iQoo Neo 9 Pro: మార్కెట్లోకి విడుదల కాబోతున్న ఐక్యూ సరికొత్త స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ మాములుగా లేవుగా?
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఐక్యూ ఇప్పటికే భారత మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటితోపాట
- By Nakshatra Published Date - 04:00 PM, Sun - 18 February 24
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఐక్యూ ఇప్పటికే భారత మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటితోపాటు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. అందులో భాగంగానే త్వరలో ఐక్యూ నియో9 పేరుతో ఈ నెల 22న భారత మార్కెట్లోకి కొత్త ఫోన్ను తీసుకొస్తోంది. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ను అందించనున్నారు. ఇక ఈ ఫోన్లో కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. 50-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 920 నైట్ విజన్ కెమెరా, 8-మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాతో కూడిన డ్యూయల్ రేర్ కెమెరా సెటప్ ఈ ఫోన్ సొంతం.
ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను అందిస్తున్నారు. అలాగే ఐక్యూ నియో9 ప్రో ఫోన్లో 144 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో పాటు 6.78 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లేను అందించనున్నారు. 3000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ ఈ స్మార్ట్ ఫోన్ సొంతం. ఈ స్మార్ట్ ఫోన్ను 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్లలో లాంచ్ చేస్తున్నారు. ఐక్యూ నియో 9 ప్రో స్మార్ట్ ఫోన్లో 120 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ చేసే 5160 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీని అందించనున్నారు.
కనెక్టివిటీ విషయానికొస్తే 5జీ, 4జీ, 3జీ, 2జీ, వై-ఫై, జీపీఎస్, ఎన్ఎఫ్సీ, బ్లూటూత్, యూఎస్బీ టైప్ సీ చార్జింగ్ పోర్ట్, ఆడియో జాక్ను అందిస్తున్నారు. ఇకపోతే ఈ ఫోన్ ధర విషయానికి వస్తే.. ఐక్యూ నియో 9 ప్రో ప్రారంభ వేరియంట్ను రూ. 34,999గా నిర్ణయించారు. అయితే లాంచింగ్ ఆఫర్లో భాగంగా డిస్కౌంట్ లభించనుందని సమాచారం. ఫిబ్రవరి 22న ఈ ఫోన్ లాంచ్ అవుతుండగా సేల్స్ ఎప్పటి నుంచి మొదలవుతాయన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.
Related News
Maldives : దౌత్య పరమైన విభేదాలు..భారత పర్యటనకు రానున్న మాల్దీవుల విదేశాంగ మంత్రి
India and Maldives: భారత్ , మాల్దీవుల మధ్య దౌత్యపరమైన విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే “మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ మే 9న అధికారిక పర్యటన నిమిత్తం భారత్కు రానున్నారు” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) మంగళవారం తెలిపింది. మాల్దీవుల చైనా అనుకూల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ ఆరు నెలల క్రితం పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాల్దీవుల విదేశాంగ మంత్రి మూస