HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Acb Enters The Fray Over Kaleshwaram Project Irregularities

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్ట్‌ అక్రమాలపై రంగంలోకి ఏసీబీ?!

విజిలెన్స్ లేఖ అందిన తర్వాత ఏసీబీ డైరెక్టర్ జనరల్ (DG) దీనిని తదుపరి చర్యల కోసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (CS) కార్యాలయానికి పంపారు. ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ (అనుమతి) వచ్చిన వెంటనే ఏసీబీ ఈ అక్రమాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు ప్రారంభించనుంది.

  • Author : Gopi Date : 29-09-2025 - 10:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kaleshwaram Project
Kaleshwaram Project

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project)లో జరిగిన అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. ఈ అక్రమాలపై లోతుగా దర్యాప్తు జరిపించాలని కోరుతూ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం నేరుగా అవినీతి నిరోధక శాఖ (ACB)కి లేఖ రాసింది. ఈ కీలక పరిణామంతో రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ భారీ ప్రాజెక్టు స్కామ్‌పై త్వరలో ఏసీబీ దర్యాప్తు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

ఏసీబీకి విజిలెన్స్ లేఖలో ఏముంది?

విజిలెన్స్ శాఖ రాసిన లేఖలో ప్రధానంగా రెండు అంశాలను ప్రస్తావించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకల కారణంగా ప్రభుత్వ ఖజానాకు ఎంత నష్టం వాటిల్లిందనే దానిపై కూలంకషంగా దర్యాప్తు చేయాలని కోరింది. కాంట్రాక్టర్ల నుండి ప్రాజెక్టులో బాధ్యత వహించిన వ్యక్తులు, అధికారులు ఏ విధంగా లబ్ది పొంది, అక్రమంగా ఆస్తులు సంపాదించారు అనే విషయంపై కూడా విచారణ జరిపి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ కోరింది. విజిలెన్స్ లేఖ అందిన తర్వాత ఏసీబీ డైరెక్టర్ జనరల్ (DG) దీనిని తదుపరి చర్యల కోసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (CS) కార్యాలయానికి పంపారు. ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ (అనుమతి) వచ్చిన వెంటనే ఏసీబీ ఈ అక్రమాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు ప్రారంభించనుంది.

Also Read: Team India: ఆసియా క‌ప్ ట్రోఫీ లేకుండానే సంబ‌రాలు చేసుకున్న టీమిండియా!

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలు ఏమిటి?

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కలల ప్రాజెక్టుగా చెప్పబడిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణంలో అనేక అక్రమాలు జరిగినట్లు గత కొంత కాలంగా తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా కింది అంశాలపై విజిలెన్స్ నివేదికలు, నిపుణుల పరిశోధనలలో ప్రశ్నలు తలెత్తాయి. ముఖ్యంగా ప్రాజెక్టులోని ముఖ్య భాగాలైన పంపుహౌస్‌లు, కాలువలు, రిజర్వాయర్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను పాటించలేదని ఆరోపణలు ఉన్నాయి. పంపుహౌస్‌లు మునిగిపోవడం, పైపులైన్లలో లీకేజీలు వంటివి ఈ ఆరోపణలకు బలం చేకూర్చాయి. ప్రారంభంలో ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 40,000 కోట్లుగా ఉండగా, నిర్మాణ సమయంలో అది సుమారు రూ. 1.2 లక్షల కోట్లకు పెరిగింది. ఈ అంచనా వ్యయం పెంపులో అనవసరమైన ఖర్చులు, ఎక్కువ ధరలకు పనులు అప్పగించడం వంటి అవకతవకలు జరిగాయని విమర్శకులు ఆరోపించారు. అంతేకాకుండా ప్రాజెక్టును రీ-డిజైన్ చేయడం ద్వారా దాని పరిధిని పెంచడం ద్వారా, అనవసరపు నిర్మాణాలకు నిధులు కేటాయించడం ద్వారా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారని విజిలెన్స్ నివేదికలు సూచించాయి.

పనుల టెండర్లు, కేటాయింపులలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి, అనుకూలమైన కాంట్రాక్టర్లకు పెద్ద మొత్తంలో పనులు అప్పగించడం ద్వారా ప్రభుత్వంలోని కొందరు లబ్ది పొందారని ఆరోపణలు ఉన్నాయి. ఏసీబీ దర్యాప్తు ప్రారంభమైతే ఈ అక్రమాలకు పాల్పడిన కాంట్రాక్టర్లు, అధికారులు, వారి వెనుక ఉన్న రాజకీయ నాయకుల పాత్ర పూర్తిగా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ACB
  • CM Revanth Reddy
  • hyderabad
  • kaleshwaram project
  • telangana
  • telugu news

Related News

MIssing Case

Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

ఫిన్లాండ్‌లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి 45 రోజులుగా అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. కుమారుడి ఆచూకీ కోసం తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులు చివరకు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హయత్‌నగర్‌కు చెందిన గుజ్జ మణిదీప్ రెడ్డి, ఫిన్లాండ్‌లోని లాహ్తిలో ఉన్న LUT యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్నాడు. మే 5న తన కుటుంబ సభ్యులతో చివరిసారిగా మాట్లాడిన తర

  • Pawan Kalyan inaugurated the Jana Sena Party office in Telangana.

    Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Engineering counselling in Telangana begins today.

    TS EAPCET 2026: తెలంగాణలో నేటి నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్

  • Iran and the US sign peace agreement.

    US-Iran Peace Deal: శాంతి ఒప్పందంపై ఇరాన్, అమెరికా సంతకాలు

  • Big alert for candidates: NEET 're-exam' date fixed.

    NEET: అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. నీట్‌ ‘రీ–ఎగ్జామ్‌’ డేట్ ఫిక్స్

Latest News

  • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

  • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

  • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

  • Pregnancy: పీరియడ్స్ టైం లో శృంగారంలో పాల్గొంటే ప్రెగ్నెన్సీ వచ్చినట్లేనా..?

  • Cm Vijay: కర్ణాటక ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd