Amit Shah: భాగ్యలక్ష్మి ఆలయంలో అమిత్ షా పూజలు
తెలంగాణ నుంచి లోకసభ ఎన్నికల్లో కనీసం 10 సీట్లను సాధించేందుకు అమిత్ షా వ్యూహాత్మక విధానాన్ని రూపొందించనున్నారు.అయితే సన్నాహక సమావేశానికి హాజరయ్యే ముందు అమిత్ షా చార్మినార్ సమీపంలోని భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
- By Praveen Aluthuru Published Date - 05:45 PM, Thu - 28 December 23
Amit Shah: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో పర్యటించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈ మేరకు రంగారెడ్డిలోని కొంగరకలాన్లో 1200 మంది బీజేపీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, డీకే అరుణ, బండి సంజయ్, ధర్మపురి సహా బీజేపీ సీనియర్ నేతలతో ఆయన సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి కేసరి పార్టీ మండల, జిల్లా అధ్యక్షులను ఆహ్వానించింది బీజేపీ.
తెలంగాణ నుంచి లోకసభ ఎన్నికల్లో కనీసం 10 సీట్లను సాధించేందుకు అమిత్ షా వ్యూహాత్మక విధానాన్ని రూపొందించనున్నారు.అయితే సన్నాహక సమావేశానికి హాజరయ్యే ముందు అమిత్ షా చార్మినార్ సమీపంలోని భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
2019 లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఆ పార్టీ కేవలం 4 సీట్లు మాత్రమే గెలుచుకుంది. గతంలో జరిగిన ఉప ఎన్నికలు మరియు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో గెలిచి ఒక సమయంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్షంగా తయారైంది.తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాలకు 8 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంది.
తెలంగాణ ప్రజల యోగక్షేమాలకోసం, ప్రధానిగా శ్రీ @narendramodi గారికి హ్యాట్రిక్ విజయాన్ని కాంక్షిస్తూ భాగ్యలక్ష్మీ అమ్మవారి సన్నిధిలో కేంద్ర హోం, సహకారశాఖ మంత్రి శ్రీ @AmitShah గారి ప్రత్యేక పూజలు.#AmitShahInTelangana pic.twitter.com/ouxyaDxDWX
— BJP Telangana (@BJP4Telangana) December 28, 2023
Related News
Rythu Bandhu : మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్.. రైతు బంధు నిధులు విడుదల
రైతు బంధు (భరోసా) కింద రూ.2వేల కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. వీటితో పాటు పంట నష్ట పరిహారం కింద ఎకరానికి రూ.10వేల నిధులను కూడా ఈసీ అనుమతితో ప్రభుత్వం విడుదల చేయడం విశేషం.