FA Cup Final; వెంబ్లీ స్టేడియంలో టీమిండియా ఆటగాళ్లు
ఇంగ్లాండ్ వెంబ్లీ స్టేడియంలో జరుగుతున్న ఫా కప్ ఫుట్ బాల్ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు టీమిండియా ఆటగాళ్లతో పాటు మాజీ ఆటగాడు యువరాజ్ కలిసి వెళ్లారు.
- By Praveen Aluthuru Published Date - 02:05 PM, Sun - 4 June 23
FA Cup Final; ఇంగ్లాండ్ వెంబ్లీ స్టేడియంలో జరుగుతున్న ఫా కప్ ఫుట్ బాల్ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు టీమిండియా ఆటగాళ్లతో పాటు మాజీ ఆటగాడు యువరాజ్ కలిసి వెళ్లారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్కు ముందు ఫుట్బాల్ మ్యాచ్ను ఆస్వాదించడానికి టీమిండియా స్టార్ ప్లేయర్లు స్టేడియానికి చేరుకున్నారు. విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి వచ్చారు. అదే సమయంలో శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ మరియు యువరాజ్ సింగ్ కూడా స్టేడియంలో సందడి చేశారు. సూర్య కూడా తన భార్యతో కలిసి వెంబ్లీ స్టేడియంలో మ్యాచ్ను ఎంజాయ్ చేస్తూ కనిపించాడు.
Virat Kohli, Anushka Sharma and Shubman Gill at the FA Cup Final.
King Kohli with the Manchester City jersey! pic.twitter.com/vYwag44pxq
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 3, 2023
ఎఫ్ఎ టోర్నీ ఫైనల్ మ్యాచ్ను ఆస్వాదించేందుకు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి స్టేడియానికి చేరుకున్నారు. కోహ్లి-అనుష్కకు సంబంధించిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విరాట్ కోహ్లి, అనుష్క శర్మలతో పాటు శుభ్మన్ గిల్ కూడా ఫైనల్ మ్యాచ్లో ఉత్కంఠభరితమైన క్షణాల్లో భాగమయ్యాడు. మాంచెస్టర్ సిటీ మరియు మాంచెస్టర్ యునైటెడ్ మధ్య జరిగిన మ్యాచ్ను ఆస్వాదిస్తూ గిల్ కూడా స్టేడియంలో సందడి చేస్తూ కనిపించాడు. గిల్తో పాటు టీమిండియా మాజీ బ్యాట్స్మెన్ యువరాజ్ సింగ్ కూడా ఫుట్బాల్ మైదానానికి చేరుకున్నాడు.
Yuvraj Singh watched the FA Cup Final from the Wembley Stadium. pic.twitter.com/4Vk4eJX5hz
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 3, 2023
ఉత్కంఠభరితమైన ఫైనల్లో మాంచెస్టర్ యునైటెడ్ను 2–1తో ఓడించి మాంచెస్టర్ సిటీ టైటిల్ను గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించడం ద్వారా మాంచెస్టర్ సిటీ నాలుగేళ్ల కలకి తెరపడింది. ఆ జట్టు 2019లో చివరిసారిగా టైటిల్ను కైవసం చేసుకుంది.
Read More: Sharwanand: ఘనంగా నటుడు శర్వానంద్ వివాహం.. పెళ్ళిలో సందడి చేసిన రామ్ చరణ్.. వీడియో వైరల్..!
Tags
Related News
GT vs RCB: ఆర్సీబీ వర్సెస్ గుజరాత్.. గిల్ జట్టుకు డూ ఆర్ డై మ్యాచ్..!
IPL 2024 సీజన్ ఇప్పుడు ట్రేడింగ్ సీజన్గా మారింది. ఈ సీజన్లో పరుగుల పరంగా ఎన్నో రికార్డులు బద్దలవుతున్నాయి. లీగ్ 17వ సీజన్లో దాదాపు ప్రతి మ్యాచ్లో 200 స్కోర్లు చేస్తున్నారు.