Education Minister Nara Lokesh
-
#Andhra Pradesh
CM Chandrababu: ఏపీ విద్యార్థులకు గుడ్న్యూస్.. విద్యా రుణాలపై వడ్డీలో 4% రాయితీ
ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు తీపికబురు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రుణాలపై వడ్డీలో నాలుగు శాతం రాయితీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. దేశ, విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అమరావతిలోని సచివాలయంలో నిర్వహించిన 235వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల కోసం కేంద్రం పీఎం విద్యాలక్ష్మి పథకం కింద రూ.10 లక్షల వరకు ఎలాంటి పూచీకత్తు […]
Date : 20-06-2026 - 11:42 IST -
#Andhra Pradesh
Talliki Vandanam: ఆ రోజు మీ అకౌంట్ లోకి తల్లికి వందనం.. డేట్ ఫిక్స్
రాష్ట్ర విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి, విద్యార్థులకు నాణ్యమైన భవిష్యత్తును అందించే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా, విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ విద్యాశాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఆర్థిక సాయం అందించే ‘తల్లికి వందనం’ పథకాన్ని జులై మూడో వారంలో అమలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. దీంతో పాటు, పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య […]
Date : 16-06-2026 - 4:59 IST -
#Andhra Pradesh
Jonty Rhodes: మంత్రి నారా లోకేశ్ను కలిసిన దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ జాంటీ రోడ్స్
ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, దక్షిణాఫ్రికా లెజెండరీ క్రికెటర్ జాంటీ రోడ్స్తో భేటీ అయ్యారు. క్రీడల్లో తన అభిరుచి, క్రమశిక్షణ, నైపుణ్యంతో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో తరాల క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచిన జాంటీ రోడ్స్ను కలవడం ఆనందంగా ఉందని లోకేశ్ పేర్కొన్నారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను ఆయన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ భేటీలో క్రీడలు, యువత అభివృద్ధి, క్రీడల్లో అత్యుత్తమ సంస్కృతిని నెలకొల్పడం వంటి అంశాలపై తామిద్దరం ఆసక్తికరంగా చర్చించుకున్నామని లోకేశ్ […]
Date : 16-06-2026 - 3:03 IST -
#Andhra Pradesh
Thalliki Vandanam: తల్లికి వందనం డబ్బులు పడేది ఆరోజే!
మరికొన్ని రోజులలో పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో, తల్లికి వందనం పథకం ఎప్పుడు అమలు చేస్తారా అనే ఆసక్తి విద్యార్థుల తల్లిదండ్రులలో నెలకొంది. ఈ నేపథ్యంలో తల్లికి వందనం పథకంపై మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తల్లికి వందనం పథకం అర్హుల జాబితాను పూర్తి పారదర్శకంగా రూపొందించాలంటూ అధికారులను ఆదేశించారు. పాఠశాలలు తెరుచుకున్న రోజే విద్యార్థులకు యూనిఫామ్, పుస్తకాలు, బ్యాగులు, షూలు అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జూన్ నెల మధ్యలోకి వచ్చేసింది. మరికొన్ని […]
Date : 10-06-2026 - 4:56 IST -
#Andhra Pradesh
Thalliki Vandanam: తల్లికి వందనం పథకంపై అప్డేట్..
