Ram Mandir: అయోధ్యకు చంద్రబాబు.. మరి కేసీఆర్, జగన్ వెళతారా?
రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఎంతో మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. తెలుగురాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులకు, మాజీ ముఖ్యమంత్రులకు, రాజకీయ ప్రముఖులకు ఆహ్వానాలు పంపించింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్
- By Praveen Aluthuru Published Date - 11:19 AM, Sun - 21 January 24
Ram Mandir: ఈ నెల 22న కోట్లాది మంది హిందువుల దశాబ్దాల కల నెరవేరబోతోంది. అయోధ్య రామ మందిరంలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ఎంతో మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. తెలుగురాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులకు, మాజీ ముఖ్యమంత్రులకు, రాజకీయ ప్రముఖులకు ఆహ్వానాలు పంపించింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్.
జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12.20 గంటలకు విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగనున్న నేపథ్యంలో గురువారం గర్భగుడికి శిల్పి అరుణ్ యోగ రాజ్ చెక్కిన బాల రాముడి విగ్రహాం చేరుకుంది. ఈ బాల బాల రాముడి శిల్పం ఇప్పటికే సోషల్ మీడియాలో దర్శనం ఇవ్వడంతో దేశం యావత్ రామ నామ నినాదంతో మారుమోగుతుంది. ఈ ప్రాణ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమానికి ఇప్పటికే 8 వేల మంది ప్రముఖులకు ట్రస్ట్ ఇప్పటికే ఆహ్వానాలు పంపించింది.. అయోధ్య రాముడు కు రెండు తెలుగు రాష్ట్రాల నుండి కూడా వివిధ రూపాల్లో సేవలు అందుతున్న నేపథ్యంలో తెలుగురాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులకు, మాజీ ముఖ్యమంత్రులకు, రాజకీయ ప్రముఖులకు ఆహ్వానాలు పంపించింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్…
ఇందులో భాగంగా రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అయోధ్య వెళుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం అయోధ్యకు వెళ్లి రాత్రికి అక్కడే బస చేసి.. సోమవారం రామ్ లాలా విగ్రహ ప్రాణ ప్రతష్టకు హాజరవుతారు. ఇక కాంగ్రెస్ పార్టీ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరుకాలేము అని ప్రకటించడంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం అనుమానమే. మరి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోమన్ రెడ్డికి కూడా ఆహ్వన పత్రికను పంపించారు.. జగన్మోమన్ రెడ్డి హాజరవుతారా లేదా అన్న దానిపై ఈ రోజు క్లారిటీ రానుంది.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు 22న అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రతినిధులు ఆహ్వానం పంపించారు అయితే కేసీఆర్ తుంటి ఎముక ఆపరేషన్ చేయించుకుని ఇప్పుడే కర్ర సాయంతో నడవడం మొదలుపెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అయోధ్య ప్రాణ ప్రతిష్టకు ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉండడంతో అయోధ్య కు కేసీఆర్ హజరుకారని, ఆయన లైఫ్ ద్వారా కార్యక్రమాన్ని తిలకించే అవకాశం ఉండొచ్చని తెలుస్తుంది.
Also Read: Ram Mandir: అయోధ్య గురించి తప్పుడు సమాచారం ఇవ్వొద్దని మీడియా సంస్థలకు కేంద్రం వార్నింగ్..!
Related News
Nagababu : తిరిగొచ్చిన నాగబాబు.. ఆ ట్వీట్ డిలీట్ చేసేసాను అంటూ..
తన ఎక్స్ అకౌంట్ ని యాక్టీవ్ చేసి మళ్ళీ తిరిగొచ్చిన నాగబాబు. రావడంతోనే మరో వైరల్ ట్వీట్ చేసారు.