Nokia G42 5G: మార్కెట్లోకి మరో నోకియా కొత్త స్మార్ట్ ఫోన్.. ధర ఫీచర్స్ మామూలుగా?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ నోకియా ఇప్పటికీ మార్కెట్లోకి ఎన్నో అద్భుతమైన ఫీచర్ లు కలిగిన స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసింద
- By Nakshatra Published Date - 07:37 PM, Mon - 11 September 23
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ నోకియా ఇప్పటికీ మార్కెట్లోకి ఎన్నో అద్భుతమైన ఫీచర్ లు కలిగిన స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్న నోకియా సంస్థ తాజాగా మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ కూడా విడుదల చేసింది. నోకియా కంపెనీ కొత్త నోకియా జీ42 5జీ స్మార్ట్ఫోన్ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. సెప్టెంబర్ 11న భారత్లో ఈ ఫోన్ను విడుదల చేసింది.
ఈ ఫోన్ మనకు పర్పుల్, పింక్ డిజైన్ను కలిగి ఉంటుంది. అలాగే సెల్ఫీ స్నాపర్, స్లిమ్ బెజెల్స్ కోసం వాటర్డ్రాప్ నాచ్ అందించబడింది.
ఇది వాల్యూమ్ రాకర్, పవర్ బటన్తో పాటు ఫింగర్ ప్రింట్ సెన్సార్ను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. అలాగే ఇందులో ట్రిపుల్ కెమెరా ఇవ్వబడింది. టీజర్లో ఎల్ఈడీ ఫ్లాష్ కూడా క్యాప్చర్ చేయబడింది. ఇకపోతే నోకియా G42 5G ఫీచర్ ల విషయానికి వస్తే.. నోకియా G42 5G స్మార్ట్ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్తో 6.56-అంగుళాల IPS LCD HD+ డిస్ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, సెల్ఫీ షూటర్ కోసం వాటర్డ్రాప్ నాచ్ని కలిగి ఉంది. హ్యాండ్సెట్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 480+ SoC, గ్రాఫిక్స్ కోసం Adreno GPUతో అందించింది కంపెనీ. అలాగే ఈ ఫోన్ 4జీబీ 6జీబీ ర్యామ్, 128జీబీ నిల్వతో వస్తుంది. మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా దీనిని మరింత విస్తరించవచ్చు. 5జీబీ వర్చువల్ ర్యామ్ సపోర్ట్ చేస్తుంది.
నోకియా G42 స్మార్ట్ఫోన్ Android 13 OS పై రన్ అవుతుంది. ఇకపోతే కెమెరా విషయానికి వస్తే.. 50ఎంపీ ప్రధాన కెమెరా, 2ఎంపీ మాక్రో లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ మాడ్యూల్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో చాట్ల కోసం ముందు భాగంలో 8-మెగాపిక్సెల్ కెమెరా అందించింది. అలాగే ఈ ఫోన్ 20 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 5,000mAh బ్యాటరి సామర్థ్యంను కలిగి ఉండనుంది. కనెక్టివిటీ ఎంపికలలో 5జీ, 4జీ LTE, Wi-Fi, బ్లూటూత్, జీపీస్ మరియు USB టైప్-సి పోర్ట్ ఛార్జర్ ఉన్నాయి. అలాగే ఇతర భద్రతా కోస సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, నీరు, ధూళి నిరోధకత కోసం IP52 రేటింగ్, 3.5mm ఆడియో జాక్ ను కూడా అందించారు.
Related News
Raghuram Rajan : ‘‘భారత్ పేద దేశం కూడా’’.. ఆర్బీఐ మాజీ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
భారత్ అభివృద్ధి చెందుతున్న దేశమా ? అత్యంత పేద దేశమా ? అంటే ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.