHTA
  • ram mandir

Related News

Modi- Chandrababu

ప్ర‌ధాని రేసులో సీఎం చంద్ర‌బాబు?!

మోడీ తర్వాత బీజేపీలో అత్యంత శక్తివంతమైన నేతగా ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రధాని పదవికి మొదటి వరుసలో ఉన్నారు. పార్టీపై ఆయనకున్న పట్టు, ఎన్నికల వ్యూహకర్తగా ఆయనకున్న గుర్తింపు దీనికి ప్రధాన కారణాలు.

  • The Center is discriminating against Telangana in the matter of fertilizers: Ponnam Prabhakar

    ‘పదేళ్ల పాలనకు స్వస్తి చెప్పి ప్రజలు మీ తోలు తీశారు’ అంటూ కేసీఆర్ పై పొన్నం ఫైర్

  • Harish Rao Warning

    నీ చరిత్ర ఇది రేవంత్ – హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

  • Kcr Pm

    కేసీఆర్ కామెంట్స్ కు కాంగ్రెస్ కౌంటర్

  • Kcr Pm 3

    కేసీఆర్ ఇస్ బ్యాక్..కాకపోతే !!

Latest News

  • టీ-20 ప్రపంచ కప్ 2026.. టీమిండియా ఓపెనింగ్ జోడీ ఎవరు?

  • రోజూ బ్రష్ చేస్తున్నారా? ప్లాస్టిక్ బ్రష్‌లు, టూత్‌పేస్ట్‌ల గురించి నిపుణుల హెచ్చరిక!

  • ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీకి చెక్.. కేంద్ర ప్రభుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం!

  • విజయ్ హజారే ట్రోఫీ.. 15 ఏళ్ల తర్వాత కోహ్లీ, ఏడేళ్ల త‌ర్వాత రోహిత్‌!

  • 2025లో క్రీడా ప్రపంచాన్ని కుదిపేసిన బ్రేకప్‌లు!

Trending News

    • జాతీయ గణిత దినోత్సవం..డిసెంబరు 22న దేశవ్యాప్తంగా గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా ఈ జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటారు.

    • 2026 రిలేషన్‌షిప్ టిప్స్.. భాగస్వామి జీవితాన్ని మార్చే నిర్ణ‌యాలీవే!

    • బుర్జ్ ఖలీఫా రికార్డు గల్లంతు.. త్వరలో ప్రపంచంలోనే ఎత్తైన భవనంగా జెడ్డా టవర్!

    • క్రెడిట్ కార్డ్ బిజినెస్.. బ్యాంకులు ఎందుకు అంతగా ఆఫర్లు ఇస్తాయి? అసలు లాభం ఎవరికి?

    • 2026 బడ్జెట్.. ఫిబ్రవరి 1 ఆదివారం.. అయినా బడ్జెట్ అప్పుడేనా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd