HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Are They The Ones Who Gave Telangana Or Are They Who Brought Telangana For Whom Do The Telangana People Vote

Telangana Elections : తెలంగాణ ఇచ్చిన వారికా? తెచ్చిన వారికా? ప్రజల ఓటు ఎటు?

కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా కర్ణాటక విజయం తర్వాత ఆ పథకాలను తెలంగాణ (Telangana)లో కూడా ప్రవేశపెడతామని వాగ్దానం చేయడం

  • By Hashtag U Published Date - 10:43 AM, Wed - 15 November 23
  • daily-hunt
Are They The Ones Who Gave Telangana.. Or Are They Who Brought Telangana... For Whom Do The People Vote…
Are They The Ones Who Gave Telangana.. Or Are They Who Brought Telangana... For Whom Do The People Vote…

By: డా. ప్రసాదమూర్తి

Telangana Assembly Elections 2023 : తెలంగాణలో ప్రధాన ప్రత్యర్థులు ఇద్దరే అని తేలిపోయింది. ఒకరు బీఆర్ఎస్ మరొకరు కాంగ్రెస్. అందుకే బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ గాని, బీఆర్ఎస్ యువ మంత్రి కేటీఆర్ గాని ఇటీవల ప్రచారంలో తమ దాడిని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మీదే ఎక్కుపెట్టారు. కాంగ్రెస్ తమకు పోటీ కాదని పైకి నాయకులు చెప్తున్నా, తరచుగా కాంగ్రెస్ పార్టీ మీద బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న దండయాత్ర చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ పట్ల వారు ఎంత ప్రమాదాన్ని ఊహిస్తున్నారో అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా కర్ణాటక విజయం తర్వాత ఆ పథకాలను తెలంగాణ (Telangana)లో కూడా ప్రవేశపెడతామని వాగ్దానం చేయడం, అవే పథకాలకు కొంచెం అదనపు మొత్తాన్ని జోడించి అంతకు ముందు ఉన్న పథకాలను కూడా కలిపి తాము కూడా ఇస్తున్నది అవే పథకాలని బీఆర్ఎస్ మాట్లాడడం.. ఇదంతా ఒక ఎత్తు. కాగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది అని, సోనియాగాంధీ ఆశీర్వాదంతో మాత్రమే తెలంగాణ (Telangana) రాష్ట్ర ఆవిర్భావానికి అవకాశం ఏర్పడిందని కాంగ్రెస్ నాయకులు వాదిస్తున్నారు. ఇదే అంశాన్ని వారు పదేపదే సభల్లో చెబుతున్నారు. పథకాల విషయానికొస్తే రెండు పార్టీలూ ఇస్తున్న పథకాల వాగ్దానాలు ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. కాబట్టి ప్రజల మూడ్ ని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో ముడి పెట్టాలని కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. అందుకే సోనియాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఆశీస్సులతోనే రాష్ట్రం ఏర్పడిందని తెలంగాణ సెంటిమెంట్ తో ముడిపెట్టి కాంగ్రెస్ నాయకులు ప్రచారాన్ని సాగిస్తున్నారు.

We’re Now on WhatsApp. Click to Join.

గతంలో ప్రజలు ఎవరికి ఓటు వేసినా, ఇప్పుడు తెలంగాణ (Telangana) ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకోవడానికి ప్రజలకు ఒక అవకాశం వచ్చిందని కాంగ్రెస్ నాయకులు ప్రబలంగా ప్రజల ముందు తమ వాదన పెడుతున్నారు. ఇప్పటికే రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ చేస్తున్న వాదన పట్ల ప్రజలు సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని కొంచెం కంగారుపడుతోంది. దానితో కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ నాయకులు దాడికి దిగారు. ఒకపక్క కేటీఆర్ మరో పక్క ఎంఐఎం, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి పై కాషాయం ముద్ర వేయడానికి ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలడం లేదు. దీనికి తోడు అసలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఇవ్వడం కాదు రాష్ట్రాన్ని దగా చేసిందని, మోసం చేసిందని పలు వాదనలు ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు వినిపిస్తున్నారు.

కేసిఆర్ మొన్న అశ్వరావుపేట, భద్రాచలం, పినపాక, నర్సంపేట సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీ మీద చాలా తీవ్రమైన ఆరోపణలే చేశారు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు అందులో తెలంగాణ (Telangana)ను కూడా కలిపేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణకు ద్రోహం చేశారని, ఆ తర్వాత కూడా ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం సాగిన ప్రతి ఉద్యమాన్నీ అణిచివేయడంలో కాంగ్రెస్ దుర్మార్గంగా వ్యవహరించిందని కేసీఆర్ తీవ్ర వాగ్ధాటితో దండయాత్ర చేశారు. 1969 లో సాగిన తెలంగాణ ఉద్యమంలో 400 మంది మరణానికి కారణమైంది కాంగ్రెస్ పార్టీ అని కేసిఆర్ చరిత్రలోకి వెళ్లి కాంగ్రెస్ చరిత్ర వైపు వేలెత్తి చూపించారు. ఆ తర్వాత కూడా తాము ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పరుచుకోవాలని ఎంతో ఉద్యమాలు సాధించవలసి వచ్చిందని, వాగ్దానాలు చేయడమే గాని కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్ర వాగ్దానాన్ని నెరవేర్చలేదని, దాని కోసమే తాను ఉద్యమం ప్రారంభించి ఆమరణ నిరాహారదీక్ష చేసి ఎందరో యువకుల ఆత్మహత్యలతో ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నామని కేసిఆర్ చెప్పారు.

Also Read:  BRS : ప్రచారంలో కంట్రోల్ తప్పుతున్న బిఆర్ఎస్ అభ్యర్థులు..ఓటర్లపై ఆగ్రహం

ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటు విషయంలో ఇక్కడి ప్రజల అభిమానాన్ని చూరగొనడానికి చేస్తున్న ప్రయత్నాలను తిప్పి కొట్టడానికి కేసీఆర్ తీవ్ర ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. కేటీఆర్ కూడా కాంగ్రెస్ పార్టీ మీద తరచూ అభియోగాలు మోపుతూ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రాన్ని ఎలా మోసం చేసిందో చెబుతూ వస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తమ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి కేసీఆర్ సిద్ధపడ్డారని, అయితే ప్రత్యేక రాష్ట్రం కోసం పనిచేసిన టిఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ పార్టీ మొండి చేయి చూపించిందని, తమ నాయకులకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వడానికి కాంగ్రెస్ సముఖత చూపించకపోవడం వల్లనే తమ పార్టీ కాంగ్రెస్లో విలీనం కాలేదని కేటీఆర్ ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇలా ఎటు వెళ్లిన ఎక్కడ మాట్లాడినా ఆ సభలో తమ ప్రభుత్వం గురించి తాము చేసిన పనులు గురించి చెబుతూ మరో పక్క కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైన విమర్శలతో బీఆర్ఎస్ నాయకులు విరుచుకుపడుతున్నారు.

ఇదంతా చూస్తుంటే చివరికి పథకాలు, వాగ్దానాలు, ప్రాజెక్టులు, అభివృద్ధి మొదలైనవి సెకండరీగా మారిపోయి, రాష్ట్రాన్ని ఇచ్చిన వారికా.. రాష్ట్రాన్ని తెచ్చిన వారికా.. ఎవరికి ప్రజలు ఓటు వేస్తారు అనే విషయం చుట్టూ ఇప్పుడు రెండు పార్టీల నాయకులు తిరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. చూడాలి. తెలంగాణ ప్రజలు తమకు రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని ఒకసారి కట్టబెడతారా, లేక ఎన్నో త్యాగాలతో రాష్ట్రాన్ని సాధించామని, రాష్ట్రాన్ని సమృద్ధితో ముందుకు సాగడానికి అహర్నిశలు తాము కష్టపడుతున్నామని చెబుతున్న బీఆర్ఎస్ పార్టీకి మరోసారి అధికారాన్ని ఇచ్చి, కేసీఆర్ హ్యాట్రిక్ చరిత్రను నిర్మించడానికి తమ సంపూర్ణ మద్దతునిస్తారా.. అనేది మరో రెండు వారాల్లో తేలిపోతుంది.

Also Read:  YCP Samajika Sadhikara Bus Yatra : నేటి నుంచి సామాజిక సాధికార యాత్ర రెండో దశ


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Assembly Elections 2023
  • bjp
  • brs
  • congress
  • hyderabad
  • telangana
  • telangana elections

Related News

BRS gains momentum in the wake of local body elections.. KTR is preparing for state tours

Jubilee Hills Bypoll : బిఆర్ఎస్ లో బయటపడ్డ అంతర్గత విభేదాలు

Jubilee Hills Bypoll : కేటీఆర్ గారి నాయకత్వం ఈ పరిణామంలో ప్రధానంగా ప్రశ్నించబడుతోంది. నిర్ణయాల్లో అస్పష్టత, కీలక సందర్భాల్లో స్పష్టమైన మార్గదర్శకత్వం ఇవ్వకపోవడం వల్ల కార్యకర్తల్లో

  • Gold Price Aug20

    Gold Price : స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

  • Sadar Kishanreddy

    Sadar Celebrations : సదర్ ఉత్సవాలను ప్రారంభించిన కిషన్ రెడ్డి

  • Sadar Sammelan

    Sadar Sammelan: సదర్ సమ్మేళనానికి సర్వం సిద్ధం.. సీఎం రేవంత్ రెడ్డి రాక!

  • Bandh Effect

    BC Bandh in Telangana : దీపావళి వ్యాపారంపై బంద్ ప్రభావం?

Latest News

  • Bank of Baroda Jobs : బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

  • Bambino Agro Industries : బాంబినో వ్యవస్థాపకుడి కుటుంబంలో ఆస్తి వివాదం

  • Diwali Celebration : సమంత దీపావళి సెలబ్రేషన్స్ ఎక్కడ జరుపుకుందో తెలుసా..?

  • Air Pollution : ప్రమాదకర స్థాయిలో ఎయిర్ పొల్యూషన్

  • CBN Visit Abroad : నేడు విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు

Trending News

    • Suryakumar Yadav: టీమిండియాలో విభేదాలున్నాయా? గిల్‌పై సూర్య‌కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

    • Confirm Ticket: ఐఆర్‌సీటీసీతో ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ యాప్స్‌తో టికెట్స్ బుక్ చేసుకోవ‌చ్చు!

    • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

    • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd