India T20 Squad WI Tour:కోహ్లీ, బూమ్రాలకు రెస్ట్…విండీస్ తో టీ ట్వంటీలకు భారత్ జట్టు ఇదే
కరేబియన్ టూర్ లో టీ ట్వంటీ సీరీస్ కోసం భారత జట్టును ప్రకటించారు. అంతా ఊహించినట్టుగానే మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇచ్చారు.
- By Naresh Kumar Published Date - 03:24 PM, Thu - 14 July 22
కరేబియన్ టూర్ లో టీ ట్వంటీ సీరీస్ కోసం భారత జట్టును ప్రకటించారు. అంతా ఊహించినట్టుగానే మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇచ్చారు. ఇంగ్లాండ్ టూర్ లో టెస్ట్ , టీ ట్వంటీ సీరీస్ ఆడిన కోహ్లీ ఇంకా ఫామ్ లోకి రాలేదు. గాయం కారణంగా వన్డే సీరీస్ ఆడడం లేదు. అయితే విండీస్ టూర్ నుంచీ రెస్ట్ కావాలని కోహ్లీ ముందే బీసీసీఐకి రిక్వెస్ట్ చేసాడు. అతని విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు.ఆసియాకప్, టీ20 ప్రపంచకప్ ప్రణాళికల్లో అతడు ఉన్నాడని సెలక్టర్లు ధ్రువీకరించారు. అలాగే ఇంగ్లాండ్ టూర్ లో అదరగొడుతున్న బూమృకు కూడా రెస్ట్ ఇచ్చారు.
గాయాల నుంచి కోలుకున్న కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్ పునరాగమనం చేసారు. జర్మనీ లో సర్జరీ చేయించుకుని వచ్చిన రాహుల్ ఫిట్ నెస్ సాధిస్తేనే కరేబియన్ టూర్ కు వెళ్లనున్నాడు. ఇప్పటికే రాహుల్ ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. దాదాపు ఇంగ్లాండ్ టూర్ లో ఉన్న జట్టును ఎంపిక చేసిన బీసీసీఐ అశ్విన్ కు చోటు కల్పించింది.
విండీస్తో వన్డే సిరీసుకు గత వారమే టీమ్ఇండియాను ప్రకటించారు. శిఖర్ ధావన్ జట్టును నడిపిస్తాడని సెలక్టర్లు ప్రకటించారు. రవీంద్ర జడేజా అతడికి డిప్యూటీగా ఉంటాడని పేర్కొన్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా, రిషభ్ పంత్, షమి, హార్దిక్ పాండ్యకు రెస్ట్ ఇచ్చారు. వెస్టిండీస్తో ఐదు టీ20ల సిరీసు జులై 29 నుంచి మొదలై ఆగస్టు 7న ముగుస్తుంది. తొలి మ్యాచ్కు ట్రినిడాడ్లోని బ్రయన్ లారా స్టేడియం వేదిక. ఆ తర్వాతి రెండు మ్యాచులకు సెయింట్ కీట్స్లోని వార్నర్ పార్క్ ఆతిథ్యం ఇవ్వనుంది. చివరి రెండు మ్యాచులు అమెరికాలోని ఫ్లోరిడాలో జరుగుతాయి.
విండీస్ టూర్ కు భారత టీ20 జట్టు :
రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, ఆవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్
Related News
RCB captain: ఆర్సీబీ కెప్టెన్ మారబోతున్నాడా..? హర్భజన్ కామెంట్స్ వైరల్
ఫాఫ్ డు ప్లెసిస్ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చివరి ఐదు మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఆరంభ మ్యాచ్ ల్లో తడబడ్డ ఆ జట్టు గతా ఐదు మ్యాచ్ ల్లో గెలిచి విమర్శకుల నోళ్లు మూయించింది. దీంతో ఈ జట్టు ప్లేఆఫ్ రేసులో కొనసాగుతోంది.