HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >10 Rice Millers Owe Rs 605 Crores To Telangana Civil Supplies Corporation Why

Rice Millers : సర్కారుకు రూ.605 కోట్లు బకాయిపడ్డ 10 మంది మిల్లర్లు

ఇద్దరిది కరీంనగర్‌ జిల్లా. నాగర్‌కర్నూల్, నిజామాబాద్‌ జిల్లాల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. వీరిలో ఎనిమిది మంది బాయిల్డ్‌ రైస్‌ మిల్లుల యజమానులు(Rice Millers).

  • Author : Pasha Date : 20-11-2024 - 10:58 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana Rice Millers Civil Supplies Corporation

Rice Millers : తెలంగాణ పౌర సరఫరాల సంస్థ రాష్ట్రవ్యాప్తంగా రైతుల నుంచి పెద్దఎత్తున ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంటుంది. ఈ ధాన్యాన్ని బియ్యంగా మార్చేందుకు మిల్లర్లకు అప్పగిస్తుంటుంది.  ఇలా పౌర సరఫరాల సంస్థ అప్పగించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసే క్రమంలో కొందరు మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. ధాన్యం మిల్లింగ్ వ్యవహారంలో 10 మంది మిల్లర్లు పౌర సరఫరాల సంస్థకు దాదాపు రూ.605 కోట్లు బకాయిపడినట్లు తెలుస్తోంది. జరిమానాతో కలుపుకుంటే.. ఇది దాదాపు రూ.720 కోట్లు అవుతుంది. ఈ పది మంది మిల్లర్లలో ఆరుగురు సూర్యాపేట జిల్లావారే. ఇద్దరిది కరీంనగర్‌ జిల్లా. నాగర్‌కర్నూల్, నిజామాబాద్‌ జిల్లాల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. వీరిలో ఎనిమిది మంది బాయిల్డ్‌ రైస్‌ మిల్లుల యజమానులు(Rice Millers). మిగతా ఇద్దరు రా రైస్‌ మిల్లర్లు. పౌర సరఫరాల  సంస్థ కేటాయించిన దాదాపు 1.67 లక్షల టన్నుల బియ్యాన్ని వీరు పక్కదారి పట్టించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటివరకు ఆ పది మంది మిల్లర్ల నుంచి 12,972 టన్నుల బియ్యాన్ని మాత్రమే అధికారులు రాబట్టగలిగారు.

Also Read :AR Rahman Divorce : భార్య సైరాకు విడాకులు.. ఏఆర్ రెహమాన్ ఎమోషనల్ మెసేజ్

అత్యధిక బకాయిలు ఈ మిల్లర్లవే..

  • సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలోని ఓ మిల్లర్‌ నుంచి జరిమానాతో కలుపుకొని రూ.144 కోట్లు విలువైన బియ్యం బకాయిలు తెలంగాణ పౌర సరఫరాల సంస్థకు రావాల్సి ఉంది.
  • సూర్యాపేట జిల్లా ప్రగతినగర్‌లోని ఒక మిల్లర్‌ నుంచి జరిమానాతో కలుపుకొని రూ.129  కోట్ల బకాయిలు రావాల్సి ఉంది.
  • కరీంనగర్‌ జిల్లా శ్రీరాములపల్లిలోని ఒక మిల్లర్‌ నుంచి జరిమానాతో కలుపుకొని రూ.67  కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. ఇదే జిల్లాలోని ఒక మిల్లర్‌ నుంచి రూ.49.69 కోట్లు బకాయిలు రావాలి.
  • నిజామాబాద్‌ జిల్లా కారేగావ్‌లోని ఒక మిల్లర్ నుంచి రూ.47.75 కోట్ల బకాయిలు రావాలి.

Also Read :Suicide Attack : ఉగ్రవాదుల సూసైడ్ ఎటాక్.. 10 మంది పాక్ సైనికులు మృతి

ఈ పదిమంది మాత్రమే కాదు.. తెలంగాణవ్యాప్తంగా మొత్తం 1,177 మంది మిల్లర్లు రాష్ట్ర పౌర సరఫరాల సంస్థకు  బకాయిపడ్డారు. నిజామాబాద్‌ జిల్లాలో 90 మంది మిల్లర్లు నుంచి  దాదాపు రూ.290 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. దీనిపై ఇటీవలే రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వనపర్తి జిల్లాలో ఓ మిల్లర్‌ భారీగా బకాయిలు కట్టాల్సి ఉన్నా.. రాజకీయ పలుకుబడి కారణంగా అధికారులు అతడి జోలికి వెళ్లడం లేదని తెలుస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • rice millers
  • telangana
  • Telangana Civil Supplies Corporation
  • Telangana Millers
  • Telangana Rice

Related News

Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలకు కొత్త దిశానిర్దేశం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం అన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హెచ్‌ఐసిసిలో “గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్”ను ప్రారంభిస్తూ, “రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలను కూడ

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

  • Draft Of 'core Urban Region

    GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

Latest News

  • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

  • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

  • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

  • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd