HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >34 Dead Due To Heatstroke In Telangana

Sunstroke: తెలంగాణలో వడదెబ్బతో 34 మంది మృతి

  • Author : Vamsi Chowdary Korata Date : 23-05-2026 - 4:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
34 Dead Due to Heatstroke in Telangana
34 Dead Due to Heatstroke in Telangana

రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఇప్పటివరకు తెలంగాణలో వడదెబ్బతో 34 మంది చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇక వడదెబ్బ మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

తెలంగాణ రోజురోజుకూ నిప్పుల కుంపటిగా మారుతోంది. రికార్డు స్థాయిలో 47 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. తీవ్ర భయాందోళనలు నెలకొంటున్నాయి. ఎండ తీవ్రత నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సూచనలు చేసిన సంగతి తెలిసిందే. అత్యవసరమైతే తప్ప ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇళ్ల నుంచి బయటికి రావద్దని సూచించింది. ఇక మధ్యాహ్నం పూట ప్రజల కోసం బయట ఏర్పాట్లు చేయాలని అధికారులకు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్రంలో ఎండలు, వడగాలులు, వడదెబ్బ పరిస్థితులపై అత్యవసర సమీక్ష నిర్వహించారు.

ఈ క్రమంలోనే రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్న నేపథ్యంలో ప్రజలంతా మరింత అలెర్ట్‌గా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక సూచనలు చేశారు. పిల్లలు, వృద్ధులు అత్యవసరమైతేనే బయటికి రావాలని తేల్చి చెప్పారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల వద్ద ప్రజలకు మజ్జిగ, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక వడదెబ్బతో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు రూ.4 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. గతంలో వడదెబ్బ పరిహారం రూ.50 వేలు ఉండగా దాన్ని రూ.4 లక్షలకు పెంచినట్లు గుర్తు చేశారు.

ఇక తెలంగాణలో రోజురోజుకు ఎండల తీవ్రత పెరిగిపోతుండగా.. 18కి పైగా జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే 18 జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మరోవైపు.. హైదరాబాద్‌ నగరంలోనూ 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా వడగాలులపై హై అలర్ట్ ప్రకటించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు అలెర్ట్‌గా ఉండాలని సూచించారు.

రాష్ట్రంలో ఎండల తీవ్రతకు సంబంధించి.. గంట గంటకు ప్రజలకు హెచ్చరికలు జారీ చేసినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. గర్భిణులు, వృద్ధులు, చిన్నారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎవరైనా ఎండదెబ్బకు గురైతే.. వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించి.. అత్యవసర చికిత్స అందించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • heatwave
  • Minister Ponguleti Srinivas Reddy
  • red alert
  • sunstroke
  • Sunstroke dies
  • telangana

Related News

Condom packet in a beer bottle

Condom Packet: బీరు సీసాలో కండోమ్ ప్యాకెట్

బీర్ బాటిళ్లలో పురుగులు, బల్లులు రావడం గురించి విన్నాం. కానీ, ఏకంగా సీల్ చేసిన బీరు బాటిల్‌లోనే కండోమ్ ప్యాకెట్ రావడం సిద్దిపేట జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనతో బీరు ప్రియులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట భూంపల్లిలోని లక్ష్మీ నరసింహ వైన్ షాపులో ఓ వ్యక్తి కింగ్‌ఫిషర్ లైట్ బీర్లు కొనుగోలు చేశాడు. ఇంటికి వెళ్లి కొన

    Latest News

    • Chandrababu Naidu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

    • Peddi Movie: పెద్ది సినిమా బ్రేక్.. షాక్ ఇచ్చిన ఎగ్జిబిటర్ల

    • PM Modi: మోదీతో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భేటీ..

    • Sunstroke: తెలంగాణలో వడదెబ్బతో 34 మంది మృతి

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    Trending News

      • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

      • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

      • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

      • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

      • Rahul Gandhi: దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతోంది : రాహుల్‌ గాంధీ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd