TS : దారుణం..పొలంలో మంటలు అంటుకుని రైతు సజీవదహనం..!!
చలిగా ఉందని ఓ రైతు పొలం వద్ద చలి మంట వేసుకున్నాడు. దాని పక్కన మంచంపై పడుకున్నాడు
- By hashtagu Published Date - 07:48 AM, Wed - 12 October 22
చలిగా ఉందని ఓ రైతు పొలం వద్ద చలి మంట వేసుకున్నాడు. దాని పక్కన మంచంపై పడుకున్నాడు. ఆ చలి మంట తగిలి షెడ్డుకు నిప్పు అంటుకుంది. గడ్డి ఎక్కువగా ఉండటంతో మంటలు వ్యాపించాయి. వాటిలోనే రైతు సజీవదహనం అయ్యాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లా బైంసా మండలం ఎగ్గాంలో చోటుచేసుకుంది. భూమన్న రైతు పందుల బారి నుంచి పొలాన్ని కాపాడుకునేందుకు ప్రతిరోజూ రాత్రి పొలానికి వెళ్తుంటాడు. అదే విధంగా సోమవారం కూడా వెళ్లాడు. చలి ఎక్కువగా ఉండటంతో చలిమంట వేసుకున్నాడు. నిద్రలోకి వెళ్లడంతో ఆ మంటలు గడ్డి నుంచి షెడ్డుకు వ్యాపించాయి. దీంతో భూమన్న సజీవదహనం అయ్యాడు. మంగళవారం ఉదయం వ్యవసాయ పనుల కోసం అటుగా వెళ్లిన గ్రామస్తులు ప్రమాదాన్ని గుర్తించి భూమన్న కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
Tags
Related News
KTR: కేటీఆర్ ని నిలదీసిన మహిళ రైతు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యేకేటీఆర్ కు ఓ మహిళ షాక్ ఇచ్చింది. నా భూమీ నాకివ్వాలని నిలదీసింది. అయితే నీ భూమి నీకు వచ్చేలా చూస్తానని కేటీఆర్ చెప్పినప్పటికీ మహిళ వినిపించుకోలేదు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.