Xiaomi 13 Pro: మార్కెట్ లోకి షియోమీ 13 ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమీ ఇప్పటికే మార్కెట్లోకి పలు రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల
- By Anshu Published Date - 07:00 AM, Fri - 10 February 23

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమీ ఇప్పటికే మార్కెట్లోకి పలు రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే షియోమీ సంస్థ త్వరలోనే భారత మార్కెట్లోకి మరోసారి కొత్త స్మార్ట్ ఫోన్ విడుదల చేయనుంది. షియోమీ 13 ప్రో పేరుతో రిలీజ్ అవుతున్న ఈ స్మార్ట్ఫోన్ను ఫిబ్రవరి 26న రాత్రిం 9:30లకు గ్రాండ్ ఈవెంట్లో లాంచ్ చేయనుంది. అయితే ఈ ఈవెంట్ ను షియోమీ కంపెనీ ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఈ ఈవెంట్ ద్వారా ఫోన్ అధికారికంగా భారత్లోకి అడుగపెట్టనుంది. అయితే ఇప్పటికే ఈ స్మార్ట్ఫోన్ గత ఏడాది డిసెంబర్ లో చైనాలో లాంచ్ అయ్యింది.
అక్కడ ఈ ఫోన్ ధర రూ. 61,000 వరకు ఉంది. కానీ భారత్ లో అంత కంటె తక్కువ ధరకు లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్తే.. షియోమీ 13 ప్రో సరికొత్త క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8జెన్ 2 ఎస్ఓసి ప్రాసెసర్ తో రన్ అవుతుంది. గరిష్టంగా 12జీబీ ర్యామ్, 512జిబి ఇంటర్నల్ స్టోరేజీతో జత చేయబడింది. ఈ ఫోన్ 120Hz వరకు రిఫ్రెష్ రేట్ సపోర్టుతో 6.78 అంగుళాల 2K డిస్ప్లేతో వస్తుంది. ఇది బ్యాక్ 50 ఎంపీ ప్రైమరీ కెమెరా కోసం 1 ఇంచు సోనీ IMX989 సెన్సార్తో పనిచేస్తుంది. దానికి తోడు . 50 ఎంపీ టెలిఫోటో సెన్సార్, 5మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్ కూడా ఉన్నాయి.
కాగా ఈ ఫోన్ 120వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కు మద్దతునిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్లో 4820ఎంహెఏచ్ బ్యాటరీ సామర్థ్యంను కలిగి ఉండనుంది. వన్ప్లస్ తన ఫ్లాగ్షిప్ వన్ప్లస్ 11ని తక్కువ ధరకు విడుదల చేయడంతో ఇప్పుడు రాబోయే ఈ కొత్త షియోమీ ఫోన్పై ఎంత ధర ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఫోన్ డివైస్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత MIUI 14లో రన్ అవుతుంది. కానీ భారత్ లో ఈ మొబైల్ ధర ఇంకా లీక్ కాలేదు. వన్ ప్లస్ తన స్మార్ట్ ఫోన్ 11ను భారత్ లో తక్కువ ధరకే విడుదల చేసిన సంగతి తెలిసిందే.