Virat Kohli: దినేష్ కార్తీక్ ను ఇంటర్వ్యూ చేసిన కోహ్లీ.. అడిగిన ప్రశ్నలివే!
గత ఏడాది వేసవిలో క్రికెటర్ దినేష్ కార్తీక్ కామెంటర్ గా మారి.. నాటి భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని ఇంటర్వ్యూ చేశాడు.
- By Hashtag U Published Date - 05:09 PM, Sun - 17 April 22
గత ఏడాది వేసవిలో క్రికెటర్ దినేష్ కార్తీక్ కామెంటర్ గా మారి.. నాటి భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని ఇంటర్వ్యూ చేశాడు. కట్ చేస్తే.. 2022 ఏప్రిల్ 16న విరాట్ కోహ్లీ మైక్ చేతపట్టి.. తనతో పాటు రాయల్ చాలెంజెర్స్ బెంగళూరు (RCB) జట్టు కోసం ఆడుతున్న దినేష్ కార్తీక్ ను ఇంటర్వ్యూ చేశాడు. ఎందుకు ? అంటే.. ఇప్పుడు జరుగుతున్న ఐపీఎల్ లో అద్భుతమైన బ్యాటింగ్ తో RCB కి విజయాలను అందిస్తున్నందుకు!! ఈ ఇంటర్వ్యూ లో దినేష్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
సంజయ్ భాయ్ పిలుపుతో..
“ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్ తర్వాత నాకు RCB హెడ్ కోచ్ సంజయ్ భంగర్ నుంచి పిలుపు వచ్చింది. ఏబీ డివిలియర్స్ ఉన్నంత వరకు RCB కి ఫినిషేర్ బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉండేది. ఇద్దరు, ముగ్గురిని తీసుకున్న.. ఆయన జట్టులో లేని లోటును పూడ్చలేం. మీరు ఇకపై ఏబీ డివిలియర్స్ స్థానంలో దూకుడుగా ఆడాలి అని సంజయ్ భాయ్ నాతో చెప్పారు” అని కార్తీక్ వివరించారు. “నేను ఆయనకు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు ఆడుతున్నాను. ఇటీవల జరిగిన మ్యాచ్ లలో కనబర్చిన ఆటతీరు సంజయ్ భాయ్ ప్రోత్సాహం ఫలితమే ” అని ఆయన చెప్పారు.
తదుపరి లక్ష్యం..
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా కార్తీక్ ను అతడి తదుపరి లక్ష్యాలు ఏంటని విరాట్ కోహ్లీ అడిగాడు. అందుకు సమాధానంగా.. ”భారత్ తరఫున మళ్లీ ఆడాలన్నదే నా లక్ష్యం. టి20 ప్రపంచకప్ ఈ ఏడాది చివర్లో ఉంది. అందులో టీమిండియాకు ఆడాలని లక్ష్యంతో ఉన్నా. అందుకోసం అన్ని విధాలుగా కష్టపడుతున్నాను. ప్రస్తుతం నా ముందున్న ఏకైక లక్ష్యం అదే” అని కార్తిక్ పేర్కొన్నాడు. ” ప్రపంచకప్ లో పాల్గొనే భారత జట్టులో భాగమై.. టీం విజయాల్లో నా వంతు పాత్ర పోషించాలని అనుకుంటున్నా. 2011 తర్వాత మళ్లీ విశ్వ వేదికపై భారత జట్టు కప్పు గెలవలేదు. ఈసారి భారత్ వరల్డ్ కప్ ను నెగ్గాలని కోరుకుంటున్నా‘’ అని ఆయన అన్నాడు. ఈసందర్భంగా విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. ” మీ ఆటతీరును అందరూ గమనిస్తున్నారు. ఇప్పుడు చాలా బాగా ఆడుతున్నారు. మీరు RCB జట్టులో ఫినిషేర్ గా విజయాలను అందిస్తున్న దృశ్యాలను దక్షిణాఫ్రికా లోని ప్రిటోరియా నుంచి ఏబీ డివిలియర్స్ చూస్తూనే ఉన్నారని అనుకుంటా” అని వ్యాఖ్యానించారు.
Related News
IPL 2024: ఐపీఎల్ 2024లో అత్యధిక పరుగులు, సిక్సులు, వికెట్లు తీసిన ఆటగాళ్లు వీరే..!
ఐపీఎల్ -2024 లీగ్ రౌండ్ ముగిసింది. ఈ సీజన్లో చివరి లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయ్యింది.