ఏపీలో విద్యార్థులకు సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా తల్లికి వందనం పథకం కింద రూ.15 వేలు ఇస్తున్న సంగతి తెలిసిందే. జూన్ నెలలో విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమ చేయనున్నారు. అయితే తల్లికి వందనం లబ్ధిదారులు ఆధార్, బ్యాంక్ అకౌంట్కు అనుసంధానం చేసి ఉండాలని, ఒకవేళ చేయకపోతే వెంటనే ఆ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు ‘తల్లికి వందనం’ పథకం అమలు చేస్తోంది. 1వ తరగతి నుంచి ఇంటర్ […]
Date : 23-05-2026 - 11:18 IST -
#Andhra Pradesh
Nara Lokesh: వైఎస్ జగన్కు భాస్కర్ అవార్డు ఇవ్వొచ్చు : నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘గొడ్డలి పార్టీ’, ‘హత్యా రాజకీయాలు’ అనే అంశాలపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం పీక్స్కు చేరింది. నిన్న వైసీపీ అధినేత జగన్ ప్రెస్మీట్ పెట్టి చంద్రబాబుపై చేసిన ఆరోపణలకు… ఈరోజు కడపలో జరిగిన టీడీపీ కార్యకర్తల సమన్వయ సమావేశంలో మంత్రి నారా లోకేశ్ అత్యంత ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. వైసీపీకి తాను కొత్తగా ‘గొడ్డలి పార్టీ’ అని పేరు పెడితే జగన్ బాగా ఫీల్ అయ్యారని… కానీ గతంలో థియేటర్లలో ‘రప్పారప్పా’ అంటూ […]
Date : 22-05-2026 - 11:29 IST -
#Andhra Pradesh
Mahanadu 2026: ‘స్త్రీ శక్తి’ థీమ్తో టీడీపీ మహానాడు.. తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం.!
తెలుగుదేశం పార్టీ ఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మహానాడు ఈసారి ‘స్త్రీ శక్తి’ థీమ్తో జరగనుంది. ఈ మేరకు పార్టీ పొలిట్ బ్యూరో కీలక నిర్ణయం తీసుకుంది. మే 27, 28 తేదీల్లో హైబ్రిడ్ విధానంలో జరగనున్న మహానాడులో మొత్తం 20 తీర్మానాలను ప్రవేశపెట్టాలని తీర్మానించింది. గురువారం నాడు ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం వర్చువల్ పద్ధతిలో జరిగింది. ఇంధన పొదుపు చర్యలలో భాగంగా జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి క్యాంపు […]
Date : 22-05-2026 - 9:07 IST -
#Andhra Pradesh
AP LAWCET 2026 Results: ఏపీ లాసెట్ – 2026 ఫలితాలు విడుదల
ఏపీ లాసెట్ / ఏపీ పీజీ ఎల్ సెట్ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. మొత్తం 23,996 విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని, 19,197 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయినట్లు వెల్లడించారు. ఉత్తీర్ణత 80 శాతంగా ఉందని తెలిపారు. ర్యాంకు కార్డులు అధికారిక వెబ్ సైట్ cets.apsche.ap.gov.in/LAWCET లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టిక్కెట్ నెంబర్ను నమోదు చేసి స్కోర్ కార్డులను […]
Date : 18-05-2026 - 4:12 IST -
#Andhra Pradesh
AP ICET Results: ఏపీ ఐసెట్-2026 ఫలితాలు విడుదల
ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఐసెట్ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. ఈ పరీక్షకు మొత్తం 23,198 మంది విద్యార్థులు హాజరయ్యారని, ఇందులో 21,205 మంది ఉత్తీర్ణులయ్యారని వెల్లడించారు. ఉత్తీర్ణత శాతం 91.41 అని తెలిపారు. ర్యాంకు కార్డులు అధికారిక వెబ్ సైట్ https://cets.apsche.ap.gov.in/ICET/ICET/ICET_HomePage.aspx లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. వాట్సాప్ నెంబర్ 9552300009 ద్వారా కూడా పలితాలు తెలుసుకోవచ్చు. ఏపీ ఐసెట్ […]
Date : 16-05-2026 - 3:50 IST -
#Andhra Pradesh
AP ECET 2026 results: ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల : నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్లో ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ ఈసెట్-2026) ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శుక్రవారం ఈ ఫలితాలను ‘ఎక్స్’ వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఈ పరీక్షలో మొత్తం 91.72 శాతం ఉత్తీర్ణత నమోదైనట్టు ఆయన వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్ 23న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షకు మొత్తం 32,434 మంది విద్యార్థులు హాజరు కాగా, వారిలో 29,750 మంది అర్హత సాధించారు. ఈసెట్లో అర్హత సాధించిన విద్యార్థులందరికీ మంత్రి […]
Date : 08-05-2026 - 2:42 IST -
#Andhra Pradesh
Nara Lokesh: లోకేశ్ ఆసక్తికర ట్వీట్..
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగానికి భారీ ఊతం లభించింది. ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం, ఐకానిక్ మోటార్సైకిల్ బ్రాండ్ రాయల్ ఎన్ఫీల్డ్ తన నూతన తయారీ యూనిట్ను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయనుంది. 1901లో సంస్థ ప్రారంభమైన నాటి నుంచి తమిళనాడు వెలుపల ఇంత భారీ స్థాయిలో విస్తరించడం ఇదే తొలిసారి కావడం విశేషం. తిరుపతి జిల్లా సత్యవేడులో ఈ అత్యాధునిక తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం కంపెనీ రెండు దశల్లో సుమారు రూ. 2,200 కోట్లు పెట్టుబడిగా పెట్టనుంది. […]
Date : 07-05-2026 - 12:21 IST -
#Andhra Pradesh
Chandrababu Naidu: టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేశ్
Nara Lokesh తెలుగుదేశం పార్టీలో నూతన నాయకత్వానికి, కొత్త సమీకరణలకు అధిష్ఠానం శ్రీకారం చుట్టింది. పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను ప్రకటించింది. ఈ పునర్వ్యవస్థీకరణలో అత్యంత ముఖ్యమైన నిర్ణయంగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఏపీ మంత్రి నారా లోకేశ్ను నియమించారు. ఈ మేరకు టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సీనియర్ల అనుభవానికి, యువత ఉత్సాహానికి సమ ప్రాధాన్యం ఇస్తూ, సామాజిక కోణంలో కమిటీలను […]
Date : 15-04-2026 - 12:28 IST -
#Andhra Pradesh
AP Intermediate Results: ఏపీ ఇంటర్ ఫలితాల విడుదల..12 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా పాస్ పర్సంటేజ్ నమోదు. నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. గడిచిన 12 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని మంత్రి వెల్లడించారు. ఈ ఏడాది కూడా ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ఈ ఏడాది సుమారు 10.50 లక్షల మంది పరీక్షలకు హాజరయ్యారని లోకేశ్ తెలిపారు. గత 12 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది అత్యధిక శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని […]
Date : 15-04-2026 - 11:48 IST -
#Andhra Pradesh
Nara Lokesh: నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ శాశ్వతం, నా రాజధాని అమరావతి అజరామరం.. నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే చారిత్రక ఘట్టం పార్లమెంటులో ఆవిష్కృతమవుతున్న వేళ, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ఆ క్షణాలను టీవీలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. లోక్సభలో అమరావతి బిల్లు ఆమోదం పొందిన వెంటనే ఆయన చప్పట్లు కొట్టి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా, సభలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, బీజేపీ ఎంపీ పురందేశ్వరి అమరావతికి మద్దతుగా మాట్లాడుతున్న దృశ్యాలను తన ఫోన్లో వీడియో తీశారు. View this post on Instagram […]
Date : 01-04-2026 - 3:27 IST -
#Andhra Pradesh
Nara Lokesh: జగన్ కు నారా లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్!!
Amaravati అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ చట్టబద్ధత కల్పించేందుకు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైతే, వైసీపీ సభ్యులు హాజరుకాకపోవడాన్ని మంత్రి నారా లోకేశ్ తప్పుబట్టారు. కేవలం 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఆ పార్టీకి రాజధానిపై ఎంత చిత్తశుద్ధి ఉందో ఈ వైఖరితోనే అర్థమవుతోందని విమర్శించారు. వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఏమిటో, ఆయన జ్ఞానం ఎంతో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. పాదయాత్ర ద్వారా చంద్రబాబు గారికి ‘సినిమా చూపిస్తా’ అని వైసీపీ అధినేత జగన్ […]
Date : 28-03-2026 - 3:20 IST